AP: టీటీడీ పాలకమండలి సభ్యులు ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం విధివిధానాల అమలుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ముందుగానే ఆన్లైన్లో జారీ చేయాలని, అధికారుల ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.