AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రెండోరోజు భవానీ దీక్షల విరమణ కొనసాగుతుంది. భవానీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈనెల 25వ తేదీ వరకు దీక్షా విరమణలు కొనసాగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం, జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈనెల 25 వరకు ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలను రద్దు చేశారు.