SKLM : భద్రాచలంలో ఆదివారం నిర్వహిస్తున్న “భద్రాద్రి సాంస్కృతిక వారధి పాహి రామప్రభో” అనే పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పొందూరు మండలం లత్సయ్యపేట గ్రామానికి చెందిన సనపల స్నేహాంజలి ప్రదర్శించిన భరతనాట్యం పలువురిని ఆకట్టుకుంది. స్నేహాంజలి ప్రదర్శనకు రామాలయం ట్రస్ట్ యాజమాన్యం ప్రశంసా పత్రం అందించి గౌరవ సత్కారం చేశారు.