జలపాతంలో 11 మంది అయ్యప్పస్వాములు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అయ్యప్ప స్వాములను కాపాడారు. 11 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గ్యాస్ సిలిండర్ లీక్ కావడం వల్ల నలుగురు దుర్మరణం చెందారు. కొత్త గ్యాస్ సిలిండర్కు రెగ్యులేటర్ను సరిగా అమర్చలేదు. దీంతో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కుటుంబంలోని నలుగురు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
తనతో సహజీవనం చేసే యువకుడి ఫోన్లో 13 వేలకు పైగా నగ్న ఫోటోలు ఉండటాన్ని చూసి యువతి షాక్ అయ్యింది. అందులో తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఫోటోలు ఉండటాన్ని గమనించి వారికి తెలిపింది. అందరూ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
గనిలో ఎలివేటర్ కూలిపోవడం వల్ల 11 మంది చనిపోగా మరో 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన సౌత్ ఆఫ్రికాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఓ యువకుడు తన తల్లి చేసిన వంట రుచిగా లేదని కోపంతో రగిలిపోయాడు. ఆవేశంలో తన తల్లిని క్రూరంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. తల్లిని హత్య చేసిన తర్వాత మనస్తాపంతో నిందితులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ శివారు ప్రాంతంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు క్లియర్ చేశారు.
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఆదివారం మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ట్రిపుల్ ఐటీలో ఏదో జరుగుతోందని కలకలం రేగింది.
గ్రేటర్ నోయిడాలో రూ.5 కోట్ల విలువైన బంగారం చోరీకి గురైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆభరణాల యజమాని ఢిల్లీ నుంచి నగలు తీసుకెళ్తుండగా ఆకలేయడంతో భోజనం కోసం ఓ దాబా దగ్గర ఆగాడు.
1997 తర్వాత సౌత్ కొరియాలో తొలి మరణశిక్షను కోర్టు విధించింది. అది కూడా 23 ఏళ్ల యువతికి ఆ మరణశిక్షను విధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశమైంది.