ప్రముఖ కమెడియన్ నటుడు మాథ్యూ పెర్రీ(Matthew Perry) 54 ఏళ్ల వయసులో కన్నుమూశారు. శనివారం లాస్ ఏంజిల్స్లోని తన ఇంట్లో నటుడు శవమై కనిపించాడని అక్కడి మీడియా తెలిపింది. అయితే అతను హాట్ టబ్లో మరణించడం పట్ల ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఆర్థిక సమస్యలు భరించలేక ఓ కుటుంబంలోని ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటన స్థానికలంగా కలకలం రేపింది. చనిపోయిన వారిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఫ్యామిలీ సూసైడ్పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఓ వ్యక్తి ఈజీ మనీ కోసం అమ్మాయిల ఫోటోలతో మార్ఫింగ్ వీడియోలు చేసి అమ్మడం మొదలు పెట్టాడు. ఆ వీడియోలను ట్విట్టర్లో 50 రూపాయలకే అమ్ముతుండటాన్ని సైబర్ పోలీసులు గుర్తించారు. చాకచక్యంగా ఆ వ్యక్తిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
కజకిస్తాన్ గనిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 30 మందికిపైగా మృత్యువాత చెందారు. దీంతో ఈ ఘటనపై అక్కడి దేశాధ్యక్షుడు ఆ గని నిర్వహిస్తున్న సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రోడ్డుకి అడ్డంగా ఉన్న బైక్ను తీయమంటూ హారన్ కొట్టినందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ను కొందరు దుండగులు తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన ఏపీ నెల్లూరు జిల్లాలోని కావలిలో జరిగింది. ఈ ఘటన పట్ల పలువురు అనేక విధాలుగా స్పందిస్తున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ(mukesh ambani)కి చంపేస్తామని బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు శనివారం తెలిపారు. రూ.20 కోట్లు ఇవ్వకుంటే కాల్చి చంపుతానని మెయిలర్ బెదిరించాడని పోలీసులు వెల్లడించారు.
దసరా పండుగ కాదా అని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి(Software employee) ఫ్యామిలీ వారి సొంతూరికి వెళ్లారు. కానీ తిరిగి వచ్చే క్రమంలో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కారు డ్రైవింగ్ చేస్తున్న క్రమంలోనే టైర్ పేలి ఆ ఉద్యోగి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన హైదరాబాద్ బొంగుళూరు ఓఆర్ఆర్ పరిధిలో జరిగింది.
చోరీకి గురయిన మందు గుండు సామగ్రిని సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే పోలీసులు రికవరీ చేసి.. దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేశారు.
కీలక మంత్రి పదవిలో ఉండి కూడా రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కోవిడ్ లాక్డౌన్ సమయంలో కూడా అవినీతి చేశారనే ఆరోపణలోచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఈడీ పశ్చిమ బెంగాల్లో రేషన్ పంపిణీ స్కాం(ration scam) విషయంలో మంత్రి జ్యోతిప్రియ మాలిక్ను విచారించి ఈరోజు తెల్లవారుజామున అరెస్టు చేసింది.
పెండ్లి జరుగుతుండగానే పోలీసులు వచ్చి.. పెండ్లి ఆపండి! వరుడు కేడీ అని చెప్పి బేడీలు వేసే సన్నివేశాలు సినిమాల్లోనే చూస్తుంటాం. అలాంటి సన్నివేశమే నిజజీవితంలోనూ జరిగింది.
స్టాక్ మార్కెట్లో డబ్బు ఇన్వెస్ట్ చేయాలంటే దాని గురించి ఎంతో కొంత తెలియాలి. వాటి గురించి పూర్తిగా తెలుసుకుని అందులో ఇన్వెస్ట్ చేయాలని పలువురు సోషల్ మీడియాను ఆశ్రయిస్తారు. కానీ కొందరు స్టాక్ నిపుణులమని చెప్పి..చట్ట విరుద్ధంగా డబ్బు సంపాదిస్తుంటారు. ఇలాంటి వారిని గుర్తించి వాటిని ఆపడానికి సెబీ ముందుకు వచ్చింది.
కర్నాటక రాష్ట్రం చిక్బళ్లాపూర్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది.
అమెరికాలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. కోట్ల విలువ చేసే డ్రగ్స్ను బియ్యం సంచుల్లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
భూతవైద్యం పేరుతో ఓ మానసిక రోగిని తాంత్రికుడు హింసించి చంపాడు. మహిళ మెడపై కాలుతో తొక్కి హత్య, ప్లాస్టిక్ పైపుతో ఆమెను దారుణంగా కొట్టడంతో ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం పోలీసులు ఆ తాంత్రికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.