దేవరగట్టు బన్నీ ఉత్సవాలలో ఈ ఏడాది అపశృతి జరిగింది.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువన్నామలై వద్ద ఓ టాటా సుమోను బస్సు ఢీకొంది.
బంగ్లాదేశ్ లోని ఢాకా వద్ద రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం చెందగా మరో 100 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ప్రముఖ వ్యాపారవేత్త, వాఘ్ బక్రీ టీ యజమాని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయి వీధి కుక్కల దాడిలో గాయపడ్డ ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
గోదావరి నది వద్దకు విహార యాత్రకు వచ్చి నలుగురు యువకులు మృతిచెందారు. నదిలో స్నానం చేయడానికి దిగి ఓ వ్యక్తి ప్రవాహానికి కొట్టుకుపోయారు. ఈ క్రమంలో అతడిని కాపాడేందుకు వచ్చిన మరో ముగ్గురు స్నేహితులు కూడా నదిలో గల్లంతయ్యారు. పోలీసులు ఆదివారం వారి మృతదేహాలను వెలికితీశారు.
గర్బా డ్యాన్స్ కార్యక్రమాలు ప్రాణాలు తీస్తున్నాయి. గత 24 గంటల్లో గర్బా డ్యాన్స్ వేస్తూ 10 మంది గుండెపోటుతో మరణించారు. ఈ మరణాల నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రత్యేక అంబులెన్స్లు, హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
ఉత్తరప్రదేశ్కు చెందిన లేడీ కానిస్టేబుల్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. కానీ మృతదేహంపై గాయాలు కనిపించడంతో దర్యాప్తు మొదలుపెట్టారు.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ వంతెన శనివారం రాత్రి కుంగిపోయింది. అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు.
బీఎస్ఎఫ్ దళాలు మరోసారి పెద్ద ఎత్తున అక్రమంగా గోల్డ్ తరలిస్తున్న దుండగులను పట్టుకున్నారు. వారి నుంచి ఏకంగా 2.5 కిలోల గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని ఇండో బోర్డర్ సరిహద్దు వద్ద చోటుచేసుకుంది.
ఛత్తీస్గఢ్లోని మోహ్లా-మాన్పూర్ జిల్లా సర్ఖేడాలో నక్సలైట్ల కాల్పుల్లో బీజేపీ నేత బిర్జు తారామ్ మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నరకు జరిగిన కాల్పుల్లో ఈ ఘటన జరిగింది. అయితే ఇటివల కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ వచ్చి నక్సెలైట్లను అణచి వేస్తామని చెప్పిన ఒకరోజు తర్వాతే ఇది జరగడం విశేషం.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI)ని మోసం చేసి ముందుగానే టోల్ వసూలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు అతని బ్యాంక్ బ్యాలెన్స్, ఖాతాలను సీజ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కట్టిన ట్రాఫిక్ చాలన్ల డబ్బులు పక్కదారి పట్టాయి. అయితే వీటిని ఏకంగా ఓ ప్రభుత్వ అధికారి అల్లుడే పక్కదారి పట్టించడం విశేషం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 36 కోట్ల రూపాయలు పక్కకు మళ్లాయి. వీటిని ఆలస్యంగా గుర్తించిన అధికారులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన జయప్రదకు మద్రాసు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఈఎస్ఐ కేసులో ఆమెకు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షను రద్దు చేయమని ఆమె కోర్టును సంప్రదించగా.. ఆమెకు భారీ షాక్ ఇచ్చింది.
బీహార్లో దారుణం చోటు చేసుకుంది. భోజ్పూర్లో శుక్రవారం ఉదయం రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద స్థితిలో తల్లి, ఆమె ఇద్దరు కుమారుల మృతదేహాలు కనిపించాయి.
భార్య రీల్స్ పిచ్చి భరించలేక, ఆ రీల్స్ చూసి తన భార్యను అందరూ చెడుగా మాట్లాడుకోవడం సహించలేక మనస్తాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.