బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో 9 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రవళిక ఆత్మహత్యకు శివరామ్ కారణమని ఆమె తల్లి విజయ అంటున్నారు. అతనికి ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి పేరుతో రూ.5 లక్షలు వసూల్ చేశాడు ఓ పూజారి. అతనిని అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు.
పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ బుద్ది తప్పింది. విద్యార్థినిని బెదిరించి లోబరుచుకున్నాడు. ఆ విద్యార్థిని గర్భం ధరించి, డెలివరీ కావడంతో అసలు విషయం తెలిసింది.
స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగి ఓ మహిళా కండక్టర్ సూసైడ్ చేసుకుంది.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.భాస్కర్ రావు కన్నుమూశారు.
ఘోర రైలు ప్రమాదంలో 5 బోగీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. అమెరికాలో 6 ఏళ్ల ముస్లిం చిన్నారి ప్రాణాలను బలిగొంది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగోలో 71 ఏళ్ల వృద్ధుడు ఈ షాకింగ్ ఘటనకు పాల్పడ్డాడు. 32 ఏళ్ల చిన్నారి తల్లిని కూడా కత్తులతో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు.
రాజస్థాన్లోని మేవాత్ ప్రాంతం ఆన్లైన్ మోసగాళ్లకు పెద్ద కేంద్రంగా మారింది. దీగ్ జిల్లాలోని రెండు గ్రామాల్లో పోలీసులు జరిపిన దాడిలో ఏం బయటపడిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆన్లైన్ మోసగాళ్లు నగదు విత్డ్రా చేసుకునేందుకు ఇంట్లో ఏటీఎం మెషీన్లను అమర్చారు.
కోల్కతాలో 5నెలల శిశువు సేఫ్టీ పిన్ను మింగేయడంతో శ్వాసనాళంలో ఇరుక్కుంది. ఆ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆపరేషన్ చేసి పిన్నీసును విజయవంతంగా బయటకు తీశారు. దీంతో పేరంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.
సిద్ధిపేట జిల్లా జాలిగామి గ్రామంలో ప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్కు గురై తండ్రి, కొడుకులు అక్కడిక్కడే మృతి చెందారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంక ప్రాంతంలోని ఓ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. గది బెడ్ కింద రూ.854 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులు ఈ సైబర్ మోసానికి పాల్పడ్డారు.
ఇటివల కాలంలో ఫేక్ ఐటీ, ఫేక్ ఈడీ అధికారుల పేరుతో చేస్తున్న దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే గతంలో చెన్నైలో ఐడీ రైడ్స్ పేరుతో సోదాలు చేసి పలువురు నగదు దోచుకున్న ఘటన మరువక ముందే తాజాగా ఢిల్లీలో పేక్ ఈడీ అధికారులు ఓ ఇంట్లో దోపిడీ చేసి 3 కోట్ల రూపాయల నగదు దోచుకున్నారు.
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. కంటైనర్- మినీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. 23 మంది వరకు గాయపడ్డారు.
హైదరాబాద్లో వరంగల్ కు చెందిన ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్య ఘటనపై తెలంగాణ(telangana) గవర్నర్(governor) తమిళిసై సౌందర రాజన్(tamilisai soundara rajan) స్పందించారు. ఈ ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఉన్నాతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.