పోలీసు వాహనం ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఆరుగురు మృతిచెందారు. ఈ విషాద ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరొకరు గాయపడగా ప్రస్తుతం ఆస్పత్రికి చికిత్స అందిస్తున్నారు. ప్రధాని మోదీ సభకు బందోబస్తుగా పోలీసులు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
విశాఖపట్నంలోని హార్బర్లో నిన్న అర్థరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 40కిపైగా ఫిషింగ్ బోట్లు కాలిబూడిదయ్యాయి. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఓ యూట్యూబర్ అని తెలుస్తోంది. ఇది తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.
ఓ కుటుంబంలోని అందరూ కలిసి ఒకేసారి పూజ వేడుకల కోసం బయటకు వెళ్లారు. ఆ క్రమంలోనే ఆ ఫ్యామిలీపై కక్ష్య పెంచుకున్న ఓ వ్యక్తి వారిపై కాల్పులు జరిపాడు. దీంతో వారిలో ఇద్దరు మరణించగా..మరో నలుగురు గాయపడ్డారు.
హౌతీ దుండగులు భారత్ వస్తున్న కార్గో షిప్ను హైజాక్ చేశారు. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో రవాణా మార్గానికి అడ్డంకులు సృష్టించారు. అయితే ఆ నౌకలో ఇజ్రాయెల్ సహా వివిధ దేశాలకు చెందిన 50 మంది నావికులు ఉన్నారని తెలిసింది.
విశాఖలోని ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్క పడవకు మంటలు చెలరేగి చివరికీ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి 40 బోట్లు కాలి బూడిదయ్యాయి.
అగ్రరాజ్యం అమెరికా(USA)లో మళ్లీ కాల్పుల మోత(Shooting) మోగింది. న్యూ హంప్షైర్(New Hampshire)లోని కాంకర్డ్ నగరంలో ఉన్న సైకియాట్రిక్ ఆసుపత్రిలోకి ఓ దుండగుడు ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు.ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా పలువురికి బుల్లెట్ గాయాలు అయినట్లు సమాచారం.
ఉగ్రవాదులు, భద్రతా దళాలకు దాదాపు 20 గంటలపాటు కొనసాగిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. రెండు రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్లో భారత దళాలు దీటుగా ఎదుర్కొన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన దక్షిణ కాశ్మీర్(Jammu kashmir )లోని కుల్గామ్ జిల్లా(Kulgam district) సామ్నులో చోటుచేసుకుంది.
సహజీవనం పేరిట మోసం చేసిన ఘటనపై కేసు నమోదైంది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూం షేర్ చేసుకున్న మహిళ తాను వేశ్యనని చెప్పింది.. జీర్ణించుకోలేని అతడు గది ఖాళీ చేయమన్నాడు.
ఇండియన్ ఐటీ క్యాపిటల్ బెంగళూరులో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి రాత్రి నగరంలో తన భార్యకు ఎదురైన వేధింపుల సంఘటనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆ క్రమంలో బెంగళూరు నగరం ఎంత అసురక్షితంగా ఉందోనని భయాందోళన వ్యక్తం చేశాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
బొగ్గు కంపెనీ భవనంలో ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఈ ఘటనలో 25 మంది మరణించగా.. డజన్ల కొద్ది సిబ్బంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఉత్తర చైనీస్ షాంగ్సీ ప్రావిన్స్లోని లులియాంగ్ సిటీలో చోటుచేసుకుంది.
యూపీలోని ఇటావాలో బుధవారం న్యూఢిల్లీ-దర్భంగా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లోని ప్రమాదవశాత్త ఒక కోచ్లో పెద్ద ఎత్తున మంటలు భారీగా చెలరేగాయి. ఆ క్రమంలో పలువురు ప్రయాణికులు ట్రైన్ నుంచి కిందకు దూకి పారిపోయారు.
షామ్లీలోని మదర్సాలో చదువుతున్న బాలిక వేధింపులకు విసుగు చెంది విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు గ్రామానికి చెందిన యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపిస్తున్నారు.
జమ్ముకశ్మీర్ దోడాలో ఓ బస్సు అదుపు తప్పి దాదాపు 300 అడుగుల లోతున్న గుంతలో ఆకస్మాత్తుగా పడిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో 38 మంది మృత్యువాత చెందగా..మరికొందరికి గాయాలయ్యాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ముంబై పోలీసులు 32 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో డాబర్ గ్రూప్ డైరెక్టర్ గౌరవ్ బర్మన్, చైర్మన్ మోహిత్ బర్మన్ పేర్లు కూడా ఉన్నాయి. వీరిపై మోసం, జూదం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్మకు పాల్పడిన నిందితుడికి కోర్టు మరణశిక్ష విధించింది. 110 రోజులు పాటు వాదనలు విన్న కోర్టు బాలల దినోత్సవం రోజున తీర్పును వెలవరించింది. కోర్టు తీర్పుపై నెటజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికి ఉరిశిక్షే సరియైనది అని అభిప్రాయపడుతున్నారు.