• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

Karnisena: కర్ణిసేని అధ్యక్షుడు సుఖ్‌దేవ్ దారుణ హత్య

గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేని అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ మరణించారు. జైపూర్‌లోని ఆయన నివాసంపై కాల్పులు జరిగాయి. సోఫాలో కూర్చున్న సుఖ్ దేవ్ సింగ్ పై ఇద్దరు దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

December 5, 2023 / 07:14 PM IST

Karnataka : కర్ణాటకలో ఘోరం.. బస్తాల కిందపడి ఏడుగురు మృతి

కర్ణాటకలో ఘోరం చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం బీహార్ నుంచి కర్ణాటకకు వలస వెళ్లిన కూలీలు చనిపోయారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని విజయపురలోని రాజ్ గురు ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో సోమవారం రాత్రి గోదాంలో స్టోరేజీ యూనిట్ కుప్పకూలింది.

December 5, 2023 / 05:37 PM IST

Bus Accident: చెట్టును ఢీకొని ముక్కలైన బస్సు..14 మంది దుర్మరణం

ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో 14 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 20 మందికి గాయాలు అయ్యాయి.

December 5, 2023 / 01:15 PM IST

Murder Cases: దేశంలో 28,522 హత్యలు..రోజూ 78 మర్డర్లు..!

2022వ ఏడాదిలో దేశవ్యాప్తంగా ఎన్ని హత్యా కేసులు నమోదయ్యాయనే విషయంపై నేడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారంగా దేశ వ్యాప్తంగా సగటున ప్రతి గంటకూ మూడుకు పైగా మర్డర్లు జరుగుతున్నట్లు తేలింది. ఈ హత్యల్లో 70 శాతం మంది పురుషులే చనిపోతున్నట్లుగా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.

December 4, 2023 / 05:32 PM IST

Uttarpradesh: గుడిసెలో మంటలు.. ముగ్గురు చిన్నారులు మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఫిరోజాబాద్‌లోని జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గుడిసెలో శనివారం అర్థరాత్రి మంటలు చెలరేగడంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.

December 4, 2023 / 04:53 PM IST

Aircraft Crashes: తూప్రాన్ మున్సిపాలిటీ శివారులో కూలిన శిక్షణ హెలికాప్టర్.. ఇద్దరు మృతి

సాంకేతిక లోపంతో శిక్షణ హెలికాప్టర్ తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి శివార్లలో కూలిపోయింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

December 4, 2023 / 10:51 AM IST

Private travel bus: దగ్ధం..ఓ వ్యక్తి సజీవదహనం

ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు తెల్లవారుజామున హైదరాబాద్ వస్తుంది. ఆ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న వారందరూ ఎంచక్కా నిద్రపోతున్నారు. అంతే అదే క్రమంలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కిందకు దిగారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అందులోనే ఉండగా..అతను మంటల్లోనే కాలిపోయాడు.

December 4, 2023 / 09:00 AM IST

Gymలో పేలుడు నలుగురు మృతి, మరో 40 మందికి గాయాలు

దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని విశ్వవిద్యాలయ వ్యాయామశాలలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత చెందగా..40 మందికిపైగా గాయపడినట్లు అక్కడి మీడియా నివేదించింది.

December 3, 2023 / 11:44 AM IST

Uttarpradesh : వీళ్ల ధైర్యం పాడుగానూ.. తల్లి శవంతో ఏడాది గడిపిన అక్కాచెల్లెళ్లు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఏడాది కాలంగా ఇంట్లోనే ఉంచిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

December 1, 2023 / 05:02 PM IST

Hanamkondaలో కారు బీభత్సం.. మహిళ మృతి

హన్మకొండలో దారుణం జరిగింది. ఓటు వేసి వస్తోన్న ఓ మహిళనకు కారు ఢీ కొంది. ప్రమాదంలో మహిళ అక్కడిక్కడే చనిపోయింది.

December 1, 2023 / 04:35 PM IST

Elections: ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్..మొత్తంగా రూ.1766 కోట్లు సీజ్

ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో నెల రోజుల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఐదు రాష్ట్రాల్లో కలిపి రూ.1766 కోట్ల నగదు, బంగారం, మద్యం, వస్తువులను సీజ్ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.

December 1, 2023 / 03:49 PM IST

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న వ్యాన్.. ఏడుగురు మృతి

ఒడిశాలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. కియోంఝర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. 20 మందితో నిండిన వ్యాన్ రోడ్డుపై నిలబడి ఉన్న ట్రక్కును ఢీకొట్టిందని చెబుతున్నారు.

December 1, 2023 / 03:14 PM IST

Fire accident: మరో బోటులో అగ్ని ప్రమాదం..11 మంది జస్ట్ మిస్

ఏపీలోని కాకినాడ తీరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మత్య్సకారులను కోస్టుగార్డు సిబ్బంది రక్షించారు. కొంచెంలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

December 1, 2023 / 12:40 PM IST

Conductor కాదు రాక్షసుడు.. బస్సు ఆపమంటే, చక్రాల కింద పడేశాడు

టాయిలెట్ వస్తుందని, బస్సు ఆపమని కోరితే ఓ కండక్టర్ రాక్షసుడిలా వ్యవహరించాడు. కదిలే బస్సు నుంచి తోసివేశాడు. దీంతో ఆ ప్యాసెంజర్ కన్నుమూశాడు.

December 1, 2023 / 11:06 AM IST

Bomb attack: 10 మంది మృతి, 14 మందికి గాయాలు

ఇరాక్‌లోని తూర్పు దియాలా ప్రావిన్స్‌లో గురువారం సాయంత్రం ఒక వాహనం, రెస్క్యూ టీమ్‌పై బాంబు దాడి జరిగింది. రోడ్డు పక్కన ఉన్న పలువురిపై దుండగులు బాంబులపై దాడి చేసి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మరణించగా..14 మంది గాయపడ్డారు.

December 1, 2023 / 07:47 AM IST