ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం భూపేష్ బఘేల్(Bhupesh Baghel)పై ఈడీ(ED) పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సీఎం భూపేష్ బఘేల్కు రూ.508 కోట్లు ఇచ్చారని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఈడీ పేర్కొంది. ఈ రాష్ట్రంలో నవంబర్ 7, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
సూరత్తో సహా గుజరాత్ రాష్ట్రంలోని వివిధ నగరాల్లో మ్యూజిక్ సిస్టమ్, ల్యాప్టాప్తో సహా విలువైన వస్తువుల దొంగతనాలకు సంబంధించి 200 నేరాలకు పాల్పడిన తండ్రి-కొడుకులను సూరత్ క్రైమ్ బ్రాంచ్ కరాజన్ నుండి అరెస్టు చేసింది.
బీహార్లోని వైశాలిలో ఓ తాత మనవడిని కాల్చి చంపాడు. ఇక్కడ చాంద్పూర్ ఓపీ ఏరియాలోని చకంగోలా గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు వివాదంలో ఓ తాత మనవడిని రైఫిల్తో ఛాతీపై కాల్చాడు.
ఇరాన్లోని మాదకద్రవ్యాల పునరావాస కేంద్రంలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 32 మంది మరణించగా..మరో 16 మంది గాయపడినట్లు అక్కడి మీడియా తెలిపింది.
ఓ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారిని సైబర్ కేటుగాళ్లు వేధించారు. వీడియో కాల్ చేసి, రికార్డ్ చేశారు. తర్వాత డబ్బులు ఇవ్వాలని.. లేదంటే సోషల్ మీడియాలో వీడియో అప్ లోడ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అతను సైబర్ పోలీసులకు ఈ విషయం తెలియజేశాడు.
వేగంగా వెళ్తున్న కారు ఆకస్మాత్తుగా అదుపుతప్పి ఢీవైడర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మరణించారు. ఈ విషాద ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగింది.
బెడ్ పై నిద్రిస్తున్న ఓ వృద్ధుడిపైకి కాలుతున్న పేపర్ ను విసిరేసిందో మహిళ.. బెడ్ పైన బట్టలకు మంటలు అంటుకుని ఆ వృద్ధుడు చనిపోవాలనే ఉద్దేశంతో ఈ పని చేసిందని ఆమె భర్త ఆరోపిస్తున్నాడు.
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్, సీఐపై దాడికి పాల్పడ్డాడు. మర్మాంగాలు కొసేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడికి అతని భార్య, తోటి కానిస్టేబుళ్లు సైతం సాయం చేయడం గమనార్హం.
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. మలయాళ టీవీ నటి డాక్టర్ ప్రియ 35 ఏళ్ల వయస్సులోనే గుండెపోటుతో మృత్యువాత చెందారు. అయితే ఆమె మరణించిన సమయంలో 8 నెలల గర్భవతిగా ఉండటం పలువురిని కలచివేస్తుంది.
జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న వాహనం ఆకస్మాత్తుగా లోయలో పడిపోయింది. దీంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృత్యువాత చెందగా..మరో 10 మంది గాయపడ్డారు.
చిన్న పిల్లలది తెలిసి తెలియని వయసు. వారు చేసే పనులు అల్లరి అల్లరిగా ఉంటాయి. ప్రతి కిరణా షాపుకు వారు వెళ్తే చాలు. పలు రకాల చిరుతిండి పదార్థాలు తీసుకోవాలని చూస్తారు. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది. నలుగురు చిన్నారులు(children) ఓ షాపుకు వెళ్లి డబ్బులు ఇవ్వకుండానే కుర్కురే, బిస్కెట్లు తీసుకున్నారు. అది గమనించిన షాపు యజమాని వారిని స్తంభానికి కట్టేసి కొట్టాడు. ఈ ఘటన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వ...
పంజాబ్లోని పాక్ సరిహద్దులో భద్రతా దళాలకు భారీగా డ్రగ్స్ అండ్ బులెట్స్ దొరికినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బీఎస్ఎఫ్ దళాలు తనిఖీలు చేస్తున్నారు.
చంపాపేట్కు చెందిన స్వప్న హత్య కేసులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. దర్యాప్తులో కీలక విషయాలను బయటపెట్టారు పోలీసులు. స్వప్న తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధాకంగా ఇది హత్య కేసుగా నమోదు చేశారు.
శ్రీలంక సముద్ర జలాల్లో 37 మంది భారతీయ జాలర్లను సముద్ర సరిహద్దు నిబంధనలు పాటించలేదనే కారణంతో లంక అధికారులు అరెస్టు చేశారు. దీంతోపాటు ఐదు పడవలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిలో దాదాపు మొత్తం తమిళనాడు వాసులే ఉన్నారని తెలుస్తోంది.
కేరళ కొచ్చిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎవరైనా కావాలనే చేశారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.