గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేని అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ మరణించారు. జైపూర్లోని ఆయన నివాసంపై కాల్పులు జరిగాయి. సోఫాలో కూర్చున్న సుఖ్ దేవ్ సింగ్ పై ఇద్దరు దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
కర్ణాటకలో ఘోరం చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం బీహార్ నుంచి కర్ణాటకకు వలస వెళ్లిన కూలీలు చనిపోయారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని విజయపురలోని రాజ్ గురు ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో సోమవారం రాత్రి గోదాంలో స్టోరేజీ యూనిట్ కుప్పకూలింది.
2022వ ఏడాదిలో దేశవ్యాప్తంగా ఎన్ని హత్యా కేసులు నమోదయ్యాయనే విషయంపై నేడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారంగా దేశ వ్యాప్తంగా సగటున ప్రతి గంటకూ మూడుకు పైగా మర్డర్లు జరుగుతున్నట్లు తేలింది. ఈ హత్యల్లో 70 శాతం మంది పురుషులే చనిపోతున్నట్లుగా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఫిరోజాబాద్లోని జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గుడిసెలో శనివారం అర్థరాత్రి మంటలు చెలరేగడంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.
సాంకేతిక లోపంతో శిక్షణ హెలికాప్టర్ తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి శివార్లలో కూలిపోయింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు తెల్లవారుజామున హైదరాబాద్ వస్తుంది. ఆ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న వారందరూ ఎంచక్కా నిద్రపోతున్నారు. అంతే అదే క్రమంలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కిందకు దిగారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అందులోనే ఉండగా..అతను మంటల్లోనే కాలిపోయాడు.
దక్షిణ ఫిలిప్పీన్స్లోని విశ్వవిద్యాలయ వ్యాయామశాలలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత చెందగా..40 మందికిపైగా గాయపడినట్లు అక్కడి మీడియా నివేదించింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో నెల రోజుల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఐదు రాష్ట్రాల్లో కలిపి రూ.1766 కోట్ల నగదు, బంగారం, మద్యం, వస్తువులను సీజ్ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
ఒడిశాలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. కియోంఝర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. 20 మందితో నిండిన వ్యాన్ రోడ్డుపై నిలబడి ఉన్న ట్రక్కును ఢీకొట్టిందని చెబుతున్నారు.
ఏపీలోని కాకినాడ తీరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మత్య్సకారులను కోస్టుగార్డు సిబ్బంది రక్షించారు. కొంచెంలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఇరాక్లోని తూర్పు దియాలా ప్రావిన్స్లో గురువారం సాయంత్రం ఒక వాహనం, రెస్క్యూ టీమ్పై బాంబు దాడి జరిగింది. రోడ్డు పక్కన ఉన్న పలువురిపై దుండగులు బాంబులపై దాడి చేసి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మరణించగా..14 మంది గాయపడ్డారు.