ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సమన్లను పట్టించుకోలేదు. ఢిల్లీ జల్ బోర్టుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కాలేదు.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేశారని, దర్యాప్తు సంస్థ కోర్టుకు ధిక్కరణకు పాల్పడిందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇన్స్టాగ్రామ్లో వచ్చిన యాడ్ను చూసి నమ్మి ఓ వ్యాపారి లక్షల డబ్బు పొగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్సై తెలిపారు.
బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ ఎల్విష్ యాదవ్ అరెస్టు అయ్యాడు. గతేడాది నవంబర్లో రేవ్ పార్టీలో పాము విషాన్ని వాడినందుకు అతనితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఈక్రమంలో అతనిని అరెస్టు చేశారు.
ఏపీలో ఈరోజు గ్రూప్-1 పరీక్ష జరుగుతోంది. ఈక్రమంలో ఓ వ్యక్తి కాపీయింగ్కు పాల్పడ్డాడు. ఒంగోలు క్విస్ ఇంజినీర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఓ అభ్యర్థి పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్తో ప్రవేశించారు.
పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చుకునేందుకు వెళ్తుండగా బస్సు బోల్తా పడింది. ఈ సంఘటన అద్దంకి మండలంలో జరిగింది. పల్నాడు జిల్లా కోటప్పకొండకు మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్న బస్సు బోల్తా పడింది.
ఓ యువకుడి చేతిలోని సెల్ఫోన్ని కొందరు దోపిడీ చేయడానికి ప్రయత్నించారు. తన మొబైల్ తనకు ఇవ్వవలసిందిగా వేడుకోవడంతో అతడిని కత్తితో పొడిచి హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఓ మైనర్ బాలికపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
మద్యం తాగొచ్చి రోజూ గొడవకు దిగుతున్న భర్తను భార్య దారుణంగా హత్య చేయించింది. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి అయిన ఆ వ్యక్తిని ఈ నెల 9వ తేదీన నలుగురు యువకులు హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరులో రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ తాజాగా అరెస్ట్ చేసింది.