MDCL: అల్వాల్ రాజు రహదారి రోడ్డు విస్తరణను 150 ఫీట్లు తగ్గించాలని జేఏసీ నాయకులు కోరారు గురువారం అల్వాల్ సర్కిల్ శుభశ్రీ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోడ్డు విస్తరణను 150 ఫీట్లకు తగ్గించాలని, నష్టపరిహారాన్ని మూడు రెట్లు పెంచాలని కోరుతూ.. స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికు వినతిపత్రాలు అందజేశారు.
KNR: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ 8వ డివిజన్ (అల్గునూర్) అధ్యక్షుడిగా యస్వాడ శ్రీకాంత్ నియామకమయ్యారు. ఈ మేరకు ఫోరం నియోజకవర్గ అధ్యక్షుడు కందుకూరి సాయికృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన జిల్లా ఛైర్మన్ ఓరుగంటి ఆనంద్, నియోజకవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలో ఇవాళ జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 14 మంది విద్యార్థులు హాజరు కాలేదు. వీరిలో వోకేషనల్ నుంచి నలుగురు, జనరల్ విభాగం నుంచి పదిమంది ఉన్నట్లు పరీక్షల నిర్వహణ అధికారి వాణి తెలిపారు. ఎస్సై అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
MNCL: కోటపల్లి మండలంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన నోటీస్ను పోలీసులు గురువారం అందించారు. ఎరినాగుల ఓదెలు, మారిశెట్టి విద్యాసాగర్, పెద్దపోలు సాంబగౌడ్, కొట్టె నారాయణ, పిల్లి సమ్మయ్య, ఆసంపల్లి సంపత్ కుమార్, రాళ్లబండి స్వామి, బోగే మంథయ్య, గుగ్లోత్ బాపు నాయక్లపై కేసు నమోదు చేసినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
MHBD: MP పోరిక బలరాం నాయక్ ఇవాళ ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MHBD పరిధిలోని పలు జాతీయ, రాష్ట్ర రహదారుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. పెండింగ్లో ఉన్న NH అనుమతులు త్వరగా ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు MP తెలిపారు.
SRD: పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వేలాది మహిళలు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయి. మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
GDWL: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం వెళ్తున్న పాదయాత్రికులకు అలంపూర్ న్యూ ప్లాట్స్ కాలనీ మహిళలు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న భక్తుల కోసం మహిళలు చందాలు వేసుకుని సేవా కార్యక్రమం చేపట్టారు. గత మూడు రోజులుగా వందలాది మంది భక్తులకు మజ్జిగ అందిస్తూ సేవలందిస్తున్నామని నిర్వాహకులు వరలక్ష్మి, ఇస్మాయిల్ బేగం, జ్యోతి తెలిపారు.
SRD: విద్యార్థులు గొప్ప స్వచ్ఛంద సేవకులుగా ఎదగాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రుద్రారం సమీపంలోని ఓ యూనివర్సిటీలో గురువారం శిక్షణ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అనుకోని విపత్తులు సంభవించినప్పుడు తమతో పాటు తోటి పౌరులను ఎలా కాపాడాలో వారం రోజులపాటు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.
SDPT: ములుగు మండలం వంటిమామిడిలో గజ్వేల్ షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులకు భద్రతపై అవగాహన కల్పించారు. ఏఎస్సై వీ.శివరాములు, పీసీ మహేష్ పాల్గొని సైబర్ క్రైమ్, డ్రగ్స్, మహిళా రక్షణ చట్టాల గురించి వివరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్య క్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొని షీ టీమ్ సేవలను అభినందించారు.
MBNR: మిడ్జిల్ మండలంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విగ్రహ కమిటీ సభ్యులు కోరారు. గురువారం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని కలిసి వారు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే విగ్రహ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేస్తూ త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
KMM: తక్కువ ప్రీమియంతో ప్రభుత్వం కల్పిస్తున్న ఇలాంటి బీమా పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని డీసీసీబీ బ్రాంచ్ సిబ్బంది సూచించారు. తల్లాడ డీసీసీబీ బ్రాంచ్లో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) కింద లబ్ధిదారుని కుటుంబానికి రూ. 2,00,000 చెక్కును బ్యాంకు అధికారులు నేడు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
MLG: మంగపేట (M)మొట్లాగూడెంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల పై AEO మహేష్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. AEO మాట్లాడుతూ.. రసాయన ఎరువులు, పురుగుమందులకు బదులుగా జీవామృతం, పంచామృతం, అగ్నీ అస్త్రం, నీమాస్త్రం వంటి సహజ ఎరువులను స్వయంగా తయారు చేసుకుని వాడాలని సూచించారు. ఈ పద్ధతులతో భూసారం పెరగడమే కాకుండా పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయన్నారు.
KMR: కిడ్నీ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి అడిషనల్ వైద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కిడ్నీ పనితీరుపై ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కిడ్నీ పనితీరును ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డయాలసిస్ సెంటర్ మేనేజర్ శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
MBNR: బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లకు నీటి సరఫరా సమస్య ఏర్పడింది. ఈ విషయాన్ని వార్డు మెంబర్ మధు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సొంత ఖర్చుతో మోటార్ మరమ్మతులు చేయించి బోరు బావిలో దింపించారు. దీంతో నీటి సమస్య పరిష్కారమైంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
MDCL: అల్వాల్ సర్కిల్ తుర్కపల్లి డివిజన్ పరిధి హకీంపేట్ సమీపంలోని రైల్ నగర్ కాలనీ సబ్లైన్లలో రూ.28 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ ప్రారంభించారు. అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.