SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలో ఇవాళ జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 14 మంది విద్యార్థులు హాజరు కాలేదు. వీరిలో వోకేషనల్ నుంచి నలుగురు, జనరల్ విభాగం నుంచి పదిమంది ఉన్నట్లు పరీక్షల నిర్వహణ అధికారి వాణి తెలిపారు. ఎస్సై అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.