NLG: దేవరకొండలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ రమావత్ రవి మాట్లాడుతూ.. మాతృభాష ఉనికిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపైన ఉందని, మన సంస్కృతి, సంప్రదాయాలు మాతృభాషతో పెనవేసుకుని ఉంటాయని పేర్కొన్నారు.
JGL: మెట్పల్లి మండలం వెంకట్రావు పేట గ్రామ సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ లీకేజీ మరమ్మతు కారణంగా మూడు రోజులు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజినీర్ తెలిపారు. కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి పరిధిలోని గ్రామాలకు, మున్సిపాలిటీలకు ఈనెల 23 నుంచి 25 వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొ. పీ. రమేష్ బాబు, న్యూ పీజీ బాయ్స్ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యత, హాస్టల్ సౌకర్యాలపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో చీఫ్ వార్డెన్ డా. మన్నెమోని కృష్ణయ్య, ప్రిన్సిపల్ డా.సీహెచ్. రవికాంత్ పాల్గొన్నారు.
SRPT: యూరియా యూప్ నిబంధనలకు వ్యతిరేకంగా పాలకవీడు పీఏసీఎస్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకుడు నవీన్ కుమార్ రైతులతో కలిసి వినూత్న రీతిలో శనివారం నిరసన తెలిపారు. మెడకు ఉరితాడు వేసుకొని ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంటనే ప్రభుత్వం యాప్ రద్దుచేసి పాత పద్ధతిలో రైతులకు యూరియా అందించాలన్నారు.
MNCL: కాసిపేట్ మండలం కొండాపూర్ వద్ద శనివారం ట్రాక్టర్-బైక్ ఢీకొన్న ప్రమాదంలో తుడుంగూడకు చెందిన చాకటి ఇస్ఫతికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడికి కుడి కాలు, చేయి విరగడంతో స్థానికులు 108కి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది EMT ఆత్మారావు, పైలట్ కొమురయ్య ప్రథమ చికిత్స అందించి, చికిత్స నిమిత్తం మంచిర్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు.
BHPL: మంచి చేసేవారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. రేగొండ మండలం కోడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.12.15 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. చిన్న జీయర్ స్వామి, MLA గండ్ర ఉన్నారు.
SRPT: మునగాల మండలం జగన్నాథపురం ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు భరత్ బాబు మాట్లాడుతూ.. మాతృభాషలో విద్యనభ్యసించడం వల్ల విద్యార్థులకు జ్ఞాన సముపార్జన సులువుగా జరుగుతుందని, తద్వారా సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని తెలిపారు.
JN: చిల్పూరు మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. 85శాతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి ఉమ్మడి జిల్లాలోనే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందన్నారు. నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తున్నదని చెప్పారు.
HNK: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో అంధులకు(బ్రెయిలీ లిపి) వారికి కంప్యూటర్, బుక్స్ సెక్షన్స్ను గ్రంథాలయ ఛైర్మన్ అజీజ్ ఖాన్ ప్రారంభించారు. జిల్లాలోని అంధులకు కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలనే ఉద్దేశంతో సెక్షన్స్ ప్రారంభించామని, అంధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ కార్యదర్శి శశిజాదేవి, తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని భట్టుపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని MLA హరీష్ బాబు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ ని ఆసుపత్రి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఔట్ పేషంట్ సేవలని విస్తరించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.
MBNR: ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ప్రతి రైతుకూ ‘ఫార్మర్ ఐడీ’ తప్పనిసరని మూసాపేట మండల ఏఈవో శశిత తెలిపారు. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్, ఫోన్ నెంబర్ రైతు వేదికకు వచ్చి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ ఐడీ ఉంటేనే భవిష్యత్తులో ప్రభుత్వ సాయం నేరుగా అందుతుందని స్పష్టం చేశారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
BDK: మణుగూరు మండలం, సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధి,1వ వార్డు, వాగు మల్లారం గ్రామంలో సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా అంతర్గత రోడ్లు, అంతర్గత డ్రైనేజీ సమస్యలను పరిశీలించి తక్షణమే పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.
NZB: చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న పేర్కొన్నారు. సాలూరులో పంచాయతీ కార్యదర్శులకు బాల్య వివాహాల నిరోధక చట్టం-2006పై అవగాహన సదస్సు నిర్వహించారు. బాలికలకు 18, బాలురకు 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
KMM: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన కుటుంబ సభ్యులతో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆమెకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
MHBD: తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన ధర్మారపు ఉప్పలయ్య- ధనమ్మ దంపతుల కనిష్ట పుత్రుడు ధర్మారపు ప్రశాంత్ కుమార్ వివాహ వేడుక శనివారం కళ్యాణలక్ష్మి గార్డెన్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి హాజరై, నూతన వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.