• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘విద్యార్థులు లక్ష్యాలను నిర్ధారించుకోవాలి’

MDK: విద్యార్థులు లక్ష్యాలను స్పష్టంగా నిర్ధారించుకొని ఆ దిశగా కృషి చేసి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఎంఈఓ డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. తూప్రాన్ పట్టణ పరిధి రావెల్లిలోని నర్సాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రేరణ విజయానికి తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు. కోఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

February 23, 2026 / 09:31 PM IST

‘గ్రంథాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తాం’

BDK: జిల్లాలోని పలు గ్రంధాలయాల అభివృద్ధికి రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి ఇటీవల 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు సోమవారం వారిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు.

February 23, 2026 / 09:18 PM IST

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ అప్పగింత

PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ల గ్రామానికి చెందిన దబ్బేట శ్రీకాంత్ ఇటీవల తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీఈఐఆర్ సాంకేతికత ద్వారా ఫోన్ ఉన్న చోటును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ నీలిమా బాధితుడు శ్రీకాంత్‌ను పిలిపించి ఫోన్‌ను అందజేశారు.

February 23, 2026 / 09:16 PM IST

కృష్ణా మండల ఉపాధ్యాయుల సముదాయ సమావేశం

NRPT: కృష్ణా మండలంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సముదాయ సమావేశంలో MEO నిజాముద్దీన్ పాల్గొన్నారు. వచ్చే రెండు నెలల్లో విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులను సమర్థంగా బోధించేందుకు సరైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశం స్థానిక ప్రధానోపాధ్యుడు కిషోర్ అధ్యక్షతన జరిగింది.

February 23, 2026 / 09:15 PM IST

రాష్ట్రస్థాయికి ఎంపికైన బొమ్మనపల్లి విద్యార్థులు

KNR: చిగురుమామిడి మండలం జడ్పీహెచ్ఎస్ బొమ్మనపల్లికి చెందినటువంటి విద్యార్థులు తాళ్ల రిచిత, బొల్లి విజయ విద్యార్థులు సీఎం కప్లో ఖోఖో పోటీలకు ఎంపికయ్యారని పీటీ పీ. జ్యోతి తెలిపారు. నల్లగొండ జిల్లాలో 20, 21 తేదీల్లో జరిగిన సీఎం కప్ క్రీడల్లో పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలాడి లక్ష్మణ్ రావు, ఎంఈవో జయప్రద, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు.

February 23, 2026 / 09:12 PM IST

‘ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి’

SRCL: ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వీర్నపల్లి ఎస్సై వేముల లక్ష్మణ్ సూచించారు. వీర్నపల్లి మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. హెల్మెట్ ధరించడం కేవలం ట్రాఫిక్ నిబంధన మాత్రమే కాదని, అది మీ ప్రాణాలకు భరోసా అని పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు.

February 23, 2026 / 09:09 PM IST

బాధితులకు అండగా జిల్లా పోలీసు వ్యవస్థ: SP

ADB: బాధితుల పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజా ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత సిబ్బందికి తెలియజేశారు.

February 23, 2026 / 09:06 PM IST

‘GP కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి’

HNK: జిల్లాలోనిలోని GP కార్మికుల పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఇవాళ ప్రగతిశీల GP వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో (HNK) డీపీవోకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకుడు నరసింహారావు మాట్లాడుతూ.. GP అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల వేతనాలు రాక కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించాలని కోరారు.

February 23, 2026 / 09:02 PM IST

గీతావాహిని ఆధ్వర్యంలో గీతా పారాయణం

RR: భగవద్గీత బోధనలు మనిషిని ధర్మమార్గంలో నడిపించి జీవితానికి సరైన దిశ చూపిస్తాయని నిర్వాహకురాలు స్వతంత్ర, జీవని, గీత సభ్యులు తెలిపారు. చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని గ్రామ హనుమన్ దేవాలయంలో సోమవారం గీతా పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు సమూహంగా గీతా అధ్యాయాలను పారాయణం చేయగా కర్మయోగం, భక్తియోగం, లభిస్తాయని అన్నారు.

February 23, 2026 / 09:01 PM IST

‘BCలకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి’

BHPL: కుమ్మెర జాతరలో బీసీ రజక కుటుంబంపై జరిగిన అమానుష దాడిలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం తెలంగాణ చరిత్రలో మచ్చగా మిగిలిపోతుందని BHPL జిల్లా TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. ఇవాళ BHPL జిల్లా కేంద్రంలో కోవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు. BCలకు కూడా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 09:00 PM IST

వైన్ షాపులో కన్నం.. నగదు, మద్యం అపహరణ

SRPT: సూర్యాపేట మండలం పిల్లలమర్రిలోని కేటీ అన్నారం క్రాస్ రోడ్ వద్ద గల జీకే వైన్స్‌లో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గుర్తు తెలియని దుండగులు షాపు పైకప్పు ఇనుప రేకులు ఊడదీసి లోపలికి చొరబడ్డారు. కౌంటర్‌లో ఉన్న రూ.14,500 నగదుతో పాటు ఐదు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. క్యాషియర్ నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాలు తెలిపారు.

February 23, 2026 / 09:00 PM IST

కలెక్టరేట్ ప్రజావాణికి 29 ఫిర్యాదులు

NRPT: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 29 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్ కు తమ సమస్యలను విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.

February 23, 2026 / 08:54 PM IST

చేర్యాల ఎస్సైగా అపూర్వరెడ్డి బాధ్యతల స్వీకరణ

SDPT: చేర్యాల పోలీస్ స్టేషన్ ఎస్సైగా అపూర్వరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, జూదం, అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి మొగ్గు చూపుతామన్నారు.

February 23, 2026 / 08:53 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

JGL: కోరుట్ల పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లూరి నరేష్ అనే యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై నరేష్ డెకరేషన్ పనికి మెట్‌పల్లి వెళ్తుండగా.. కోరుట్ల క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై నిలిపి ఉన్న లారీని ఢీ కొట్టాడు. దీంతో నరేష్ తలకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.

February 23, 2026 / 08:50 PM IST

ఛత్రపతి శివాజీ జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట

KMR: మద్నూర్ మండల కేంద్రంలో సార్వజనిక శివ జన్మోత్సవ్ సమితి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి మహోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేకు గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి శాలువాతో ఘనంగా సత్కరించారు.

February 23, 2026 / 08:49 PM IST