• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సిర్పూర్ శివారులో అస్థిపంజరం లభ్యం

NZB: మోపాల్ మండలం సిర్పూర్ శివారులోని గుట్ట వద్ద ఓ వ్యక్తి అస్థిపంజరం లభ్యమైనట్లు ఎస్సై సుస్మిత శుక్రవారం తెలిపారు. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గుట్ట వద్దకు వెళ్లగా అక్కడ అస్థిపంజరం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టగా మృతదేహం నెల రోజుల క్రితం గల్లంతైన ఈర్ల సాయిలుగా గుర్తించారు.

February 27, 2026 / 08:55 PM IST

మంచ్య తండా పాఠశాలలో ‘సెల్ఫ్ గవర్నమెంట్ డే’

SRPT: మంచ్య తండా ఎంపీపీఎస్ పాఠశాలలో ‘సెల్ఫ్ గవర్నమెంట్ డే’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉపాధ్యాయుల వేషధారణలో చిన్నారులు అలరించడమే కాకుండా, నాయకత్వ లక్షణాలు, బాధ్య తాభావంతో తరగతులు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రామిరెడ్డి, టీచర్లు పాల్గొన్నారు.

February 27, 2026 / 08:54 PM IST

కుప్పం-పలమనేరు హైవేపై రోడ్డు ప్రమాదం..!

CTR: కుప్పం-పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం వద్ద లారీ ముందువైపు వెళుతున్న ద్విచక్ర వాహనంపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో కెనమాకన పల్లికి చెందిన లోకేశ్ రెడ్డి(25) తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళ్తుండగా తమిళనాడు సేలం నుంచి కలకత్తా వెళ్తున్న లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు.

February 27, 2026 / 08:52 PM IST

కోరుకొండ నరసన్న ఉత్సవాలలో రథోత్సవం

EG: కోరుకొండ గ్రామంలో వేంచేసియున్న స్వయంభు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో శుక్రవారం జరిగిన భారీ రధోత్సవం కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రతి ఏటా జరిగే మహోత్సవాలలో నిర్వహించే రథోత్సవానికి పరిసర గ్రామ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.

February 27, 2026 / 08:50 PM IST

స్టీల్‌ బ్రిడ్జ్‌ నిర్మాణం త్వరగా పూర్తి చేయండి: మంత్రి

AP: ఉండవల్లిలోని స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు హైవేకు కలిపేలా ప్రభుత్వం స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతోంది. ఈ పనులను పరిశీలించిన మంత్రి.. కాంక్రీట్ పిల్లర్లపై స్టీల్ గడ్డర్ల ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. స్టీల్ బ్రిడ్జ్ త్వరగా పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి వారికి సూచించారు.

February 27, 2026 / 08:50 PM IST

భక్తజన సముద్రమైన భీమేశ్వర ఆలయం

SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో శుక్రవారం సందర్భంగా భక్తజన సంద్రమైంది . వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని తరించారు. భీమేశ్వరాలయంలో అభిషేకం, అన్న పూజ , కళ్యాణం, తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకున్నారు.

February 27, 2026 / 08:49 PM IST

రూ.1.18 లక్షల జరిమానా..!

KMR: మద్యం తాగి వాహనాలు నడిపి ప్రాణాలకు ముప్పు తెస్తున్న వారిపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. SP రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 119 మందికి శుక్రవారం కోర్టు జరిమానాతో పాటు శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసుల్లో నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రూ.1,18,100 జరిమానా విధించింది.

February 27, 2026 / 08:48 PM IST

బొత్స పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలి: లోకేష్

AP: మాజీమంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురై HYDలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు. బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని, ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావాలని ఆకాంక్షించారు.

February 27, 2026 / 08:48 PM IST

గుండెపోటుతో వ్యక్తి మృతి

TPT: గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందినట్లు గూడూరు ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. ఈనెల 5వ తేదీన నరసింహారెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అతనికి వైద్య చికిత్స అందిస్తున్న నేపథ్యంలో శుక్రవారం గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారని ఒకటవ పట్టణ ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.

February 27, 2026 / 08:47 PM IST

86 గ్రాముల హైడ్రోపోనిక్ గాంజా స్వాధీనం

SRD: మునిపల్లి(మం) కంకుల్ టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ అధికారులు జిల్లాలో తొలిసారిగా ఎన్వారి గ్రాముల హైడ్రోపోనిక్ గాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. కేరళకు చెందిన బాబు 30 గోవా నుంచి హైదరాబాద్‌కు గాంజా తరలిస్తుండగా పట్టుకున్నారు. 3.5 లక్షల విలువ ఉంటుందని ఎక్సైజ్ కమిషనర్ హరికిషన్ తెలిపారు.

February 27, 2026 / 08:46 PM IST

పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణతో సర్టిఫికెట్లు పంపిణీ

ELR: నూజివీడు పట్టణంలోని స్త్రీ శక్తి భవన్ లో పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ సర్టిఫికెట్స్ శుక్రవారం అందించారు. జిల్లా కోఆర్డినేటర్ గొట్టుముక్కల సీతారామాంజనేయ రాజు, ట్రైనర్ బీవి రావులు మాట్లాడుతూ.. నిత్యం కాలువలు రోడ్లను పరిశుభ్రం చేయడంలో పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందులు అనేకం అని అన్నారు. సానిటరీ ఇన్‌స్పెక్టర్ సంతోష్ పాల్గొన్నారు.

February 27, 2026 / 08:46 PM IST

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం

KNR: తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రాహ్మోత్సవాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీర్వాదం ఈ ప్రాంత ప్రజలపై ఉండి సమృద్ధి వర్షాలతో పాడిపంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నానని తెలిపారు.

February 27, 2026 / 08:44 PM IST

సెలబ్రిటీల పెళ్లంటే ఎర్ర చీరేనా..?

నిన్న హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లిలో రష్మిక ఎర్ర(కుంకుమ) రంగు చీరలో మెరిసిపోయింది. కాగా, సెలబ్రిటీలు అందరూ వారి పెళ్లిళ్లో ఎరుపు రంగు చీర కట్టుకోవడం విశేషం. నయనతార, సమంత, లావణ్య త్రిపాఠి, అదితిరావు, దీపిక ఇలా అందరూ ఎర్రరంగు చీర కట్టుకున్నారు. ఎర్ర చీరను ప్రేమ, సంపద, కొత్త జీవితానికి సంకేతంగా చూస్తారు. 

February 27, 2026 / 08:43 PM IST

నిధులు కేటాయించాలని ఎంపీకి వినతి అందజేత

KMM: చింతకాని మండలం చిన్నమండవ గ్రామ అభివృద్ధికి ఎంపీ లాండ్స్ నిధులు కేటాయించాలని సర్పంచ్ పర్చ రామచంద్రరావు, రామసహాయం రఘురామరెడ్డిని శుక్రవారం కలసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదల, రహదారులు, డ్రైనేజీ, కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు అవసరమని వివరించారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ, సాధ్యమైనంత నిధులు కేటాయిస్తానని తెలిపారు.

February 27, 2026 / 08:42 PM IST

AIMIMఆధ్వర్యంలో ఘనంగా దావత్-ఇ-ఇఫ్తార్‌

HYD: AIMIM ఆధ్వర్యంలో మలక్‌పేట నియోజకవర్గం పరిధిలోని అక్బర్ బాగ్ ‘X’ రోడ్‌లో గ్రాండ్ దావత్-ఇ-ఇఫ్తార్‌ ఘనంగా జరిగింది. విందుకు AIMIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలాతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా మత పెద్దలతో కలిసి ప్రతేక్య ప్రార్ధనలు (దువా) నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న ముస్లిం సోదరులు విందు ఆరిగించారు.

February 27, 2026 / 08:42 PM IST