కృష్ణా: అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయగా కలంకారీ వస్త్రాలను శుక్రవారం ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, కుమార్ సందర్శించి వస్త్రాలను ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన కలంకారి పరిశ్రమ పెడనలో నియోజకవర్గంలో ఉండటం ఎంతో సంతోషంగా ఉందని కృష్ణ ప్రసాద్ అన్నారు. త్వరలో కలంకారి క్లస్టర్ పెడనలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
సత్యసాయి: ధర్మవరం మార్కెట్ యార్డులోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి భద్రతా చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.
ATP: జిల్లాలో ఆహార కల్తీపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. హోటళ్లు, దాబాల్లో నాసిరకం నూనెలు, హానికర రంగులు వాడుతుండటంతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది. అయితే, జిల్లాలో ఫుడ్ తనిఖీ కోసం కేవలం ఒక్కరే ఆహార భద్రతా అధికారి ఉండటం గమనార్హం. సిబ్బంది కొరత అక్రమార్కులకు వరంగా మారింది. ఖాళీలను భర్తీ చేసి తనిఖీలు ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
కోనసీమ: ఈనెల 28న మలికిపురం ఎంవీఎన్ జెఎస్ అండ్ ఆర్ వీఆర్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు వికాస్ జిల్లా అధికారి డి.హరిశేషు తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కార్యాలయం, వికాస్ ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్ మేళాలో పది కంపెనీలు పా ల్గొంటున్నాయని 410 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
MHBD: కేసముద్రం మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ రావుల వినయ్ సతీమణి రావుల మనీషా అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత ఇవాళ వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
జింబాబ్వే బ్యాటర్లపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. ‘పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నప్పటికీ వారి పర్ఫామెన్స్ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. పవర్ ప్లేలో కాస్త స్లోగా ఆడినా.. చాలా తెలివిగా బ్యాటింగ్ చేశారు. ఇక వెస్టిండీస్ మ్యాచ్ గురించి ఇప్పుడే ఆలోచించట్లేదు. ఒక రోజు రెస్ట్ తీసుకుని మ్యాచ్కు రెడీ అవుతాం’ అని పేర్కొన్నాడు.
NRPT: మక్తల్ పట్టణంలో 16వ వార్డుకు చెందిన వల్లంపల్లి లక్ష్మణ్ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తన కుటుంబాన్ని పరామర్శించారు. బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు మంత్రి సూచించారు. ప్రభుత్వం తరుఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
CTR: పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుని రూపంలో కల్పవృక్ష వాహనంపై అధిరోహించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. పురవీధుల్లో ఊరేగుతున్న శ్రీవారికి మహిళలు భక్తిశ్రద్ధలతో కర్పూర హారతులు పట్టగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
AP: రాష్ట్ర నూతన సీఎస్గా జి సాయి ప్రసాద్ రేపు ఉదయం 11 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత CS విజయానంద్ పదవీ కాలం ముగుస్తుండడంతో తదుపరి సీఎస్గా సాయిప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
TG: ఖమ్మం మంత్రుల తీరు దారుణంగా ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. పేదల ఇళ్లు కూలగొట్టి కబ్జా చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టాల్సింది పోయి.. కూల్చడంలో పోటీ పడతారా? అని నిలదీశారు. పేదల ఇళ్లు కూల్చితే.. ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చుతారని హెచ్చరించారు. కాంగ్రెస్, MIM డ్రామాలను ఎవరూ నమ్మరని తెలిపారు.
ఏలూరు వి.వి.నగర్ వద్ద మార్కెట్ యార్డు హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ప్రదర్శన జరిపారు. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించలేదని వారు విమర్శించారు. జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
NGKL: అచ్చంపేట పట్టణంలో ఈరోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ పలు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం లింగాల చౌరస్తాలో అడ్డా కూలీలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్ స్టాండ్ సమీపంలో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి. త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు తెలిపారు.
NLR: ఉదయగిరి మేజర్ పంచాయతీలో ఇంటి పన్నులు చెల్లించని వారిపై శాఖా పరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో ఎస్.మోహన్ రావు తెలిపారు. పట్టణంలోని ఇంటి యజమానులు పంచాయతీ అధికారులకు సహకరించి సకాలంలో పన్నులు చెల్లించాలని సూచించారు. పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
JGL: జగిత్యాల పట్టణంలోని చింతకుంట ప్రాంతంలో ఉన్న శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో ఫాల్గుణ మాస శుక్ల పక్ష శుక్రవారం ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. అలాగే భక్తిశ్రద్ధలతో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు.
MNCL: గ్రామాల అభివృద్ధి వార్డు సభ్యుల చేతుల్లోనే ఉందని లక్షెట్టిపేట, జన్నారం మండలాల ఎంపీడీవోలు సరోజ, ఉమర్ షరీఫ్ అన్నారు. లక్షెట్టిపేట, జన్నారం మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం కొనసాగింది.. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో అభివృద్ధి ప్రణాళికలపై వార్డు సభ్యులకు అధికారులు అవగాహన కల్పించారు.