• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పలు కిరాణా దుకాణాలను తనిఖీ చేసిన కమిషనర్

ATP: గుంతకల్లులోని పలు కిరాణా దుకాణాలను గురువారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి అకస్మికంగా తనిఖీ చేశారు. మామజి అనే కిరాణా దుకాణ యజమానికి ప్లాస్టిక్ వినియోగిస్తుండడంతో రూ.2000 జరిమానా విధించి ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 26, 2026 / 08:36 AM IST

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్

VKB: పరిగి పట్టణంలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో గంజాయి విక్రయాలకు ప్రయత్నిస్తున్న ఇద్దరు యువకులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నితీశ్ రఝాక్(22), సూరజ్ కుమార్(22) వద్ద నుంచి సుమారు 1.50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి తెచ్చి కార్మికులకు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడి నిర్వహించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

February 26, 2026 / 08:35 AM IST

సూర్యాపేటలో 298 మ్యూల్ అకౌంట్స్ గుర్తింపు

SRPT: TG పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’లో భాగంగా సూర్యాపేట జిల్లాలోని 4 బ్యాంక్ బ్రాంచ్‌లలో 298 అనుమానాస్పద మ్యూల్ ఖాతాలను గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో 137 బ్రాంచ్‌లపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడులు నిర్వహించింది. సరైన వెరిఫికేషన్ లేకపోవడంతో నేరగాళ్లు ఈ ఖాతాల ద్వారా సైబర్ దందాలకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు.

February 26, 2026 / 08:34 AM IST

భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే

ADB: గుడిహత్నూర్ మండలం కొల్హారిలో బంజారా సమాజ్ నిర్వహించిన భోగ్ బండార్ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగదాంబ దేవి, సంత్ సేవాలాల్ మహరాజ్ చిత్రపటాలకు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. బంజారా సంస్కృతిని కాపాడుకోవాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

February 26, 2026 / 08:34 AM IST

మొగల్తూరు అదనపు ఏఎస్సై ఎవరు.?

W.G: మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల తీవ్రత, కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే, దీనిని ఒక ‘హెవీ క్రైమ్’ స్టేషన్ గా పరిగణించవచ్చు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల త్వరితగతిన దర్యాప్తు కోసం ఖాళీ అయిన అదనపు ఎస్సై స్థానంలో ఉన్నత అధికారులు మరొక ఎస్సై త్వరలోనే నియమించే అవకాశం ఉంది. కాగా ఇక్కడ పని చేసిన ఎస్సై నాగలక్ష్మి ఇటీవల బదిలీ అయ్యారు.

February 26, 2026 / 08:33 AM IST

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఒకరు మృతి

AP: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. 30వ మలుపు వద్ద అదుపుతప్పి బైక్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు తమిళనాడు అరక్కోణంకు చెందిన నటరాజన్‌గా పోలీసులు గుర్తించారు.

February 26, 2026 / 08:33 AM IST

జిల్లాలో హృదయ విదారక ఘటన

రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో తల్లి కల్పన(35) మంగళవారం రాత్రి మరణించింది. తెల్లారి బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో, తన భవిష్యత్తు కోసం మనో ధైర్యంతో కుమారుడు రవితేజ పరీక్షను రాసి అందరిని కలిచివేశాడు. తల్లి మృతదేహం ఇంట్లోనే ఉండగా పరీక్షకు వెళ్లి, అనంతరం తల్లి అంతక్రియలకు హాజరయ్యాడు.

February 26, 2026 / 08:31 AM IST

‘సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’

E.G: కొవ్వూరు మండలంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవంతో పాటు భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత లభిస్తుందని మండల అధ్యక్షుడు సుంకర సత్తిబాబు తెలిపారు.జనసేన శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

February 26, 2026 / 08:30 AM IST

ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడిపై హత్యాయత్నం

KRNL: MRPS జిల్లా అధ్యక్షుడు భాస్కర్ మాదిగపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. బుధవారం వెల్దుర్తి మండలం కలుగొట్ల నుంచి ఉయ్యాలవాడ వెళ్లి తిరిగి వస్తుండగా దుండగులు స్కార్పియో వాహనంతో వెంటాడి ఇనుప రాడ్లతో దాడి చేయడానికి ప్రయత్నించినట్లు, ఉయ్యాలవాడలో ఉన్న ఒక దుకాణంలో వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నట్లు స్థానికులు తెలిపారు.

February 26, 2026 / 08:30 AM IST

కోడి పందాల స్తావరంపై దాడి..ఆరుగురు అరెస్ట్

ELR: కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు-సరిపల్లి గ్రామాల మధ్య హుకుంపేట చెరువు సమీపంలో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై బుధవారం అర్ధరాత్రి పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ఏడు మోటార్ బైక్‌లు, మూడు కోడిపుంజులు, రూ.3,750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపారు.

February 26, 2026 / 08:30 AM IST

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

TG: యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కన్నులపండువగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణమహోత్సవం జరగనుంది. అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో తిరుకళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో స్వామివారి కళ్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలిరానున్నారు.

February 26, 2026 / 08:30 AM IST

కాశీబుగ్గ డీఎస్పీ బదిలీ

SKLM: పలాస కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహ బాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. డీఎస్పీను తక్షణమే విధులు నుంచి రిలీవ్‌ చేసి, మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని డీజీపీ హరీష్ కుమార్‌ గుప్తా బుధవారం ఆదేశించారు. ఈయన స్థానంలో ఇన్‌ఛార్జ్‌ డీఎస్పీగా ఎవరిని నియమిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

February 26, 2026 / 08:30 AM IST

జిల్లాలో RDOల బదిలీ

CTR: కుప్పం RDO శ్రీనివాసరాజును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 26 మంది రెవిన్యూ డివిజన్ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా కుప్పం RDO శ్రీనివాసరాజు, నగరి RDO భవాని శంకర్‌ను ట్రాన్స్‌ఫర్ చేసింది.

February 26, 2026 / 08:27 AM IST

అల్లూరు గ్రామంలో దొంగతనం

NDL: నందికొట్కూరు మండలం అల్లూరులో దొంగతనం జరిగినట్లు ఎస్సై మణికంఠ తెలిపారు. గ్రామానికి చెందిన మద్దిలేటి సోమవారం ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్లారు. మంగళవారం రాత్రి తిరిగి వచ్చేసరికి బీరువా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు 10 తులాల వెండి, అర తులం బంగారం,15 వేల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 26, 2026 / 08:26 AM IST

‘వందశాతం నవ్వుకుంటారు.. నాదీ గ్యారంటీ’

శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా నటించిన ‘విష్ణు విన్యాసం’ రేపు విడుదల కానుంది. యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 100% వినోదాన్ని పంచుతుందని, ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవచ్చని శ్రీవిష్ణు ధీమా వ్యక్తం చేశాడు. ఫస్టాఫ్ యువతకు, సెకండాఫ్ కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని చిత్రబృందం తెలిపింది. ఈ మూవీలో విష్ణు విన్యాసాలు బాగుంటాయని నిర్మాత తెలిపారు.

February 26, 2026 / 08:26 AM IST