E.G: రాజమండ్రిలో ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కేసుల నేపథ్యంలో కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ రవిరాజు మంగళవారం బాధితులను సందర్శించారు. కలెక్టర్ కీర్తి చేకూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు. సరైన ప్రోటోకాల్తో వైద్యం అందుతోందని స్పష్టం చేశారు. అనుసరించాల్సిన విధానాలపై స్థానిక వైద్యులకు పలు సూచనలు చేశారు.
NLR: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ఏపీలో అమలవుతోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం నెలకు రూ.1400 కోట్లు ఖర్చు పెడితే, మన ప్రభుత్వం రూ.2750 కోట్లు ఖర్చుపెడుతోందన్నారు. అర్హులందరికీ పించన్ అందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
RR: ఇబ్రహీంపట్నం పరిధి మంచాలలోని నోముల గ్రామంలో భార్యని భర్త హత మార్చాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. నోములకి చెందిన మధర్మోని బాబు తన భార్య అమృతను మద్యం మత్తులో కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NDL: కొలిమిగుండ్ల పట్టణంలో ఇవాళ తాగునీటి సమస్య ఏర్పడింది. ముఖ్యంగా బీసీ కాలనీ, శాంతినగర్, నాయి బ్రాహ్మణ కాలనీలలో పైపులు లీకేజీ కావడంతో త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడ్డారు. గ్రామ సర్పంచ్ శివ రాముడు వెంటనే లీకేజీ ఉన్న ప్రదేశంలో పైపులను మరమ్మతులు చేస్తున్నారు. వేసవికాలంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని గ్రామస్తులు అధికారులను కోరారు.
ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అవనిగడ్డ వంతెన సెంటరులో ఆయన విగ్రహానికి మంగళవారం మండల రేషన్ డీలర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
SRPT: చిలుకూరు మండలం నారాయణపురానికి చెందిన పనస గోవింద్, రెండు రోజుల క్రితం హుజూర్నగర్ వద్ద ముత్యాల బ్రాంచ్ కెనాల్లో కాళ్లు కడుక్కుంటూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. ఈత రాకపోవడంతో కాలువలో కొట్టుకుపోయిన ఆయన ఇవాళ మేళ్లచెరువు మండలం జోగుకుంట వద్ద గోవింద్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చర్మం అందంగా ఉండాలంటే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడాలి. ఇందుకోసం రన్నింగ్, యోగా వంటి వ్యాయామాలు తప్పనిసరి. చక్కెర, ఉప్పు తగ్గించి.. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు డైట్లో చేర్చుకోవాలి. నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. అలాగే, ముఖానికి మర్దన చేయడం వల్ల చర్మ రంధ్రాల్లోని దుమ్ము, మురికి తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
KMM: ఖమ్మం నగర శివారులోని భూదాన్ భూముల్లో పదేళ్లుగా నివాసం ఉంటున్న పేదల గుడిసెలను కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా కూల్చి వేయడాన్ని BRS పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇవాళ తీవ్రంగా ఖండిచారు. పదే పదే ఇందిరమ్మ రాజ్యం అని ప్రగల్బాలు పలికే కాంగ్రెస్ నేతలు పేదల ఇల్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
వనపర్తి జిల్లాలో ఇంటర్మీడియట్కు సంబంధించి బుధవారం నుంచి జిల్లాలో మొత్తం 12,653 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్య తెలిపారు. వారిలో ప్రథమ సంవత్సరం 6,216 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 6,437 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
నల్గొండ అదనపు ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో వన్టౌన్ పోలీసులు పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన 60 మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మొబైల్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, CEIR పోర్టల్లో నమోదు చేయాలని అదనపు ఎస్పీ సూచించారు. ఫోన్లు తిరిగి పొందిన బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
SDPT: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. అక్బర్పేట భూంపల్లి మండల పరిధిలోని భూంపల్లిలో మండల మహిళా సమైక్య భవనానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు బలోపేతం కావాలని, స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.మహిళల సాధికారత కోసం ఇలాంటి భవనాలు ఉపయోగపడతాయని తెలిపారు.
AP: మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి (ఏ-7)కి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అవినాష్ రెడ్డిని వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది.
ఏలూరు: జిల్లావ్యాప్తంగా మంగళవారం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షకు 98 శాతం హాజరు నమోదైనట్లు ఆర్ఐవో యోహాన్ తెలిపారు. మొత్తం 16,433 మంది విద్యార్థులకు గాను 16,046 మంది హాజరయ్యారని, 387 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. హాజరైన వారిలో జనరల్ విభాగం నుంచి 14,209 మంది, ఒకేషనల్ నుంచి 1,837 మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
ఏలూరు: జిల్లా ఐటీడీఏ కేఆర్ పురం ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న గ్రేడ్ 2 తెలుగు పండిట్స్, సుమారు 53 మంది ఉపాధ్యాయులకు ఎస్ఏ తెలుగు పండిట్స్గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ రావు వారికి పదోన్నతి ఉత్తర్వులను మంగళవారం అందజేశారు. ఉపాధ్యాయులు తమ సేవలను గుర్తించినందుకు పీవోకు కృతజ్ఞతలు తెలిపారు.
‘కాంతార’ సీన్ ఇమిటేషన్ వివాదంలో రణ్వీర్ సింగ్కు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. మతపరమైన మనోభావాలు దెబ్బతీశారన్న కేసులో అతనిపై ప్రస్తుతానికి కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తునకు రణ్వీర్ పూర్తిగా సహకరించాలని షరతు విధించింది. అజ్ఞానంతో చేసినా ఇలాంటి పనులు సరికాదని హితవు పలికింది. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేసింది.