• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మండల స్థాయి తెలుగు ప్రతిభా పోటీలు

జోగులాంబ గద్వాల జిల్లా తెలుగు టీచర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో కొండాపురం ZPHSలో మండల స్థాయి తెలుగు ప్రతిభా పోటీలు నిర్వహించారు. దస్తూరి పోటీల్లో అనూష శ్రీ, సంగీత ప్రతిభ కనబరిచారు. పద్య పఠనంలో నందిని, పవిత్ర మెప్పించారు. తెలుగు ప్రతిభా పరీక్షలో రాఘవేంద్ర ప్రథమ స్థానం సాధించారు. విజేతలను నిర్వాహకులు అభినందించారు.

February 27, 2026 / 08:19 AM IST

బండమీదిపల్లిలో నూతన బోరు ప్రారంభం..!

మహబూబ్‌నగర్ జిల్లాలోని 11వ డివిజన్ పరిధిలోని బండమీదిపల్లి, వడ్డెర బస్తీల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బోరు బావిని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి (MSR) ప్రారంభించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రాధాన్యతని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ గిరి గౌడ్, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు.

February 27, 2026 / 08:19 AM IST

అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే

BHNG: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి మండలం నందనం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనం ఇలా ఉన్నామని అన్నారు.

February 27, 2026 / 08:18 AM IST

కల్తీ నిర్ధారణ అయితే క్రిమినల్ కేసులు

KDP: ప్రొద్దుటూరులో గురువారం జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారులు పాల అమ్మకాలపై తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో 4, కడపలో 7 శాంపిల్స్ తీశామని, మొత్తం11 శాంపిల్స్ సేకరించామని తెలిపారు. వీటిని ప్రభుత్వ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేసి కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

February 27, 2026 / 08:15 AM IST

‘పెండింగ్ పనులపై దృష్టి సారించాలి’

PPM: పాలకొండ పంచాయతీ రాజ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్.రాధారాణి గురువారం కలెక్టర్ డా, ప్రభాకర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై దృష్టి సారించాలన్నారు.

February 27, 2026 / 08:13 AM IST

నేడు IPS సునీల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ

AP: IPS సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. నెల రోజుల పాటు అరెస్ట్ చేయొద్దని పాట్నా కోర్టు ఆదేశాలు ఇచ్చిందని సునీల్ తరఫు లాయర్ తెలిపారు. గుంటూరు కోర్టు ఇవాళ మరోసారి వాదనలు విననుంది. కాగా, రఘురామ కస్టోడియల్ కేసులో సునీల్ ఏ7 గా ఉన్న సంగతి తెలిసిందే.

February 27, 2026 / 08:12 AM IST

బ్రిడ్జి నిర్మాణానికి రూ. 27.5 కోట్లు మంజూరు

VKB: కోట్‌పల్లి బ్రిడ్జి నిర్మాణానికి రూ. 27.5 కోట్ల నిధులు మంజూరైనట్లు మండల మాజీ వైస్ ఎంపీపీ వర్ధ మల్లికార్జున్ వెల్లడించారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు ఈ పాత బ్రిడ్జి కొట్టుకుపోవడంతో అప్పటి నుంచి వాహనదారులు, స్థానిక ప్రజలు రాకపోకల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ నిధులు మంజూరు చేయించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 27, 2026 / 08:12 AM IST

పడిపోతున్న రక్తం నిలువలు

NLG: జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రక్తం నిలువలు భారీగా పడిపోతున్నాయి. 400 యూనిట్ల సామర్థ్యం ఉన్న బ్లడ్ బ్యాంక్‌లో ప్రస్తుతం 66 ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒకరికి రక్తం అందించేందుకు ఇద్దరు దాతల నుంచి రక్తం సేకరిస్తున్నప్పటికీ, అవి ఏమాత్రం సరిపోవడం లేదు. రానున్న రోజుల్లో ప్రాణాపాయ స్థితి నెలకొనే పరిస్థితి ఉందని పలువురు వైద్యులు ఆందోళన చెందుతున్నారు.

February 27, 2026 / 08:10 AM IST

వన దుర్గమ్మా.. శరణు.. శరణు!

MDK: ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాత ఆలయంలో శుక్రవారం వేకువజామున అమ్మవారికి ఆలయ అర్చకుడు రావికోటి పార్థివ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. మంజీరా జలాలతో పవిత్ర అభిషేకం చేసిన అనంతరం, పట్టువస్త్రాలు, రంగురంగుల పూలతో మాతను సర్వాంగ సుందరంగా అలంకరించారు. సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి విశేష క్రతువుల తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

February 27, 2026 / 08:10 AM IST

ఉయ్యూరులో నేడు జాబ్ మేళా

కృష్ణ: ఉయ్యూరు AGSGS కళాశాలలో శుక్రవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శివనాథ్ వెల్లడించారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు పూర్తి చేసిన అభ్యర్థులు, బీఎస్సీ కెమిస్ట్రీ, ఫార్మసీ విద్యార్థులు, అలాగే డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు పాల్గొనవచ్చన్నారు. అర్హత గల యువత అవసరమైన ధ్రువపత్రాలతో కళాశాల ప్రాంగణంలో హాజరుకావాలని కోరారు.

February 27, 2026 / 08:10 AM IST

అమెరికా డిమాండ్స్‌కు నో చెప్పిన ఆంథ్రోపిక్

అమెరికా డిమాండ్స్‌కు ఆంథ్రోపిక్ నో చెప్పింది. ఏఐ టూల్ క్లాడ్ నుంచి రక్షణలను తొలగించమని ఆంథ్రోపిక్ సీఈవో వెల్లడించారు. యూఎస్‌ బెదిరింపులు తమ నిర్ణయాన్ని మార్చలేవని స్పష్టం చేశారు. కాగా, సైనిక ప్రయోజనాల కోసం ఎలాంటి షరతులు లేకుండా ఏఐ సాంకేతికతకు యాక్సెస్ ఇవ్వాలని అమెరికా రక్షణ మంత్రి గడువు విధించారు. లేకపోతే కాంట్రాక్ట్ నుంచి బయటకు వస్తామని హెచ్చరించారు.

February 27, 2026 / 08:08 AM IST

‘రెవెన్యూ పన్ను వసూలు ప్రక్రియ ముమ్మరం చేయాలి’

KMM: రెవెన్యూ పన్ను వసూలు ప్రక్రియను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. నగరంలో పన్ను వసూళ్లు, ఆసరా పెన్షన్ల పంపిణీపై మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అధికారులతో గురువారం సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న పెన్షన్ దరఖాస్తులన్నింటినీ వారం రోజుల్లోగా పరిష్కరించి, అర్హులకు ఫలాలు అందేలా చూడాలని ఆదేశించారు.

February 27, 2026 / 08:08 AM IST

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి: ఎస్సై

E.G: ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని గోపాలపురం ఎస్సై పి.శివగణేశ్ సూచించారు. గురువారం గోపాలపురం చెక్ పోస్ట్ సెంటర్‌లో వాహనదారులకు అవగాహన కల్పించారు. రహదారిపై ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయో తెలియదని, ప్రాణాలు కోల్పోతే ఆయా కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా హెల్మెట్ ధరించాలని కోరారు.

February 27, 2026 / 08:06 AM IST

నేడు దానంను విచారించనున్న స్పీకర్

TG: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట విచారణకు MLA దానం నాగేందర్ హాజరుకానున్నారు. BRS నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపిస్తూ దానంపై అనర్హత వేటు వేయాలంటూ పాడి కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈ క్రమంలో దానం విచారణకు హాజరుకానున్నారు. కాగా ఇప్పటికే పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై స్పీకర్ పలువురిని విచారించిన సంగతి తెలిసిందే.

February 27, 2026 / 08:05 AM IST

రేపు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ జిల్లాకు రాక

TPT: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఫిబ్రవరి 28న జిల్లాకు రానున్నారు. మార్చి 1న దామినేడు వద్ద నూతన జిల్లా కోర్టు భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు. పర్యటనకు సంబంధించిన భద్రత, పారిశుద్ధ్యం, హెలిప్యాడ్, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు.

February 27, 2026 / 08:05 AM IST