కృష్ణా: ప్రజల నుంచి అందే అర్జీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్నంలో జాయింట్ కలెక్టర్ నవీన్తో కలిసి ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల గ్రీవెన్స్డే నిర్వహించి వివిధ శాఖల ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించారు.
AP: విజయనగరం జిల్లా భోగాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ. లక్ష లంచం తీసుకుంటున్న వీఆర్వో చిట్టిబాబును అధికారులు పట్టుకున్నారు. 70 సెంట్ల భూమి మ్యుటేషన్కు రైతు నుంచి లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో అధికారులు అక్కడికి చేరుకుని రెండ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
VKB: తాండూరు మండలం కరణ్కోట్లో సోమవారం పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. స్థానిక ఆటో డ్రైవర్ సాయిలు (45)ను ఓ యువకుడు కత్తితో వెంబడించి మరీ కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. పాత కక్షలా లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
భారత్ వేదికగా మ్యాచులు ఆడటమంటే చాలా ఇష్టమని న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ తెలిపాడు. భారత్ అభిమానులు న్యూజిలాండ్ జట్టుకు మద్దతుగా నిలుస్తారని పేర్కొన్నాడు. ఒకవేళ భారత్తో మ్యాచ్ జరిగిన సరే.. కొందరు అభిమానులు బ్లాక్ జెర్సీలు ధరించి తమకు సపోర్ట్ చేస్తారని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం జరుగుతున్న T20 WC కివీస్ తన తర్వాతి మ్యాచ్లో శ్రీలంకతో తలపడనుంది.
జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్ హిట్టర్ హెట్మేయర్ మెరుపులు మెరిపిస్తున్నాడు. కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో అర్థ సెంచరీ బాదాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ తరఫున T20 WCలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా నిలిచాడు. గతంలో 22 బంతుల్లో తన పేరిటే ఉన్న రికార్డును తనే బ్రేక్ చేశాడు.
నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ బాధితుల వినతులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 40 మంది ఫిర్యాదుదారులు వివిధ సంబంధించిన ఫిర్యాదులు సమర్పించారు. ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ సంబంధిత అధికారులకు తక్షణ విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
MDK: ఈనెల 25 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 28 కేంద్రాలలో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 6309 మంది, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 6025 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వివరించారు.
NGKL: కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నేతలు కలెక్టర్ సంతోష్కు వినతిపత్రం ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ. కోటి ఎక్స్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు మంజూరు చేయాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు.
AP: హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. IRR కేసులో సీఎం చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై రేపు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అధికారబలంతో కేసులు మూసివేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు.
MNCL: జిల్లాలో ఎంపిక చేసిన 53 పాఠశాలల్లో ఈనెల 25, 26, 27 తేదీల్లో ఎఫ్ఎల్ఎన్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. సోమవారం మంచిర్యాలలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నియమ, నిబంధనలు, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
TPT: జాతీయ అయోడిన్ లోప నియంత్రణ కార్యక్రమం కింద తిరుపతి జిల్లాలో 2025–26 సంవత్సరానికి సంబంధించిన IDD సర్వేను DM&HO డా.బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 30 PHCల పరిధిలో ఎంపిక చేసిన పాఠశాలల్లో 6-12 ఏళ్ల విద్యార్థుల మెడ పరీక్షలు చేసి గోయిటర్ స్థితిని పరిశీలించారు. ఇళ్లలో వాడుతున్న ఉప్పు, కొంత మంది విద్యార్థుల మూత్ర నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు.
VSP: ఏయూ 91, 92వ సంయుక్త స్నాతకోత్సవాన్ని మార్చి 25న నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు నోటిఫికేషన్ విడుదల చేశారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 11 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఈ వేదికపై పట్టాలు అందుకోనున్నారు.
VKB: రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో VKB జిల్లా పోలీసులు ప్రభంజనం సృష్టించారని ఎస్పీ స్నేహమెహ్రా అన్నారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో పథకాలు సాధించిన పోలీసులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాకు మొత్తం 15 పథకాలు వచ్చాయని తెలిపారు. దీంతో జిల్లా ప్రతిష్ఠను పోలీసులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారని వెల్లడించారు.
KMR: మహమ్మద్నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంకు చెందిన టేక్మాల్ మమత తన భర్త ప్రమాదంలో మృతి చెందిన అనంతరం, కౌలుకు ఇచ్చిన 7 గుంటల భూమిని తిరిగి ఇవ్వకుండా తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ KMR జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు. రెండేళ్ల క్రితం తన భర్త సుధాకర్కు యాక్సిడెంట్ జరిగి అనంతరం మృతి చెందాడని తెలిపారు.