• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అంగరలో వైసీపీ నుండి జనసేనలో చేరికలు

కోనసీమ: కపీలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన పలువురు సోమవారం వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి లీలాకృష్ణ జనసేన కండువాను కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. అంకితభావంతో పనిచేసి మండపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలపరచేందుకు కృషి చేయాలని సూచించారు

February 23, 2026 / 06:57 PM IST

కలెక్టరేట్ కార్యాలయం ముందు జర్నలిస్టుల ధర్నా

RR: అక్రిడిటేషన్ కార్డులలో కోత విధించడంపై RR జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరై ధర్నా చేపట్టారు. జర్నలిస్టులకు ఉన్న ఒక్క గుర్తింపు కార్డును తొలగిస్తే వారికి ప్రయోజనం ఏముంటుందన్నారు. గతంలో అర్హత లేనివారికి కార్డులు ఇవ్వమంటూ ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు అర్హత ఉన్న వారిని సైతం పక్కన పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.

February 23, 2026 / 06:56 PM IST

చంద్రబాబు కావాలనే కుట్ర చేశారు: అంబటి

AP: తన ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు పట్టించుకోలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సీఎం చంద్రబాబు కావాలనే తనపై కుట్రచేశారని మండిపడ్డారు. ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టింది వారు కాదా అని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చుపెట్టే సంస్కృతి తనది కాదని వెల్లడించారు. తన ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 06:56 PM IST

వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన పోస్టర్స్ ఆవిష్కరణ

ATP: జిల్లాలో వెట్టి చాకిరిని పూర్తిగా రూపం మాపాలని, ఎక్కడైనా ఇలాంటి కేసులు కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. అనంతరం వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన చట్టం 1976పై సామర్థ్యత పెంపుదలపై సదస్సు నిర్వహించారు.

February 23, 2026 / 06:55 PM IST

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

SRD: వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డీపీఓ జానకి రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. కార్మికుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

February 23, 2026 / 06:55 PM IST

కల్తీ పాల ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలి: గౌని ప్రతాపరెడ్డి

అనంతపురం: రాజమండ్రిలో కల్తీ పాలఘటన తీవ్ర భయాందోళనకు గురి చేసిందని, దోషులను కఠినంగా శిక్షించాలని రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గౌని ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మీడియాకి ఆయన ప్రకటన విడుదల చేశాడు. విషపు పాలు తాగి రెండు రోజుల్లో నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

February 23, 2026 / 06:54 PM IST

‘శిశువుల మిస్సింగ్ ఘటనకు, ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదు’

PDPL: పెద్దరాత్ పల్లిలో మిస్సింగ్ అయిన పిల్లలు తల్లిదండ్రుల వద్దనే ఉన్నారని DCHS డా. శ్రీధర్ తెలిపారు. శిశువులను, తల్లిదండ్రులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెట్టామన్నారు. శిశువుల సంరక్షణ నిమిత్తం KNR శిశుగృహకు తరలించామని, సంఘటనపై పూర్తి విచారణ చేయడానికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సంఘటనకు మాతా శిశు ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదన్నారు.

February 23, 2026 / 06:53 PM IST

‘ప్రజా రక్షణకు ఆర్మ్డ్ పోలీస్ సేవలు అవసరం’

SKLM: ప్రజలకు పోలీస్ శాఖ అందిస్తున్న సేవలలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల విధులు, సేవలు అత్యంత అవసరమని అదనపు శ్రీకాకుళం జిల్లా అడిషనల్ ఎస్పీ కెవి రమణ అన్నారు. సోమవారం ఎచ్చర్ల పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల 14 రోజుల శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఈ శాఖ ఆవశ్యకతను ఆయన తెలిపారు.

February 23, 2026 / 06:52 PM IST

ఎమ్మెల్యేకు మొదటి ఆహ్వాన పత్రిక అందజేత

RR: ఈనెల 26,27,28 తేదీల్లో షాద్ నగర్ పట్టణంలోని శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మొదటి ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన సంఘాల నాయకులు పాల్గొనాలన్నారు.

February 23, 2026 / 06:50 PM IST

‘వ్యవసాయానికి నిధులు కేటాయించాలి’

KRNL: వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 10 శాతం నిధులు కేటాయించాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో నాయకులు మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు, C2+50% గిట్టుబాటు ధరకు చట్టబద్ధత, ఎరువులు,విత్తనాలపై 90% సబ్సిడీ,ఉచిత పంట భీమా అమలు చేయాలని కోరారు.

February 23, 2026 / 06:48 PM IST

అభిషేక్‌ను జట్టు నుంచి తొలగించాలి: కైఫ్

అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతుండటంతో, అతడిని తుది జట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా, మాజీ క్రికెటర్ కైఫ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో అభిషేక్‌కు విశ్రాంతినివ్వడం మంచిదన్నాడు. ఇది ద్వైపాక్షిక సిరీస్ కాదని, WCలో ప్రతి మ్యాచ్ ఎంతో కీలకమని చెప్పాడు. అభిషేక్ స్థానంలో శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.

February 23, 2026 / 06:48 PM IST

రాజన్న ఆలయంలో పోటెత్తిన భక్తులు

SRCL: వేములవాడ భీమేశ్వరస్వామి దేవస్థానం భక్త జనసంద్రమైంది. రాష్ట్ర నలు మూలల నుంచి వేలాదిమంది భక్తులు తరలి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వేలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించి కోడెల మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయంలో స్వామివారికి భక్తులు అభిషేకపూజలు నిర్వహిస్తున్నారు.

February 23, 2026 / 06:47 PM IST

అదుపుతప్పి కారు బోల్తా

ప్రకాశం: గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు గ్రామ సమీపంలో సోమవారం కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

February 23, 2026 / 06:45 PM IST

చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన న్యాయ సేవా సంస్థ

WGL: నల్లబెల్లిలోని KGVBలో సోమవారం జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ రమేష్ మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిరోధ చట్టం, వరకట్న నిరోధ చట్టాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీత, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 06:45 PM IST

తెలుగు తోట – వెలుగు బాట పుస్తకావిష్కరణ

KRNL: నందవరం మండలం నాగలదిన్నె జెడ్పీ పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న తెలుగు తోట -వెలుగు బాట పుస్తకావిష్కరణ వినుకొండలో ఘనంగా జరిగింది. హెచ్ఎం బి. శైలజ, ఎంఈవో షేక్ జఫ్రుల్లా, ప్రముఖ వైద్యలు డా. ఎల్. యన్. రావు, జన విజ్ఞాన వేదిక కార్యవర్గం చేతుల మీదగా ఆవిష్కరించారు. కవి గద్వాల సోమన్నను సన్మానించారు.

February 23, 2026 / 06:44 PM IST