• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గడ్డి మందును నిషేధించండి: వినోద్ కుమార్

TG: సీఎం రేవంత్ రెడ్డికి BRS నేత బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ‘రాష్ట్రంలో క్షణికావేశంలో గడ్డిమందు తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని రాష్ట్రాలు ఈ గడ్డి మందును నిషేధించాయి. తెలంగాణలో కూడా గడ్డిమందు నిషేధంపై ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆత్మహత్యలకు పాల్పడిన మెజార్టీ రైతుల్లో.. గడ్డిమందును వాడిన వారే ఎక్కువ’ అని లేఖలో పేర్కొన్నారు.

February 21, 2026 / 09:26 PM IST

T20 WC: వర్షార్పణమైన పాక్-కివీస్ పోరు

పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయ్యింది. టాస్ తర్వాత ప్రారంభమైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో, అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లు చెరో పాయింట్‌ను పంచుకున్నాయి. కాగా, రేపు భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.

February 21, 2026 / 09:21 PM IST

అక్రమ వలసదారులను ఏరివేయడం సాధ్యమే: అమిత్ షా

నక్సలిజం నుంచి దేశం విముక్తి పొందుతున్నట్లే.. చొరబాటుదారులను ఏరివేయడం కూడా సాధ్యమేనని కేంద్రమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అక్రమ వలసదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచే కాకుండా.. రాబోయే ఐదేళ్లలో దేశం నుంచే తొలగిస్తామని చెప్పారు. ‘గతంలో రాహుల్ అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని చెప్పారు కానీ, చేయలేదు. ఎందుకంటే వారే ఆ పార్టీకి ఓటు బ్యాంకు’ అని షా ఆరోపించారు.

February 21, 2026 / 09:20 PM IST

జార్ఖండ్‌లో పేలిన మందుపాతర

జార్ఖండ్‌లోని సింగ్‌భం ప్రాంతంలో భారీ ప్రమాదం తప్పింది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. పేలుడు సంభవించిన వెంటనే అప్రమత్తమైన భత్రతా దళాలు గాయపడిన జవాన్లను మెరుగైన చికిత్స కోసం రాంచీకి తరలించారు.

February 21, 2026 / 09:17 PM IST

‘బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలి’

ADB: బజార్హత్నూర్ మండలానికి చెందిన బుకి సుమిత్ అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ సుమిత్ ను శనివారం పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2.5 లక్షల ఎల్‌వోసీని కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

February 21, 2026 / 09:11 PM IST

ఈ నెల 23న తెలంగాణకు కేంద్రమంత్రి

TG: ఈ నెల 23న అలంపూర్ జోగులాంబ ఆలయానికి కేంద్రమంత్రి కుమారస్వామి వస్తున్న నేపథ్యంలో.. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హెలిపాడ్ నుంచి ఆలయం వరకు రహదారులు బాగుండాలని, విద్యుత్ తీగలు సరిచేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. మున్సిపల్ అధికారులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రోటోకాల్ ప్రకారం మర్యాదలు జరగాలని సూచించారు.

February 21, 2026 / 09:11 PM IST

దేవాదులలో తట్టెడు మట్టి తీయలేదు: పెద్ది సుదర్శన్

TG: దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి నిధులు కేటాయించని CM రేవంత్ రెడ్డికి జిల్లాలో పర్యటించే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. దేవాదుల ప్రాజెక్టును రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తామని అసెంబ్లీ ఎన్నికలలో హామీ ఇచ్చి.. రెండేళ్లుగా దేవాదుల ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదన్నారు. CM, మంత్రుల వైఫల్యం దేవాదుల ఆయకట్టు రైతులకు శాపంగా మారిందన్నారు.

February 21, 2026 / 09:10 PM IST

నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం

AP: తూ.గో.జిల్లా దేవరపల్లిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. నిందితుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. నిందితుడు గోపాలపురం మండలం గోపవరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

February 21, 2026 / 09:08 PM IST

కల్వ చర్లలో నేత్రదానం

PDPL: రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన మల్యాల రాధమ్మ మృతి అనంతరం కుటుంబ సభ్యులు నేత్రదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ ఆధ్వర్యంలో సదాశయ ఫౌండేషన్ సహకారంతో ల్యాబ్ టెక్నీషియన్ ప్రదీప్ నేత్రాలను సేకరించారు. కుమారులు శ్రీనివాస్, గణపతి, రాంశంకర్, కృష్ణమూర్తి తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు అభినందించారు.

February 21, 2026 / 09:05 PM IST

రేపు CM పర్యటన.. ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు

ములుగు జిల్లా కేంద్రంలోని దేవాదుల ప్రాజెక్టును ఆదివారం CM రేవంత్ రెడ్డి పరిశీలించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్, దేవాదుల పంప్ హౌస్ వద్ద ఏర్పాట్లను అదనపు కలెక్టర్ మహేందర్ జీ, RDO వెంకటేష్ పరిశీలించారు. భద్రత ఏర్పాట్లను BHPL SP సంకీర్త్ గౌడ్, ఏటూరునాగారం ASP మనన్ భట్ పరవేక్షిస్తున్నారు.

February 21, 2026 / 09:05 PM IST

రేవంత్ చేతకాని పాలనకు పరాకాష్ట SLBC దుర్ఘటన: KTR

TG: SLBC సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. చివరి చూపు చూసే అవకాశం లేకుండా కార్మికుల కుటుంబాలకు మానసిక క్షోభకు గురి చేసిందన్నారు. మృతదేహాల వెలికితీతలో కానీ సొరంగం పనుల్లో కానీ ఎటువంటి పురోగతి లేకపోవడం రేవంత్ నిర్లక్ష్యానికి, చేతకానితనానికి నిదర్శనమన్నారు.

February 21, 2026 / 09:05 PM IST

అస్తిత్వానికి మాతృభాష సుస్థిరమైన కోట: వెంకయ్యనాయుడు

AP: మాతృభాషా వికాసమే మానవ జాతి ప్రకాశమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు కవుల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అస్తిత్వానికి మాతృభాష సుస్థిరమైన కోట అని తాను బలంగా విశ్వసిస్తానని తెలిపారు. సంస్కృతి, విలువలు, సంప్రదాయాలు అన్నీ భాషతోనే ముడిపడి ఉన్నాయన్నారు.

February 21, 2026 / 09:03 PM IST

సౌతాఫ్రికాపై అయినా అభిషేక్ మెరుస్తాడా?

టీ20 ప్రపంచకప్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది కాలంగా అదిరిపోయే ఆరంభాలతో జట్టును ఆదుకున్న అభిషేక్, ఇప్పుడు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. అతడి ఫామ్ లేమి జట్టు బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రేపు సౌతాఫ్రికాతో జరగే సూపర్-8 పోరులోనైనా అభిషేక్ జట్టుకు శుభారంభం అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

February 21, 2026 / 09:03 PM IST

బాధితులకు త్వరితగతిన న్యాయం: ఏఎస్పీ

ఏలూరు జిల్లా కోర్టు మానిటరింగ్ పోలీసు సిబ్బందితో ఏఎస్పీ సూర్యచంద్రరావు శనివారం సమీక్ష నిర్వహించారు. మానిటరింగ్ సెల్ ఏర్పాటు తర్వాత 47 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని, అందులో 25 మందికి జీవిత ఖైదు ఖరారైందని ఆయన వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో విధులు నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందిని కోరారు. ఈ సమావేశంలో కోర్టు మానిటరింగ్ సీఐ పాల్గొన్నారు.

February 21, 2026 / 09:00 PM IST

‘రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం’

అన్నమయ్య: రాయచోటి వైఎస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ ప్రయోజనాలను విస్మరించారని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ఆపివేయడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సరిగా అమలుకావడం లేదని, ఎన్నికల హామీలు నెరవేర్చడం లేదని ఆరోపించారు.

February 21, 2026 / 09:00 PM IST