• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎస్పీ

ADB: తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఎస్పీకి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు.

February 21, 2026 / 07:03 PM IST

భద్రాచలం నుంచి అహోబిలానికి తరలివచ్చిన భక్తులు

NDL: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తెలంగాణ రాష్ట్రం భద్రాచలం నుంచి 200మంది భక్తులు తరలివచ్చారు. భద్రాచలం అహోబిలం మఠం అర్చకుడు కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో నరసింహస్వామి దీక్షాపరులు, భక్తులు తరలివచ్చి నవ నరసింహ క్షేత్రాలను దర్శించుకున్నారు. అహోబిలం పీఠాధిపతి రంగనాథ యతీంద్రను కలిసి భద్రాచలం నుంచి తెచ్చిన మాలమర్యాదలను ఇచ్చారు.

February 21, 2026 / 07:03 PM IST

దంపతులపై దాడి కేసు నమోదు

అన్నమయ్య: మదనపల్లె మండలంలోని పొన్నేటిపాళ్యం పంచాయతీ పరిధి పనసమాకులపల్లిలో ఆవు చేనులో మేసిందనే కారణంతో దంపతులపై దాడి జరిగింది. గ్రామానికి చెందిన కుక్కల నగేష్, మల్లికార్జున, హరికృష్ణ, మాలతి, రాహుల్ తమను దారుణంగా కొట్టారని బాధితులు శంకర, ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు శనివారం తెలిపారు.

February 21, 2026 / 07:03 PM IST

విద్యార్థులకు అవగాహన

SRCL: బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను శనివారం షీ టీమ్ బృందం సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎవరైనా బాలికలు, మహిళలు వేధింపులకు గురైతే నిర్భయంగా షీ టీమ్ నెంబర్ 8712656425కు ఫిర్యాదు చేయాలన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని సూచించారు.

February 21, 2026 / 07:03 PM IST

సీపీఎం ఆధ్వర్యంలో RED BOOKS డే

WNP: వనపర్తి పట్టణంలో శనివారం సీపీఎం ఆధ్వర్యంలో రెడ్ బుక్స్ డే ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ కార్యాలయంలో జిల్లా నాయకుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్మికుల హక్కులు మొదలగు వాటి గురించి రెడ్ బుక్స్ ద్వారా తెలిసిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 07:02 PM IST

‘మనిషి వికాసం మాతృభాషతో జరుగుతుంది’

MBNR: జడ్చర్లలోని డా.బీ.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్లం, హిందీ, తెలుగు, సంస్కృతం, ఉర్దూ విభాగాలన్ని కలిసి ఘనంగా మాతృభాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జీ. సుకన్య పాల్గొని మాట్లాడారు. మనిషి వికాసం మాతృభాషతో జరుగుతుందన్నారు. భాష అమ్మలాంటిదని, అమ్మను ప్రేమించినట్లు భాషను ప్రేమించి, గౌరవించాలన్నారు.

February 21, 2026 / 07:02 PM IST

రాష్ట్ర స్థాయిలో తులసీదాస్ సత్తా

NGKL: ఊర్కొండ మండలం బొమ్మరాశిపల్లి గ్రామానికి చెందిన గోవిందు విజయ్ యాదవ్ కుమారుడు గోవిందు తులసీధర్ రాష్ట్రస్థాయి దివ్యంగా క్రీడల్లో చక్కని ప్రతిభ కనబరిచి తన సత్తాను చాటుకున్నారు. జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్, జిల్లా విద్యాధికారి రమేశ్ కుమార్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు అతడికి అభినందనలు తెలిపారు.

February 21, 2026 / 07:02 PM IST

రామాలయం నిర్మాణానికి మాజీ ఎంపీపీ విరాళం

VZM: డెంకాడ మండలం సింగవరం పంచాయితీ లెంకపేట గ్రామంలో నిర్మించనున్న నూతన రామాలయం నిర్మాణానికి మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ శనివారం విరాళం అందజేశారు. అక్కివరం తన స్వగృహంలో ఆలయ కమిటీ సభ్యులకు రూ.25,000 విరాళం అందజేశారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 07:02 PM IST

జోగులాంబ ఆలయంలో ప్రముఖ డైరెక్టర్

GDWL: అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంను ‘బలగం’ చిత్ర దర్శకుడు, సినీ నటుడు వేణు యెల్దండి శనివారం దర్శించుకున్నారు. అమ్మవారిని, స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది సురేశ్ పాల్గొన్నారు.

February 21, 2026 / 07:02 PM IST

‘సామాజిక న్యాయం కోసమే చట్టాలు’

KNR: ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఆదేశాలకు అనుగుణంగా పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో డిప్యూటీ లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తనకు మహేష్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. లింగ, ధనిక, పేద, మత ఏ ఇతర వాటితో సంబంధం లేకుండా అందరికీ సామాజిక న్యాయం అందించేలా చట్టాలు రూపొందించబడ్డాయని అన్నారు.

February 21, 2026 / 07:01 PM IST

పరీక్షల సమయంలో జిరాక్స్ కేంద్రాల మూసివేత

KRNL: జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సూచనల మేరకు జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయాలని ఉప కార్మిక కమిషనర్ కె. వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈనెల 23 నుంచి మార్చి 24 వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 21, 2026 / 07:01 PM IST

డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు

ASR: జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాలతో అరకు సర్కిల్ పరిదిలో శనివారం సీఐ హిమగిరి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, డాగ్ స్క్వాడ్‌తో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అరకు రైల్వే స్టేషన్లు, అరకులోయ బస్ స్టేషన్‌లో డాగ్ స్క్వాడ్‌తో అణువణువు తనిఖీలు చేపట్టారు. రైలు, బస్సులలో ప్రయాణికుల వద్ద వున్న బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

February 21, 2026 / 07:01 PM IST

బ్లూ పోలీస్ వాహనానికి గ్రీన్సిగ్నల్

PPM: పార్వతీపురం పట్టణంలో బ్లూ పోలీస్ వాహనాన్ని ఏఎస్పీ మనీషా రెడ్డి గ్రీన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల భద్రతే లక్ష్యంగా బ్లూ పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. క్రైమ్ నియంత్రణ, చైన్ స్నాచింగ్, దొంగతనాలు వంటి ఘటనలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

February 21, 2026 / 07:01 PM IST

‘SC, ST కుటుంబాలకు ఉచిత సోలార్ రూఫ్‌టాప్‌లు’

సత్యసాయి జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం కింద 11,987 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలు మంజూరైనట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. శనివారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే అర్హులైన పేదలకు ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు.

February 21, 2026 / 07:01 PM IST

బాల్య వివాహాల నిర్మూలన చైతన్య రథాన్ని ప్రారంభించిన RDO

ATP: అనంతపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో శనివారం బాల్య వివాహాల నిర్మూలన చైతన్య రథాన్ని ఆర్డీవో కేశవ నాయుడు ప్రారంభించారు. రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భానుజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాల్య వివాహాల నిరోధానికి ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

February 21, 2026 / 07:00 PM IST