• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఏపీకి నీళ్లు.. స్పందించిన రేవంత్

TG: గతంలో KCR, హరీష్ రావు తప్పులు చేశారని ప్రజలు గ్రహించే.. తీర్పు ఇచ్చారని CM రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు వాళ్లేం చేశారో.. ఈ ప్రభుత్వం ఏం చేసిందో సభలో చర్చిద్దామన్నారు. పదేళ్ల అనుభవంతో వాళ్లు సూచనలు చేస్తే.. స్వీకరిస్తామని చెప్పారు. నీటి జలాలు AP తరలించుకుపోతోందనే ప్రచారం అవాస్తవమన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేద్దాం.. ప్రజలు నీళ్ల విషయంలో కాదన్నారు.

February 22, 2026 / 06:08 PM IST

అంగన్వాడీల సమస్యలపై రిలే నిరాహార దీక్షలు

KRNL: అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ఈనెల 23-27 వరకు రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి రవిచంద్ర ఇవాళ తెలిపారు. వేతనాల పెంపు,మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడం,పని భారం తగ్గించడం,అదనపు యాపుల తొలగింపు,లేబర్ కోడ్ల రద్దు వంటి డిమాండ్లపై బడ్జెట్ సమావేశాల్లో చర్చించి న్యాయం చేయాలిన్నారు.

February 22, 2026 / 06:08 PM IST

కాంగ్రెస్ దాడులపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

NRPT: కోస్గి 5వ వార్డులో కాంగ్రెస్ నాయకుడి దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. అధికార మదంతో కాంగ్రెస్ దాడులకు దిగుతోందని, ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, బాధితులకు పూర్తి భరోసా కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

February 22, 2026 / 06:07 PM IST

మేడ్చల్ రోడ్ సేఫ్టీ క్యాంప్

మేడ్చల్ జిల్లా చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ ప్రమాదాల నివారణకు SHO సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, స్థానికులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాల సమయం, కారణాలు, నివారణ చర్యలపై వారు చర్చించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

February 22, 2026 / 06:07 PM IST

పెరిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా ముక్కెర శ్రీనివాస్ ఎన్నిక

NRML: పెరిక కుల సంఘం జిల్లా అధ్యక్షులుగా ముక్కెర శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కడెం మండలం కొండుకూర్‌లో ఏర్పాటు చేసిన జిల్లా పెరిక కుల సంఘం సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకంతో పెరిక సంఘం జిల్లా అధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.

February 22, 2026 / 06:06 PM IST

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

ADB: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో బోరజ్ మండలం మండగడలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శాంతన్ రావు తెలిపారు. ఆదివారం గ్రామంలోని పాఠశాలలో శ్రీకృష్ణ, శ్రీ గణేష్ ఆస్పత్రుల సహకారంతో జరిగిన ఈ శిబిరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారన్నారు.

February 22, 2026 / 06:06 PM IST

అగ్ని ప్రమాద బాధితులకు అండగాఉంటాం: ఎమ్మెల్సీ

GDWL: అయిజలోని పరమేశ్వర ఇండస్ట్రీస్లో జరిగిన భారీ అగ్నిప్రమాద బాధితుడు ప్రతాపరెడ్డిని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు పరామర్శించారు. సుమారు రూ.3 కోట్ల నష్టం వాటిల్లడంపై వారు విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తామని, అయిజలో త్వరలోనే అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.

February 22, 2026 / 06:05 PM IST

బాధ్యతాయుతంగా పనిచేసేందుకు కృషి చేస్తా: మేయర్

BDK: కార్పోరేషన్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నూతన మేయర్ మూడ్ గణేష్ ఇవాళ స్పష్టం చేశారు. తనకు ఇచ్చిన ఈ పదవి ఒక బాధ్యతయుతంగా పనిచేసేందుకు ఉపయోగిస్తానని ఎక్కడ అవినీతికి తావులేకుండా పనిచేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు ఆశీర్వదించి నమ్మకంతో గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు.

February 22, 2026 / 06:04 PM IST

గ్రామీణ డాక్ సేవక్‌ల సేవలు గొప్పవి: సీఎం

AP: సూపర్ సిక్స్ పథకాల అమలులో గ్రామీణ డాక్ సేవక్‌ల సేవలు గొప్పవని CM చంద్రబాబు కొనియాడారు. గ్రామీణ డాక్ సేవక్‌ల గౌరవం పెంచేందుకు సింధియా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మరో ఏడాదిలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారతామని వెల్లడించారు. వికసిత్ భారత్ సాధనలో గ్రామీణ డాక్ సేవక్‌లు ముందుండాలని సూచించారు. తపాలాశాఖలో చేరిన యువతకు అభినందనలు తెలిపారు.

February 22, 2026 / 06:04 PM IST

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి: ఎమ్మెల్యే

కాకినాడ తీర ప్రాంతాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి ఎప్పుడూ కొనసాగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. శనివారం కాకినాడ స్థానిక బీచ్‌లో ఎస్కేర్ గోకార్టింగ్ ఆధ్వర్యంలో బీచ్ సందర్శకుల కోసం ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు.

February 22, 2026 / 06:03 PM IST

గరుడాచలం నాయుడు సేవలు చిరస్మరణీయం

BPT: బాపట్లలో పేరం గరుడాచలం నాయుడు సేవలను ప్రముఖులు కొనియాడారు. ఆదివారం తూర్పు సత్రం వద్ద ఆయనకు నివాళులర్పించారు. పేదల కోసం ఆస్తినంతా దానం చేసిన ఆయన జీవితం ఆదర్శనీయమన్నారు. చీలు రోడ్ సెంటర్‌లో ఆయన విగ్రహం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మను, తులసి రామచంద్ర ప్రభు, ఉగ్గిరాల సీతారామయ్య అభినందించారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని తెలిపారు.

February 22, 2026 / 06:02 PM IST

నాగర్ కర్నూల్‌లో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి

నాగర్ కర్నూల్ జిల్లాలో ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని నోడల్ అధికారి వెంకటరమణ తెలిపారు. 15,173 విద్యార్థులు 34 కేంద్రాల్లో పరీక్షలకు హాజరవుతారు. 300 ఇన్విజిలేటర్లు, CC కెమెరాలు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 34 చీఫ్ సూపరింటెండెంట్స్, 6 కస్టోడియన్స్ 34 మెడికల్ ANMలు ఏర్పాటు చేశారు. హాల్ టికెట్ల QR కోడ్ ద్వారా కేంద్ర వివరాలు తెలుసుకోవచ్చు.

February 22, 2026 / 06:02 PM IST

ఒకే రోజు 26 మందికి పదోన్నతులు

NLR: సమర్థవంతంగా పని చేస్తూ జిల్లాను ప్రగతి పథంలో నిలపాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న 26 మందికి వివిధ హోదాలలో పదోన్నతులు కల్పిస్తూ ప్రొసీడింగ్‌ను కలెక్టర్ అందించారు. సీనియర్ అసిస్టెంట్ నుంచి ఆర్ఎస్ఐలుగా 8మంది, గ్రేడ్-1 గ్రామ రెవెన్యూ అధికారుల నుంచి సీనియర్ అసిస్టెంట్ హోదా కల్పిస్తూ 18 మందికి ఉత్తర్వులు జారీ చేశారు.

February 22, 2026 / 06:00 PM IST

శానిటేషన్ బ్లాక్‌ను ప్రారంభించిన మంత్రి దుర్గేశ్

E.G: నిడదవోలు బాలికల ఉన్నత పాఠశాలలో నెస్లే సంస్థ CSR నిధులతో నిర్మించిన శానిటేషన్ బ్లాక్‌ను మంత్రి కందుల ప్రారంభించారు. విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రతకు మౌలిక వసతులు కీలకమని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెబుతూ.. నెస్లే సంస్థ సామాజిక బాధ్యతను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:00 PM IST

గత పాలకులు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయలేదు: CM

MLG: గోదావరి జలాలకు సంబంధించిన వివాదం గత కొంతకాలంగా రాజకీయ రంగంలో చర్చనీయాంశంగా మారిందని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం కన్నయ్యగూడెం మండల కేంద్రంలోని దేవాదుల ప్రాజెక్టు వద్ద నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 10 ఏళ్లు పాలించిన ప్రభుత్వం ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ఉంటే రైతులకు ఇబ్బందులు రాకుండా ఉండేదని CM విమర్శించారు.

February 22, 2026 / 05:57 PM IST