ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరా నగర్లో పేకాట స్తావరంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో గోలి వెంకటేష్, గడ్డం లక్ష్మణ్, గుర్లే రవీందర్ పట్టుబడగా మరో ఆరుగురు పరారయినట్లు తెలిపారు. సంఘటన స్థలంలో రూ. 12,040 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిని పోలీస్ స్టేషన్కి తరలించినట్లు SI వెంకట కృష్ణ పేర్కొన్నారు.
HNK: హన్మకొండలోని వాగ్డేవి కళాశాల విధ్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ “అరైవ్ అలైవ్” ఏర్పాటు చేశారు. CP సన్ ప్రీత్ సింగ్ హాజరై మాట్లాడుతూ.. వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలను తీసుకుంటూ వాహనం నడపాలని అన్నారు. అనంతరం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామంటూ విద్యార్థుల చేత ట్రాఫిక్ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు.
MDCL: కూకట్పల్లి పరిధి గోపాల్ నగర్ ఏరియాల్లో అనుమతులకు మించిన నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడికి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏకంగా జోనల్ కమిషనర్ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదన్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఎందుకు, నిర్లక్ష్యంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
HNK: కలెక్టర్ కార్యాలయం ఎదుట డెస్క్ జర్నలిస్టులు మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధు మాట్లాడుతూ.. గతంలో విధంగా డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేశారో అదేవిధంగా కార్డులు మంజూరు చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు.
NLR: ఈనెల 25న నెల్లూరుకు ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ రానున్నట్లు జిల్లా పౌర సంబంధాల సమాచార శాఖ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉ.10.30 గంటలకు నెల్లూరులోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకుంటారు. అనంతరం ఉ.11.00 గంటల నుంచి కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో పోష్ యాక్టు -2013 పై జరిగే వర్క్ షాపులో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.
KMR: బీబీపేట మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో రజకులపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రజక సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
TG: మహబూబ్నగర్ జిల్లాలో చెరువులో గల్లంతైన ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. రెండు రోజుల క్రితం జడ్చర్ల మండలం గొల్లపల్లి చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మృతులు నవీన్, యాదగిరిగా గుర్తించారు. వారి మృతదేహాలను గ్రామస్తులు ఈ రోజు బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
BHPL: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఐడీవోసీ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్, టీజీ ఎండీసీ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, ఇందిరమ్మ ఇళ్లుకు ఇసుక సరఫరా, కొడవటంచ దేవాలయ జాతర ఏర్పాట్లు, రైతులు యూరియా కొరకు యాప్ ద్వారా బుకింగ్ చేయుట తదితర అంశాలపై సమీక్షా నిర్వహించారు.
SRPT: చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన గొర్రెలు, మేకల షెడ్లను, మంగళవారం సూర్యాపేట జిల్లా జడ్పీ ఇన్ఛార్జ్ సీఈవో శిరీష పరిశీలించారు. పనుల వివరాలను రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని సందర్శించి మొక్కల రక్షణకు షెడ్ నెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
KDP: పోరుమామిళ్ల (M) చెందిన ఫేక్ మాబు షరీఫ్ నేషనల్ వాలీబాల్ టోర్నమెంటుకు ఎంపికయ్యాడు. ఈనెల 25 నుంచి 28 వరకు ఉత్తరప్రదేశ్ మీట్లో జరుగునున్న 14వ సీనియర్ పారసిట్టింగ్ వాలిబాల్ నేషనల్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టీమ్ నుంచి మాబు షరీఫ్ పాల్గొంటారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ కనబడచిన మాబు షరీఫ్ నేషనల్ పోటీలకు ఎంపిక చేశామని వాలీబాల్ అసోసియేషన్ తెలిపింది.
W.G: భీమవరంలోని శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న నిర్వహించనున్న మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో ఇందుకు సంబంధించిన గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ మేళాలో సుమారు 21 ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలన్నారు.
ADB: జిల్లా కేంద్రంలోని ఏరోడ్రమ్ ప్రాంతంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్ను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా ఎన్ని ఎకరాలు ఎక్కడి వరకు ఎన్ని భూములు వెళ్తున్నాయో మ్యాప్ ఆధారంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపళ్లి గంగాధర్ రావు, కౌన్సిలర్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
MHBD: బయ్యారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కళాశాల ప్రిన్సిపల్ పర్యవేక్షణలో పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులను ఏర్పాటు చేశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.