• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జనగణన శిక్షణలో కలెక్టర్ దిశానిర్దేశం

GNTR: గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా జనగణన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. జనగణన ప్రక్రియలో చార్జ్ ఆఫీసర్లు, అడిషనల్ చార్జ్ ఆఫీసర్లు, ఎన్యుమరేటర్ల బాధ్యతలు అత్యంత కీలకమని తెలిపారు. డిజిటల్ యాప్‌ల ద్వారా నిర్వహించనున్న జనగణనలో నాణ్యమైన డేటా సేకరణకు పూర్తి అవగాహనతో పాటు సమర్థ పర్యవేక్షణ అవసరమని సూచించారు.

February 24, 2026 / 09:30 PM IST

కల్తీ పాలు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్

AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

February 24, 2026 / 09:29 PM IST

ఆలయానికి విరాళాలు అందజేత

KMR: పల్వంచ మండలం భవానీపేటలో మంగళవారం రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. పల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లె రమేశ్ గౌడ్ హాజరయ్యారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయంగా రూ.1,16,000 లక్షల విరాళం అందజేశారు. మాతమ్మ ఆలయానికి రూ.20,000 వేలు సహాయం ప్రకటించి చెక్కును గ్రామస్థులకు పంపిణీ చేశారు. గ్రామ అధ్యక్షుడు చాకలి రాజు కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 09:28 PM IST

బాధితులకు అండగా ఉంటాం: తానేటి వనిత

AP: వారం రోజులు గడిచినా పాలల్లో కల్తీ ఏ విధంగా జరిగిందో కూటమి ప్రభుత్వం గుర్తించలేకపోయిందని మాజీ హోంమంత్రి తానేటి వనిత విమర్శించారు. ఒకే ఫ్యామిలీకి చెందిన అనేకమంది బాధితులు ఆసుపత్రిలో చేరడంతోనే పాల కల్తీ వ్యవహారం బయటపడిందని తెలిపారు. బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అండగా ఉండేదని చెప్పారు.

February 24, 2026 / 09:25 PM IST

ట్రాఫిక్​ నిబంధనలపై అవగాహన ఉండాలి: సీపీ

NZB: సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సీపీ సాయి చైతన్య సూచించారు. రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై విద్యార్థులు ఇతరులను చైతన్యవంతం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అలైవ్-​ అరైవ్’​ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 09:23 PM IST

నీటి హక్కుల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమే: ఉత్తమ్

TG: నీటి హక్కుల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమే అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నీటిబొట్టును కూడా వదలం అని తెలిపారు. నీటి హక్కుల గురించి మాట్లాడే నైతికహక్కు BRSకు లేదని విమర్శించారు. నీటి హక్కుల విషయంలో BRS చారిత్రాత్మక ద్రోహం చేసిందని ఆరోపించారు. 2028 నాటికి కృష్ణా ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

February 24, 2026 / 09:13 PM IST

జాతీయ స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్‌కు పాడేరు విద్యార్ధినిలు

ASR: నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్‌కు పాడేరు మండలం, గుత్తులపుట్టు ఆశ్రమ పాఠశాల 9వ తరగతి విద్యార్ధినిలు ఎంపికయ్యారు. అమృతసర్‌లో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌కు విద్యార్ధినిలు హాజరవుతున్నారు. ఈ మేరకు జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మంగళవారం విశాఖ ఎయిర్ పోర్ట్‌లో విద్యార్ధినిలకు శుభాకాంక్షలు తెలిపారు.

February 24, 2026 / 09:08 PM IST

బాల బాలికలకు సైక్లింగ్ పోటీలు

AKP: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అనకాపల్లి సుంకర మెట్టు నుంచి దేవిపురం వరకు సైక్లింగ్ ఎంపిక పోటీలు మంగళవారం నిర్వహించినట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి పీ. శైలజ తెలిపారు. అండర్ 18 విభాగంలో 45 మంది బాలురు, పదిమంది బాలికలు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలో ఎంపికైన వారు ఈనెల 28 నుంచి విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

February 24, 2026 / 09:06 PM IST

ఫ్యామిలీ ఎమర్జెన్సీ.. రింకూ సింగ్ ఇంటికి

టీమిండియా ప్లేయర్ రింకూ సింగ్ టీ20 ప్రపంచకప్ మధ్యలోనే ఇంటికి చేరుకున్నాడు. కుటుంబ అత్యవసర పరిస్థితుల కారణంగా అతడు ఇంటికి వెళ్లినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన టీమిండియా ట్రైనింగ్ సెషన్‌కు అతడు హాజరు కాలేదు. రింకూ తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. పరిస్థితి విషమంగా ఉండటంతో అతడు వెంటనే వెళ్లాల్సి వచ్చిందని సమాచారం.

February 24, 2026 / 09:05 PM IST

‘సాగు రంగానికి చేస్తున్న కృషి ప్రజల్లోకి వెళ్లాలి’

AP: కేబినెట్ భేటీలో అజెండా అంశాలు ముగిసిన అనంతరం తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా సాగు రంగానికి చేస్తున్న కృషి అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి వెళ్లాలని తెలిపారు. సందర్భం మేరకు తాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చల్లో పాల్గొంటామని చంద్రబాబు తెలిపారు. శాఖల వారీగా పద్దులపై జరిగే చర్చలకు మంత్రులు బాగా ప్రిపేర్‌ కావాలని సూచించారు.

February 24, 2026 / 09:05 PM IST

ఓర్వకల్లు శివాలయంలో ప్రారంభమైన ప్రతిష్ఠా ఉత్సవాలు

PLD: అచ్చంపేట మండలం ఓర్వకల్లు గ్రామంలో శివాలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం జరిగిన ముందస్తు పూజా కార్యక్రమాల్లో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముఖ్య అతిథిగా పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

February 24, 2026 / 09:03 PM IST

మేళ్లచెరువు జాతర ఆదాయం ఎంతంటే..?

SRPT: మేళ్లచెరువు రామలింగేశ్వర స్వామి జాతర ద్వారా మొత్తం రూ. 45,43,657 లక్ష్లల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శంభిరెడ్డి మంగళవారం తెలిపారు. టికెట్ ద్వారా రూ. 15 లక్షలు, ఉండి ద్వారా రూ. 12 లక్షలు, వేలం పాటల ద్వారా రూ. 6 లక్షలు లభించాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం రూ. 6 లక్షలు వరకు పెరిగిందని ఆయన తెలియజేశారు.

February 24, 2026 / 09:02 PM IST

ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ

KNR: మానకొండూరు మండలం మద్దికుంట గ్రామపంచాయతీలో మంగళవారం శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఐదుగురికి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలు కట్టెల పొయ్యి వాడకం వల్ల అనారోగ్యానికి గురవుతున్నాయని, పేదలను దృష్టిలో ఉంచుకుని పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కవిత, ఉప సర్పంచ్ పాల్గొన్నారు.

February 24, 2026 / 09:02 PM IST

టూరిజం మాస్టర్ ప్లాన్ పై సమావేశం

BHNG: టూరిజం మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా ఇవాళ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టూరిజం మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో రెండు రోజులలో ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. రాచకొండ, భువనగిరి ఫోర్ట్, మహదేవ్ పూర్, యాదాద్రి టెంపుల్, కొలనుపాకలను గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

February 24, 2026 / 09:00 PM IST

అంబులెన్స్ ఛార్జీలు అధికంగా వసూలు చేస్తే చర్యలు: కలెక్టర్

BPT: ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లనే వసూలు చేయాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం చార్జీల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఆయన, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక వసూళ్లపై ఫిర్యాదు చేసేందుకు 7702806804 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

February 24, 2026 / 09:00 PM IST