• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇంటర్ పరీక్షలకు ఎంత మంది గైహాజరు అంటే..!

ఏలూరు: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బోటనీ , హిస్టరీ వన్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. 3,197 మంది విద్యార్థులకు 2,707 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 490 మంది పరీక్షకు గైహాజరయ్యారని దీని కారణంగా 85% హాజరు నమోదు అయిందని అధికారులు వివరించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశామన్నారు.

February 27, 2026 / 03:08 PM IST

CRDAలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

NTR: AP CRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన MIS ఆపరేటర్, ESM యూనిట్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, DEE-ఎలక్ట్రికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 2లోపు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని CRDA కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. విద్యార్హత, దరఖాస్తు విధానం తదితర వివరాల కోసం వెబ్ సైట్ ను సందర్శించగలరు.

February 27, 2026 / 03:08 PM IST

ఘనంగా శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవాలు

VKB: దోమ మండలం శివారెడ్డిపల్లిలో శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవాలు భక్తిశ్రద్ధతో ఘనంగా నిర్వహించబడ్డాయి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దంపతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు, కైంకర్యాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గ్రామ ప్రజలు ఐక్యంగా ఉండాలని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సౌహార్దాన్ని పెంపొందిస్తాయని సూచించారు.

February 27, 2026 / 03:06 PM IST

రోడ్డు పనులు ప్రారంభించాలని మంత్రికి వినతి

SRPT: నూతనకల్ మండలం నుంచి వెంకేపల్లి వరకు నిలిచిపోయిన తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కోరారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ భవనంలో మంత్రిని కలిసి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలియజేశారు.

February 27, 2026 / 03:06 PM IST

బస్వాపూర్‌లో పారిశుధ్య పనులు

KMR: జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు. ఈ పారిశుధ్య పనులలో భాగంగా డ్రైనేజీని సిబ్బందితో శుభ్రం చేయించారు. అనంతరం పిచ్చి మొక్కలను తొలగించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. వార్డులో విధి దీపాల, త్రాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

February 27, 2026 / 03:05 PM IST

గిరిజన సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యం

PPM: పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలోని గిరిమిత్ర హాలులో శుక్రవారం జరిగిన ‘గిరిజన పీజీఆర్ఎస్’ కార్యక్రమానికి స్పందన లభించింది. ఐటీడీఏ ఇంఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ గిరిజనుల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 5 ప్రధాన వినతులు అధికారుల దృష్టికి వచ్చాయి. వినతులను పరిశీలించారు.

February 27, 2026 / 03:05 PM IST

‘రేపు కౌన్సిల్ అత్యవసర సమావేశం’

CTR: పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం రేపు (శనివారం )ఉదయం 11 గంటలకు జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ అలీమ్ బాషా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

February 27, 2026 / 03:03 PM IST

రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

PDPL: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ హాజరై ముస్లిం మత పెద్దల సమస్యలను తెలుసుకున్నారు. గతంతో పోలిస్తే ఈసారి రంజాన్ వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. నగర మేయర్ మహంకాళి స్వామి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్జీ-1 జీఎం, వన్ టౌన్ సీఐ ఉన్నారు.

February 27, 2026 / 03:03 PM IST

షుగర్ ఉన్నవారు మామిడిపండు తింటే?

మామిడి పండ్లు తింటే షుగర్ పెరగడం పక్కన పెడితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు సరైన పద్ధతిలో మామిడి తింటే అది వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేలింది. రోజుకు 250 గ్రాముల కంటే ఎక్కువ మామిడి పండును తీసుకోకూడదు. బిర్యానీలు లేదా స్వీట్లు తిన్న తర్వాత మామిడి పండు తింటే మాత్రం షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉంది.

February 27, 2026 / 03:02 PM IST

వినతి పత్రం సమర్పించిన నాయకులు

MNCL: జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న దీక్షకు మద్దతుగా వారు శుక్రవారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం రూ. 50 వేల కోట్లను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఉన్నారు.

February 27, 2026 / 03:01 PM IST

బడి పిల్లల కథా రచనలకు ఆహ్వానం

జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కథారచనలను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాము శుక్రవారం తెలిపారు. కథల్లో నైతిక విలువలు, మానవతా భావాలు, నీతినిజాయితీ వంటి అంశాలు ప్రతిఫలించాలన్నారు. పాఠశాల స్థాయిలోనే కథారచన అలవాటు పెంపొందితే భవిష్యత్తులో మంచి రచయితలుగా ఎదుగుతారన్నారు.

February 27, 2026 / 03:01 PM IST

ఇంటర్ పరీక్షల్లో 181 మంది విద్యార్థులు గైర్హాజరు

TPT: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం హిస్టరీ, బోటనీ పరీక్షలు జరిగాయి. తిరుపతి జిల్లాలో 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొత్తం 2,146 మంది విద్యార్థులకు గాను 1,965 మంది పరీక్షకు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 181 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఆయన తెలియజేశారు.

February 27, 2026 / 03:01 PM IST

ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఆహ్వాన పత్రిక అందజేత

ATP: పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి తన కుమారుడు జనార్థన్ రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అసెంబ్లీ హాలులో ఎమ్మెల్యే పరిటాల సునీతకు అందజేశారు. గౌరు వెంకటరెడ్డి, చరితా రెడ్డి దంపతుల ఏకైక కుమారుడు జనార్థన్ రెడ్డి వివాహం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమార్తె సనాతనితో నిశ్చయమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా తోటి ప్రజాప్రతినిధులను పెళ్లికి ఆహ్వానించారు.

February 27, 2026 / 03:01 PM IST

బొత్స సత్యనారాయణకు అస్వస్థత.. HYDలో చికిత్స

HYD: వైసీపీ నేత, ఏపీ మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆయనను నిన్న హైదరాబాద్‌కు తరలించారు. బంజారాహిల్స్ సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

February 27, 2026 / 03:01 PM IST

‘పాలన చేయడం చేతకాకపోతే రాజీనామా చెయ్’

ADB: రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏఒక్కటి అమలు చేయలేదని, పాలనా చేయడం చేతకాకుంటే రాజీనామా చేయాలని బీజేపీ మండలాధ్యక్షుడు భిక్కు రాథోడ్ అన్నారు. శుక్రవారం నార్నూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 హామీలు అమలు చేయకుంటే జిల్లా కేంద్రంలో భారీగా ధర్నా, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.

February 27, 2026 / 03:01 PM IST