MHBD: జిల్లాలో జనవరిలో జరిగిన టెక్నికల్ కోర్స్ సర్టిఫికేట్ (TCC) ఫలితాలు విడుదలయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ తెలిపారు. https://www.bse.telangana.gov.in ద్వారా అభ్యర్థులకు సంబంధించిన పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. ఫలితాల సందేహాలకు 9849761012ను సంప్రదించాలన్నారు.
GNTR: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వాన్ని సహించేది లేదని కమిషనర్ కె. మయూర్ అశోక్ హెచ్చరించారు. ముత్యాలరెడ్డి నగర్, వికాస్ నగర్ తదితర ప్రాంతాల్లో సోమవారం పర్యటించిన ఆయన, పారిశుద్ధ్య పనులు నిర్దేశిత పద్ధతిలో జరగాలని, లేనిపక్షంలో సిబ్బందిని సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. ఖాళీ స్థలాలను గుర్తించి జీఎంసీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
TPT: గొల్లవాని గుంటలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ స్టేడియంను శాప్ ఛైర్మన్ రవి నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా స్టేడియంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్రీడాకారులకు త్వరలోనే ఈ స్టేడియం అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
WGL: వర్ధన్నపేట పట్టణంలో మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి సోమవారం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల పరిస్థితులను, మధ్యాహ్న భోజనం, నీటి సదుపాయం, చెట్ల తొలగింపు వంటి అంశాలను పరిశీలించారు. సమస్యలను అంచనా వేసి, నాణ్యమైన విద్య, భోజనం అందించడానికి తక్షణ చర్యలు తీసుకునే హామీ ఇచ్చారు.
TG: బాన్సువాడలో ఇటీవల జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. BJP జిల్లా కార్యాలయంలో బాధితుల కుటుంబ సభ్యులను బండి సంజయ్ పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇది పార్టీ పరంగా జరిగిన గొడవ కాదని, ఒక యువతి పట్ల అసభ్యంగా కొందరు ప్రవర్తించారని బాధితులు పేర్కొన్నారు. బాధితులను బెయిల్పై బయటకు తీసుకువస్తామని భరోసా ఇచ్చారు.
KNR: ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల 2025-26 సంవత్సరానికి జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. అభ్యర్థులు మార్చి 10లోగా తెలుగు విభాగంలో దరఖాస్తులు సమర్పించాలి అని ప్రిన్సిపాల్ కే. రామకృష్ణ, కోర్సు సమన్వయకర్త డా. బూర్ల చంద్రశేఖర్ సూచించారు. మరిన్ని వివరాలకు తెలుగు విభాగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.
NRPT: ఉట్కూర్ మండలం మల్లేపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో జిల్లా శిశు సంక్షేమ శాఖ కౌన్సిలర్ విజయ్ కుమార్ పాల్గొని బాలల హక్కులపై అవగాహన కల్పించారు. బాల్య వివాహ నిషేధ చట్టం, పోక్సో, విద్యా హక్కు చట్టం వంటి కీలక అంశాలను వివరించారు. బాల్య వివాహాల సమాచారాన్ని వెంటనే 1098 నంబర్కు తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కథలప్ప, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
PDPL: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్లు నూగిళ్ల మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ పాల్గొన్నారు.
NRPT: ప్రజావాణిలో అందిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ ఫణీందర్ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 21 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అర్జీలు పెండింగ్ పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
ASR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని డుంబ్రిగూడలోని కేజీబీవీ బాలికల పాఠశాలలో సోమవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాదన (డిబేట్) పోటీలు నిర్వహించారు. మహిళల సాధికారత, బాలికల విద్య ప్రాధాన్యం వంటి అంశాలపై విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించారు, సైబర్ భద్రత అంశాలపై సూచనలు చేశారు.
MDK: నార్సింగి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) ప్రీతి రెడ్డి బదిలీ అయ్యారు. గత ఐదు నెలలుగా ఇక్కడ సేవలందించిన ఆమెను మనోరాబాద్ మండలానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. నార్సింగి మండలంలో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు.
HNK: కాజీపేట దర్గా పరిసర ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, ఆ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలో అమలు చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు. మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దర్గా రైల్వే గేట్ నుంచి కడిపికొండ వరకు రోడ్డు నిర్మాణ పనులకు ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ పనులను సుగుమం చేశామని చెప్పారు.
NLG: పెద్దవూర మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్లో 65 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ కర్నాటి లింగారెడ్డి, హాలియా మార్కెట్ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ చెక్కులను అందజేశారు. అర్హులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
MLG: మంగపేట మండల కేంద్రంలోని కోమటిపల్లి గ్రామం నుంచి నర్సాయిగూడెం గ్రామానికి వెళ్లే మార్గంలోని కోమటిపల్లి వాగుపై నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులు సోమవారం సర్వే నిర్వహించారు. వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుండటంతో బ్రిడ్జి నిర్మాణం అవసరమైంది. సర్వే తర్వాత ఎస్టిమేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
SRCL: వేములవాడలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడలలో ఉత్తమ ప్రతిభను చాటుకొని జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎన్నికైన చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన సర్దని రాజేశం-పద్మ దంపతుల కుమారుడు వేణును సోమవారం శాలువాతో సన్మానించారు. తమ ఎంపీపీ పదవి కాలంలో ఎంతోమంది యువకులకు, విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలలో ప్రోత్సహించారు.