GNTR: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వాన్ని సహించేది లేదని కమిషనర్ కె. మయూర్ అశోక్ హెచ్చరించారు. ముత్యాలరెడ్డి నగర్, వికాస్ నగర్ తదితర ప్రాంతాల్లో సోమవారం పర్యటించిన ఆయన, పారిశుద్ధ్య పనులు నిర్దేశిత పద్ధతిలో జరగాలని, లేనిపక్షంలో సిబ్బందిని సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. ఖాళీ స్థలాలను గుర్తించి జీఎంసీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.