TPT: గొల్లవాని గుంటలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ స్టేడియంను శాప్ ఛైర్మన్ రవి నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా స్టేడియంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్రీడాకారులకు త్వరలోనే ఈ స్టేడియం అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.