తూ.గో: రాజమండ్రి రూరల్ కొంతమూరు సబ్స్టేషన్ పరిధిలో RDSS పనుల కోసం బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ శామ్యూల్ తెలిపారు. అంబేద్కర్ పేట, బ్రాహ్మణ అగ్రహారం, క్వారీ ఏరియా, అఫీషియల్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ అందుబాటులో ఉండదు. మరమ్మతులు సకాలంలో పూర్తి చేయడానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
TPT: శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు వైష్ణవి, జీవనరేఖ, మీనాక్షి ఇన్స్పైర్ అవార్డులకు ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని HM జయ కుమారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని, సరైన మార్గదర్శకత్వం అందితే అద్భుత విజయాలు సాధిస్తారన్నారు.
పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం ఆందోళన కలిగిస్తోందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ పేర్కొన్నాడు. భారత్లో తాము సురక్షితంగా ఉన్నామని, ఇవాళ సౌతాఫ్రికాతో జరిగే T20 WC సెమీస్ పోరుకు మాట్ హెన్రీ అందుబాటులో ఉంటాడని తెలిపాడు. కాగా శ్రీలంకను పాక్ నిర్ణీత స్కోర్కు పరిమితం చేయలేకపోవడంతో కివీస్ లక్కీగా సెమీస్ బెర్త్ కొట్టేసిన సంగతి తెలిసిందే.
VKB: వికారాబాద్లోని ప్రధాన కూడళ్లు, రహదారులు విద్యుత్ దీపాలు లేక చీకటిమయంగా మారాయి. మున్సిపల్ పరిధిలోని హైమాస్ లైట్లు వెలగకపోవడంతో రాత్రివేళ వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో హామీలిచ్చిన పాలకులు పట్టణ అభివృద్ధిని విస్మరించారని స్థానికులు మండిపడుతున్నారు.
VSP: చీపురుపల్లి మండలం సంకుపాలెం నుంచి కరకాం మీదుగా పెరిపి రోడ్డు అధ్వాన్నంగా మారింది. ఈ రోడ్డు మూడు సంవత్సరాలకు పైగా 3.5 కిలోమీటర్ల పొడవున పనులు ప్రారంభించారు. మిగతా పనులు మధ్యలో విడిచిపెట్టడం వల్ల రాళ్లు పైకి తేలుతున్నాయి. ఈ దారి గుండా ప్రయాణించే ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారి పనులు పూర్తి చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
KMM: బ్లోయర్లు, ఇతర పరికరాలతో మంటలను ఎలా అదుపు చేయాలో సిబ్బందికి జిల్లా అటవీ శాఖాధికారి (డీఎస్ఓ) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పలు సూచనలు చేశారు. ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్కును ఆయన మంగళవారం సందర్శించి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. వేసవిలో అడవులను కార్చిచ్చు నుంచి రక్షించుకోవడంపై సిబ్బంది నిర్వహించిన మాక్ డ్రిల్ను పరిశీలించారు.
AP: నకిలీ నోట్ల చలామణి కేసులో ఏడుగురు నిందితులకు విశాఖలోని NIA ప్రత్యేక కోర్టు జైలుశిక్ష విధించింది. నిందితులు అసోం, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. 2015లో వారు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చి చలామణి చేసినట్టు NIA నిర్ధారించింది.
గద్వాల జిల్లా అలంపూర్కు చెందిన యువ డాక్టర్ వెంకట కృష్ణారెడ్డి పెళ్లి నిశ్చయం కావడంతో కెనాడ నుంచి ఇండియాకు బయలుదేరాడు. అరబ్ దేశాల్లో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా అక్కడే చిక్కుకుపోయాడు. దీంతో ఇంట్లో మార్చి 1న జరగాల్సిన ప్రీ వెడ్డింగ్, ఇంటి దైవాల కార్యక్రమాలు వాయిదా వేశారు. కుమారుడిని క్షేమంగా ఇండియాకు రప్పించేందుకు ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని కుటంబ సభ్యులు కోరారు.
NRML: జిల్లాలో బుధవారం నుంచి ఈనెల 31 వరకు సదరం వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని డిఆర్డిఓ విజయలక్ష్మి ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్తో, ఇతర దివ్యాంగులకు వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని స్లాట్ బుక్ చేసుకుని మొబైల్కు సమాచారం వచ్చిన దివ్యాంగులు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
TG: 13 వర్సిటీల్లో ఖాళీగా ఉన్న సుమారు 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాంట్రాక్టు అధ్యాపకులను కొనసాగిస్తూనే ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఓయూలో 250, కాకతీయ వర్సిటీలో 145 పోస్టులు ఉన్నాయి. జీఓ 21లో సవరణలు చేసి, PHD వెయిటేజీని 10 నుంచి 30 మార్కులకు పెంచేలా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
BDK: మతసామరస్యాన్ని చాటుతూ లౌకిక విలువలను కాపాడుకుందాం అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం రాత్రి పాల్వంచ జామా మసీదులో ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రంజాన్ మాస స్ఫూర్తితో రాగద్వేషాలకు దూరంగా ఉండాలని తెలిపారు. సమాజంలో శాంతిని నెలకొల్పుతున్న పవిత్ర రంజాన్ మాసం ప్రజల మధ్య ఐక్యత భావం ఇఫ్తార్ విందు అన్నారు.
KNR: జమ్మికుంట పట్టణంలో బ్రిడ్జ్ మరమ్మతులకు నోచుకోవడం లేదు. గత నెల 6న జరిగిన బస్సు ప్రమాదంతో దెబ్బతిన్న ఆర్వోబీ బ్రిడ్జికి ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులు గడిచినా అధికారులు స్పందించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. మళ్లీ ప్రమాదాలు సంభవించక ముందే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
CTR: చిత్తూరు నగరానికి చెందిన 20 ఏళ్ల యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు చిత్తూరు రెండో పట్టణ సీఐ నెటికంటయ్య తెలిపారు. స్థానిక రిలయన్స్ మార్ట్లో పనిచేస్తున్న యువతి మంగళవారం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
NZB: జిల్లా ఇందల్వాయిలో విషాదం చోటుచేసుకుంది. ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రామ్ చరణ్(15) హాస్టల్లో ఉరేసుకున్నాడు. విద్యార్థి వద్ద ఫోన్ దొరకడంతో సమాచారం అందుకున్న ప్రిన్సిపల్ విద్యార్థితో అపాలజీ లెటర్ రాయించాడు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి మంగళవారం రాత్రి హాస్టల్ బాత్రూమ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.