TG: 13 వర్సిటీల్లో ఖాళీగా ఉన్న సుమారు 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాంట్రాక్టు అధ్యాపకులను కొనసాగిస్తూనే ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఓయూలో 250, కాకతీయ వర్సిటీలో 145 పోస్టులు ఉన్నాయి. జీఓ 21లో సవరణలు చేసి, PHD వెయిటేజీని 10 నుంచి 30 మార్కులకు పెంచేలా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.