• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

బుల్లెట్ల కలకలం.. నిందితుడు అరెస్ట్

AP: తూ.గో జిల్లా దేచర్లలో బుల్లెట్ల కలకలం రేగింది. UP నుంచి వచ్చి ఉంటున్న సమీర్ హుస్సేన్ నుంచి పోలీసులు 9mm పిస్టల్ బుల్లెట్లు 9, 315 రైఫిల్ కోసం ఉపయోగించే 8mm బుల్లెట్లు ఆరింటిని స్వాధీనం చేసుకున్నారు. UP వెళ్లివస్తుండగా పరిచయమైన ఆదిత్యరాజ్ ఇవి ఇచ్చాడని, అతని వద్ద గన్, బుల్లెట్లు ఉన్నాయని సమీర్ పేర్కొన్నాడు. ఆదిత్యపై ఇప్పటికే రాజమండ్రి PSలో పలు కేసులు ఉన్నాయి.

February 21, 2026 / 07:22 AM IST

బుల్లెట్లు స్వాధీనం.. పోలీసుల అదుపులో నిందితుడు

AP: తూ.గో. జిల్లాలో తుపాకీ బుల్లెట్లు కలిగి ఉన్న వ్యక్తిని కొవ్వూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూపీకి చెందిన సమీర్ హుస్సేన్ ఏడేళ్ల నుంచి దేచర్లలో నివాసం ఉంటున్నాడు. అయితే, అధికారుల సమాచారం మేరకు సమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. అతని నుంచి 9MM పిస్టల్ బుల్లెట్లు 9, 315 రైఫిల్‌లో ఉపయోగించే పాయింట్ 8MM 6 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

February 21, 2026 / 03:58 AM IST

రాళ్లతో దాడి చేసుకున్న రెండు వర్గాలు

TG: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఓ మార్ట్‌లో సౌండ్ సిస్టమ్ విషయంలో వివాదం తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.

February 21, 2026 / 12:30 AM IST

గంజాయితో పట్టుబడిన 11 మంది అరెస్టు

AP: విజయనగరం జిల్లా కోమటిపల్లిలో 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ భవ్యరెడ్డి వెల్లడించారు. గంజాయి విక్రయిస్తున్న నలుగురిని, తాగుతున్న ఏడుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గణేష్, అఖిల్, లంకచంద్రులు అనే వ్యక్తులు ఒడిశా రాయగడ నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తుండగా అరెస్టు చేశామన్నారు. ఈ కేసులో పట్టుబడిన బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు.

February 20, 2026 / 10:59 PM IST

క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

AP: నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన వేణు, వెంకటరమణను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.34.6 లక్షలు, ల్యాప్‌టాప్, టీవీ, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాల్లో ఉన్న రూ.కోటి 64 లక్షలను సీజ్ చేశారు. త్వరలోనే క్రికెట్ బెట్టింగ్ ముఠా నిర్వాహకులను పట్టుకుంటామని తెలిపారు.

February 20, 2026 / 07:52 PM IST

గంజాయి కేసు.. వైసీపీ MPTC అరెస్ట్

AP: గంజాయి కేసులో వైసీపీ ఎంపీటీసీ చెల్లూరి నగేష్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా భీమిలి మండలం దాకమర్రికి చెందిన నగేష్ బాబును అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా గంజాయి కేసులో నగేష్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా వైసీపీ ముఖ్య నాయకుడికి ఆయన అనుచరుడిగా ఉన్నారు.

February 20, 2026 / 07:28 PM IST

BREAKING: ఐదుగురు పిల్లలు మృతి

రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా నియామత్ పూర్‌లో భారీ విషాదం చోటుచేసుకుంది. ఓ పెళ్లి ఊరేగింపులోని డీజే వాహనం ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ లైన్‌కు తగలడంతో విద్యుత్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పిల్లలు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 06:33 PM IST

రెండేళ్ల బాలుడి గొంతుకోసి చంపిన అత్త

ఢిల్లీ ముఖర్జీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన రెండేళ్ల అల్లుడిని వాకింగ్‌కు తీసుకెళ్లి గొంతు కోసి చంపింది. ఈ ఘాతుకానికి పాల్పడిన సదరు మహిళపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 06:14 PM IST

సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు

TG: హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. రెండు రోజుల క్రితమే బాంబు ఉందని మెసేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆగంతకులు మళ్లీ బాంబు ఉన్నట్లు మెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన బాంబు స్క్వాడ్ కోర్టులో ఉన్న సిబ్బంది, ప్రజలను బయటకు పంపించి తనిఖీలు చేపట్టింది. కాగా, ఇటీవల బాంబు బెదిరింపు ఘటనలు పెరిగిన విషయం తెలిసిందే.

February 20, 2026 / 12:20 PM IST

BREAKING: అమీర్‌పేట్‌లో అగ్నిప్రమాదం

TG: అమీర్‌పేట్ మైత్రీవనంలోని ఓ అపార్ట్‌మెంట్ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కోచింగ్ సెంటర్‌లో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పలువురు విద్యార్థులు ఈ మంటల్లో చిక్కుకోవడంతో అక్కడ ఉన్న యువకులు, పోలీసులు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 20, 2026 / 11:40 AM IST

ఆన్‌లైన్ గేమింగ్.. రూ.13 వేల కోట్ల మోసం

TG: హైదరాబాద్‌లో భారీ ఆన్‌లైన్ గేమింగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం తనిఖీల్లో ఈ మాఫియా గుట్టురట్టు అయ్యింది. సిండికేట్‌తో ఈ ముఠా రూ.13 వేల కోట్ల మోసానికి పాల్పడినట్లు సోదాల్లో వెల్లడైంది. ఫేక్ కేవైపీతో షెల్ కంపెనీల ఆన్‌బోర్డింగ్ చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

February 20, 2026 / 11:12 AM IST

స్టేటస్‌లో క్వశ్చన్ పేపర్.. టీచర్ సస్పెండ్!

MP బుర్హాన్పూర్‌లో 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష జరుగుతుండగా, ఓ టీచర్ ఏకంగా ప్రశ్నపత్రాన్ని తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టింది. విద్యార్థులు కాపీ కొట్టేందుకు ఆమె ఈ పని చేసినట్లు తేలింది. దీనిపై సీరియస్ అయిన అధికారులు ఆ ఉపాధ్యాయురాలితో పాటు పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్‌లను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

February 20, 2026 / 10:37 AM IST

కత్తిపోట్ల కలకలం.. ఒకరి పరిస్థితి విషమం

TG: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. కుటుంబకలహాల కారణంగా ముగ్గురిపై కత్తితో దాడి జరిగింది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబీకులు సుమిత్ర, ప్రణయ్, కొమురమ్మపై రామ్‌దూత్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో వారికి తీవ్రంగా గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 10:05 AM IST

BREAKING: భారీగా డ్రగ్స్ స్వాధీనం

TG: HYDలోని అమీన్ పూర్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండున్నర కిలోల OPM డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న.. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ రవాణా చేస్తున్నారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

February 20, 2026 / 09:30 AM IST

దారుణం.. 20 మంది కలిసి ముగ్గురిపై దాడి

TG: HYD బాలాపూర్‌లో ముగ్గురు వ్యక్తులపై దాడి జరిగింది. 20 మంది దుండగులు వచ్చి ముగ్గురిపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పాత కక్షల కారణంగానే ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 08:20 AM IST