TG: రాష్ట్రానికి మరో ప్రపంచ వారసత్వ హోదా దక్కే దిశగా నిపుణులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. నారాయణపేట జిల్లాలోని ముడుమాల్లో ఉన్న దాదాపు మూడున్నర వేల ఏళ్ల నాటి ఆదిమానవుల స్మారక శిలల ప్రాంగణానికి.. యునెస్కో గుర్తింపు సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు NGRI, పరావస్తు శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.