»Ys Bhaskar Reddy Filed A Petition In The Telangana High Court
Telangana highcourtలో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్
YS Bhaskar reddy:మాజీ మంత్రి వైఎస్ వివేకానంద (vivekananda) హత్య కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. వివేకా కేసులో ఏ-4 దస్తగిరిని అఫ్రూవర్గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ కేసులో దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా సీబీఐ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని సీబీఐ విచారిస్తోన్న సంగతి తెలిసిందే.
YS Bhaskar reddy filed a petition in the telangana high court
YS Bhaskar reddy:మాజీ మంత్రి వైఎస్ వివేకానంద (vivekananda) హత్య కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. వివేకా కేసులో ఏ-4 దస్తగిరిని అఫ్రూవర్గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ కేసులో దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా సీబీఐ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని సీబీఐ విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దస్తగిరిని అఫ్రూవర్గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు.
దస్తగిరి స్టేట్ మెంట్ ఆధారంగా నేరంలోకి నెట్టడం సమంజనం కాదు.. సీబీఐ చెప్పినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇస్తున్నారు. వివేకా హత్య కేసులో దస్తగిరిది కీ రోల్.. అలాంటి ఆయనకు బెయిల్ ఇవ్వడం సరికాదన్నారు. ఆయుధం కొనుగోలు చేసింది కూడా దస్తగిరి అని చెప్పారు. అతనికి బెయిల్ ఇచ్చే సమయంలో సీబీఐ సహకరించిందని చెప్పారు. దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదు.. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని భాస్కర్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు.
దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి విచారణ జరుగుతుంది. ఎంక్వైరీ కూడా తుది దశకు చేరి ఉంటుంది. ఇటీవల తెలంగాణ హైకోర్టులో అవినాశ్కు చుక్కెదురైంది. తనను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరగా.. అలా ఆదేశించలేమని పేర్కొంది. ఆ తర్వాత అవినాశ్ ఢిల్లీలో సీఎం జగన్ను కలిశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని (Avinash) సీబీఐ పలుమార్లు విచారించింది. వైఎస్ వివేకా (ys viveka) హత్య కేసులో విచారణకు సంబంధించి అవినాష్ రెడ్డి ఇటీవల తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. సీబీఐ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లాయర్ సమక్షంలో విచారణ జరిగేలా చూడాలని కోరారు. సీబీఐ తనకు 150 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిందని.. ఆ నోటీసుల ప్రకారం తనను అరెస్ట్ చేయకూడదని సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. అప్పుడు అరెస్ట్ చేయొద్దని చెప్పింది. తాజాగా సీబీఐకి అరెస్ట్ చేయొద్దు అని చెప్పలేం అని పేర్కొంది.
వివేకా హత్య (viveka murder) జరిగిన చోట దొరికిన లెటర్ కీలక సాక్ష్యం అని అవినాష్ (Avinash) అంటున్నారు. ఆ లేఖను సునీత భర్త రాజశేఖర్ దాచారని ఆరోపించారు. హత్య జరిగిన మధ్యాహ్నం వరకు ఎవరికీ ఇవ్వలేదని.. గుండెపోటుతో చనిపోయారని తాను చెప్పలేదన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేసిందని చెప్పారు. ఆస్తుల కోసమే వివేకా హత్య జరిగిందని అవినాష్ అన్నారు. నిందితులతో సీబీఐ కుమ్మక్కైందని.. సునీతకు లీకులు ఇస్తోందని చెప్పారు. 2006 నుంచి వివేకాకు ఓ మహిళతో సంబంధం ఉంది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు పేరు మార్చుకున్నారు. వారికి షేక్ షహన్ షా అనే అబ్బాయి పుట్టాడని చెప్పాడు. రెండో వివాహాం అంటే మొదటి భార్య పిల్లలకు నచ్చదని అవినాష్ చెబుతున్నాడు. వివేకానంద పవర్ ఆఫ్ అటర్నీ కూడా సునీత అండ్ కో లాగేశారని.. ఈ క్రమంలో రెండో భార్య కుటుంబం హత్యకు పాల్పడి ఉండొచ్చని అవినాశ్ రెడ్డి సందేహాం వ్యక్తం చేశారు. ఆస్తుల కోసమే వివేకా హత్య జరిగిందని చెప్పారు.
అవినాష్ రెడ్డి తండ్రి భాష్కర్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించారు. ఇటీవల పులివెందులకు చెందిన పీబీసీ ఉద్యోగి సుధాకర్ను (sudhakar) విచారించారు. ఎంపీ అవినాష్రెడ్డితో (avinash reddy) ఫోటో దిగిన విషయంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు వివేకా ఇంటికి వచ్చిన వారిలో కొందరిని సీబీఐ విచారణకు పిలిచింది. వివేకా (viveka murder case) హత్య కేసులో ఇప్పటికే సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి (krishna mohan reddy), జగన్ భార్య భారతి (bharathi) పీఏ నవీన్ (naveen)ను విచారించారు.