టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్, సీనియర్ దర్శకుడు సాగర్ మరణాలను మరిచిపోక ముందే ప్రముఖ సింగర్ వాణీ జయరాం కన్నుమూశారు. అంతలోనే శనివారం టాలీవుడ్ నిర్మాత ఆర్వీ గురుపాదం కూడా తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు. తెలుగులో ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’, ‘పులి బెబ్బులి’ సినిమాలకు...
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణం నుంచి కోలుకోక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. ప్రముఖ సింగర్ వాణీ జయరాం (78) కన్నుమూశారు. చెన్నైలోని ఆమె నివాసంలో వాణీ జయరాం మృతిచెందినట్లు ఆమె బంధువులు వెల్లడించారు. ఇప్పటి వరకూ వాణీ జయరాం 20 వేల పాటలకు పైగా పాడారు. Veteran singer Vani Jayaram passes away pic.twitter.com/FkPfUZ9qXc — Sangeetha Kandavel ...
నమ్మించి మోసం చేశాడని ఓ ఎమ్మెల్యేపై అతడి స్నేహితురాలు సంచలన ఆరోపణలు చేసింది. తన ఎన్నికల కోసం డబ్బును సేకరించేందుకు ఎమ్మెల్యే సెక్స్ రాకెట్ కూడా నిర్వహిస్తున్నాడని గతంలో ఆరోపించిన ఆమె ప్రస్తుతం అతడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆమె వాదనలు విన్న కోర్టు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: తెలంగ...
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను ఆపే ఉద్దేశ్యం తమకు లేదని, కానీ యాత్ర సమయంలో కచ్చితంగా గైడ్ లైన్స్ పాటించాలని ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ స్పష్టం చేశారు. పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ మేరకే విధులను నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. పాదయాత్ర సమయంలో గైడ్ లైన్స్...
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి శనివారం సభలో ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై శనివారం చర్చించారు. రెండు సభల్లోనూ ప్రశ్నోత్తరాలను రద్దు చేసి గవర్నర్ ప్రసంగంపై చర్చకు వచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీర్మానాన్ని ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్యే వివే...
అధికారంలో ఉన్న బీజేపీకి ఊహించని ఫలితం దక్కింది. ఖాళీగా ఉన్న 5 స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే స్థానం దక్కించుకోగా.. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా.. ప్రతిపక్ష కూటమి మూడింటిని చేజిక్కించుకుంది. దీంతో మహారాష్ట్రలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మూడు స్థానాలు ఖాతాలో వేసుకున్న మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సత్తా చాటింది. నాగ్ పూర్, ఔరంగాబాద్, అమరావతి స్...
సుప్రీం కోర్టులో న్యాయమూర్తులు ఖాళీ పోస్టులను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో త్వరలోనే ఐదుగురు పేర్లును ఎంపిక చేస్తామని ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు ,హైకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘంగా పెండింగ్ లో పెట్టిన వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది. ఇదే అంశంపై విచారించిన జస్టిస్ ఎస్...
ప్రపంచ దేశాల్లో స్వలింగ సంపర్కుల వివాహం అధికారికంగా ఆమోదం. కానీ భారతదేశంలో అధికారికంగా కాదు కదా అనధికారికంగా కూడా స్వలింగ సంపర్కుల వివాహం ఆమోదం లేదు. ఓ అబ్బాయి మరో అబ్బాయిని.. అమ్మాయిలు అమ్మాయిలు ఇష్టపడడం.. వారితో ప్రేమలో మునిగివారిని స్వలింగ సంపర్కులు అంటాం. స్వలింగ సంపర్కుల వివాహాలను భారతదేశ సంప్రదాయాలు అడ్డుగా ఉన్నాయి. దేశంలో వారికి అండగా నిలిచే చట్టాలు కూడా లేవు. దీంతో ఇద్దరు యువకులు తమ పెళ...
నంద్యాల జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిశోర్ రెడ్డి తమ పార్టీలోకి వస్తారని టీడీపీ నాయకురాలు, మాజీ భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేతలతో ఆయన టచ్లో ఉన్నారని తెలిపారు. అయితే అతడి అక్రమాలు ఈ నెల 4వ తేదీన ఆధారాలతో సహా బయటపెడతామని అఖిల హెచ్చరించింది. అక్రమాలను బహిర్గతం చేస్తాను.. శనివారం నంద్యాలలోని గా...
ఆంధ్రప్రదేశ్ లో ప్రజల నుంచి వస్తున్న విమర్శలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విస్తృతంగా పర్యటిస్తున్న సమయంలో ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నారు. జగన్ ప్రభుత్వం వలన తమకు ఒరిగింది ఏమీ లేదని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలను ఏమాత్రం జంకు లేకుండా నిలదీస్తున్నారు. వీటిని తట్టుకోలేక మంత్రులు, ఎమ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే తాను తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరుతానని ప్రకటించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని.. తనపై ప్రభుత్వం నిఘా పెట్టిందని సంచలన ఆరోపణలు చేశారు. తాను వైసీపీకి దూరమవుతానని తెలి...
నందమూరి తారకరత్న ఆస్పత్రిలో వెంటిలేటర్పై ఉన్నాడు. తాజా ఆయన మెదడుకు స్కాన్ తీసినట్లు హిందూపూర్ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. తారకరత్నను చూసేందుకు వెళ్లిన ఆయన వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తారకరత్నకు వచ్చే రిపోర్టును బట్టీ మెదడు పరిస్థితి ఎలా ఉందనేది తెలుస్తుందని, దాన్ని బట్టి ఆయన్ని విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో కుటుంబీకులు ఉన్నారని లక్ష్మీనారాయణ వెల్లడించారు...
టీమిండియా క్రికెటర్ జోగిందర్ శర్మ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లతో పాటు దేశవాలీ క్రికెట్కు ఆయన గుడ్ బై చెప్పారు. శుక్రవారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)కు జోగిందర్ శర్మ తన రిటైర్మెంట్ లేఖను పంపాడు. ఇన్నిరోజులూ తనకు సహకరించిన బీసీసీఐకి, హర్యానా క్రికెట్ అసోసియేషన్కు, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిప...
టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, కళాతపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్ట శ్మశానవాటికలో ఆయన కుటుంబీకులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందుగా ఫిలిం చాంబర్లో కె.విశ్వనాథ్ పార్థీవదేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. భారీ సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి కె.విశ్వనాథ్కు నివాళులు అర్పించారు. అభిమానులు భారీగా తరలివచ్చి అంతిమ...
కళా తపస్వి, సీనియర్ దర్శకులు కే విశ్వనాథ్ మృతితో సినీలోకం దిగ్భ్రాంతికి లోనయింది. సినీ ప్రముఖులంతా విశ్వనాథ్తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. విశ్వనాథ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 92. విశ్వనాథ్ భౌతికకాయానికి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి నివాళులు అర్పించారు. అంతకుముందే మెగాస్టార్ చిరంజీవి విశ్వనాథ్ భౌతికకాయాన...