• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

కె.విశ్వనాథ్ మృతిపై సీఎం కేసీఆర్ భావోద్వేగం

ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథనైనా తమ అద్భుత ప్రతిభతో వెండి తెర దృశ్య కావ్యంగా మలిచే అరుదైన దర్శకులు విశ్వనాథ్ అని సీఎం కొనియాడారు. భారతీయ సామాజిక విలువలకు, సంస్కృతీ సంప్రదాయాలకు తమ సినిమాలో విశ్వనాథ్ పెద్ద పీట వేశారని గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సీఎం కేసీఆర్...

February 3, 2023 / 10:08 AM IST

నా తండ్రి తర్వాత కేసీఆర్ స్ఫూర్తి: కుమారస్వామి

తనకు తన తండ్రి హెచ్‌డీ దేవేగౌడ తర్వాత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయంగా ఎంతో స్ఫూర్తి అని కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి అన్నారు. రాయచూరులో నిర్వహించిన పంచరత్న రథయాత్రలో ఆయన మాట్లాడారు. నీటి పారుదల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో దేవేగౌడ, తర్వాత కేసీఆర్ అద్భుతమన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఎన్నో జిల్లాలకు నిరంతరం నీరు అందిస్తున్న కేసీఆర్ త...

February 3, 2023 / 09:29 AM IST

కే విశ్వనాథ్ మృతిపై చిరు, బాలకృష్ణ

కళాతపస్వి కే విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు పితృ సమానులని, అలాంటి వ్యక్తి ఇక లేరని తెలిసి నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. ఆయన గొప్పతనం గురించి మాటలు చాలవని, పండితులను, పామరులను కూడా ఒకేలా మురిపించే ఆయన సినిమాల శైలి ఎంతో విశిష్టమైనదన్నారు. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్‌ను కూడా బ్లాక్ బస్టర్ హిట్స్‌గా మలిచిన దర్శకులు మరొకరు లేరన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిన...

February 3, 2023 / 08:55 AM IST

వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. చెప్పుల దండతో స్వాగతం

ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు చుక్కలు చూపిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానికంగా పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి శ్రీనివాస రావు)కు ఊహించని సంఘటన ఎదురైంది. ఎమ్మెల్యే తమ గ్రామానికి రావొద్దని కోరుతూ రోడ్డ...

February 3, 2023 / 08:37 AM IST

బ్రేకింగ్: తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం

ప్రారంభానికి ముందే తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. సచివాలయం ప్రధాన గుమ్మంపై దట్టంగా మంటలు అలుముకున్నాయి. 11 ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ పనులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ప్రమాదం సంభవించిందని తెలుస్తున్నది. భవనం 5, 6వ అంతస్తుల్లో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే...

February 3, 2023 / 08:11 AM IST

పాటరాస్తూనే కన్నుమూత.. ఆస్కార్ బరిలో తొలి తెలుగు సినిమా విశ్వనాథ్‌దే

ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించిన కళాతపస్వి కే విశ్వనాథ్ 92 ఏళ్ల వయస్సులో గురువారం రాత్రి మృత్యు ఒడిలోకి చేరారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను అపోల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేశారు కాశీనాథుని విశ్వనాథ్. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోక సముద్రంలో మునిగింది. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, సిర...

February 3, 2023 / 08:55 AM IST

శంకరాభరణం రిలీజ్ రోజే.. శంకరా

భారతీయ సినిమాల్లో మరపురాని సినిమా శంకరాభరణం. గొప్ప సాంఘిక చిత్రాన్ని తెరకెక్కించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ ఆ సినిమా విడుదల రోజే కన్నుమూయడం మరింత విషాదాన్ని నింపింది. సినీ రంగానికి భారతీయ సంస్కృతిని అద్దిన గొప్ప మూర్తిమయుడు విశ్వనాథ్. ఆయన సినిమాలన్నీ సామాజిక ఇతివృత్తంతో కూడినవే. ఎలాంటి వంకర మాటలు, జుగుప్సకరమైన హాస్యం ఉండవు. అందుకే ఆయన సినిమాలన్నీ క్లాసిక్ చిత్రాలు అంటారు. ...

February 3, 2023 / 07:25 AM IST

కళా తపస్వి, డైరెక్టర్ విశ్వనాథ్ కన్నుమూత

తెలుగు సినీ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా…అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. కె విశ్వనాథ్ భౌతిక‌కాయాన్ని ఆయ‌న స్వ‌గృహానికి త‌ర‌లిస్తున్నారు. క‌ళాత‌ప‌స్వీ ఇక‌లేర‌ని తెలుసుకున్నతెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ షాక్‌కు గురైంది. కాశీనాధుని విశ్వ‌నాథ్ తెలుగులో ఎన్నో గొప్ప మ‌రుపురాని అజ‌రామ‌ర‌మైన చిత్...

February 3, 2023 / 08:55 AM IST

రాజీనామాకు సిద్ధమా: కోటంరెడ్డికి అనిల్ సవాల్

ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. అసలు ఫోన్ టాపింగ్ జరగనేలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిజమే అయితే తన సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి స్పీకర్ వద్దకు వెళ్దామని, ట్యాపింగ్ జరిగినట్లు నిరూపిస్తే నా రాజీనామాను యాక్సెప్ట్ చేయించుకుంటానని, జరగలేదని...

February 3, 2023 / 08:56 AM IST

రాజధాని.. మొదటికే మోసం: ఇన్వెస్టర్లు అందుకే ఏపీకి దూరం.. దూరం..

ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సన్నాహక సదస్సు మంగళవారం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగింది. అంతర్జాతీయ దౌత్యవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులు ఎందరో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. విశాఖపట్నం త్వరలో ఏపీ రాజధాని కాబోతుందని, రాబోయే కొద...

February 2, 2023 / 10:56 PM IST

1,500 మందిని తొలగించిన బైజూస్

గత కొన్ని రోజుల నుంచి వివిధ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, గూగుల్ వంటి సంస్థలు తమ కంపెనీలోని వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఆ జాబితాలోకి మరో కంపెనీ చేరింది. ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ అయిన బైజూస్ కూడా తమ సంస్థలోని ఉద్యోగుల్ని భారీగా తొలగించింది. ఇప్పటి వరకూ ఈ సంస్థ  చాలా మందిని రిక్రూట్ చేసుకుంటూ వచ్చేది. కానీ ఇప్పుడు ఉద్య...

February 2, 2023 / 08:55 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆ సీఎం పేరు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నేడు ఈ కేసుకు సంబంధించిన రెండో చార్జ్ షీట్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసింది. అందులో మొత్తం 17 మందిపై అభియోగాలను ఈడీ మోపింది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్లను కూడా ఈడీ అందులో నమోదు చేసింది. అదేవిధంగా అభిషేక్ బోయిన్ పల్లి, అమిత్ అరోరా, శరత్ చంద్రా...

February 2, 2023 / 05:59 PM IST

10 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్

మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఈ నెల 10వ తేది నుంచి ప్రారంభం కానుంది. ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీని ఐసీసీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించనుంది. అలాగే ఇండియాలో కూడా ఈ నెల 12వ తేది నుంచి మ్యాచులు జరుగుతాయి. తొలి మ్యాచ్ పాకిస్థాన్ తో ఉంది. ఇండియా తన దాయాదీ దేశం పాక్ తో తలపడనుంది. ఇటీవల ఐసీసీ మొదటిసారి అండర్19 మహిళా టీ20 ప్రపంచ కప్ నిర్వహించింది. అందులో టీమిండియా వరల్డ్ […]

February 2, 2023 / 06:07 PM IST

ముజాహిదీన్‌లను సృష్టించి తప్పు చేశాం: పాక్ మంత్రి సంచలనం

పెషావర్ మసీదు లోపల తమ భద్రతా దళాలపై ఘోర తీవ్రవాద దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది. దేశ ఇంటర్నల్ మినిస్టర్ రాణా సనావుల్లా జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ… ముజాహిదీన్‌లను ప్రపంచ శక్తితో యుద్ధానికి సిద్ధం చేయడం తాము చేసిన అతిపెద్ద పొరపాటు అన్నాడు. ముజాహిదీన్‌లను సృష్టించి పాక్ తప్పు చేసిందన్నాడు. మనం ముజాహిదీన్‌లను సృష్టించాం… ఇప్పుడు ఆ టెర్రరిస్టులు మనకే ఉగ్రవాదులు అయ్...

February 2, 2023 / 02:16 PM IST

సీఎం కేసీఆర్ కు షర్మిల సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఏమిటో తెలుసా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఊహించని కానుక పంపారు. ఆమె రాజకీయపరంగానే గిఫ్ట్ పంపింది. ప్రజా సమస్యలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తనతో కలిసి ప్రజా ప్రస్థానం పాదయాత్రకు రావాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు బూట్లు పంపించింది. ప్యాక్ చేసిన బూట్లను ప్రగతిభవన్ కు పంపిస్తున్నట్లు షర్మిల తెలిపారు. అప్పుడైనా ప్రజల కష్టాలు తెలుస్తాయని పేర్కొన్నా...

February 2, 2023 / 02:06 PM IST