కార్తికి గోన్సాల్వేస్(Kartiki Gonsalves) దర్శకత్వం వహించిన...గునీత్ మోంగా, అచిన్ జైన్ నిర్మించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్(The Elephant Whisperers) 95వ అకాడమీ అవార్డ్స్(Oscars Awards 2023)లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. ఈ కేటగిరీలోని ఇతర నాలుగు నామినీలు చిత్రాలను వెనక్కి నెట్టి భారతీయ చిత్రం అవార్డును దక్కించుకుంది.
TSPSC నిర్వహించే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్(TSPSC Paper Leak) వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ లీక్ విషయంలో ఇద్దరికి వాటా ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు ఈ పేపర్ కోసం రూ.14 లక్షలకు డీల్ కుదుర్చుకుని మరికొంత మందికి ఈ పేపర్ అమ్మినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో 13 మందిని పోలీసులు(police) అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, యూనివర్సిటీ అధ్యాపకులతో పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఇక వాలంటీర్లు అయితే వైసీపీ కార్యకర్తల కన్నా ఎక్కువగా పార్టీ కోసం పని చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా యథేచ్ఛగా అధికార పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓటర్లకు తాయిళాలు పంచుతూ కూర్చుంది. ఇదంతా బహిరంగంగా చేస్తుంటే పోలీసులు, ఎన్నికల సంఘం చూస్తూ ఉండిపోయింది.
ఈమధ్య కాలంలో చాలా మంది గుండెపోటు(Heart Attacks)కు గురై ప్రాణాలు విడుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటుతో మరణించేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. తాజాగా చోటుచేసుకుంటున్న గుండెపోటు హఠాన్మరణ ఘటనలపై డబ్ల్యూహెచ్ఓ(WHO) ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలు గుండెపోటు(Heart Attacks) రావడానికి గల కారణాన్ని వివరించింది. ఉప్పు(Salt)ను అధికంగా వ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran kumar reddy) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీ(BJP) కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్(Congress) పార్టీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరేందుకు కిరణ్ సిద్ధమయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీతో పాటు తెలంగాణలోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీజేపీ(BJP)లో చేరబోతున్న కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ...
ఇండియన్ రైల్వే(Indian Railway) కొత్త రూల్(Rule)ను తీసుకొచ్చింది. రైళ్లలో ప్రయాణించే వారికి కొత్త లగేజీ రూల్స్(Luggage Rules)ను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకూ ఉండే నిబంధన ప్రకారంగా రైల్వే ప్రయాణికులు తమతో ఎంత లగేజీనైనా తీసుకెళ్లవచ్చు. కానీ ఇకపై అలా తీసుకెళ్లడానికి వీల్లేదు. ఈ కొత్త విధానాన్ని రైల్వే ప్రకటించింది. అనుమతికి మించి లగేజీ(Luggage)ని తీసుకెళ్లే ప్రయాణికులకు రైల్వే భారీ జరిమానాను విధించన...
తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) సతీమణి శోభ(Shobha) ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో శోభను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి(AIG Hospital)కి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో కేసీఆర్ సతీమణి శోభ(Shobha)కు వైద్య చికిత్స అందిస్తున్నారు. వైద్యపరంగా ఆమెకు చేయాల్సిన పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్(CM KCR), ఆయన కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha), కుటుంబీకులు ఏఐజీ ఆస్పత...
రానా నాయుడు వెబ్ సిరీస్(rana naidu web series) ద్వేషించే అభిమానులకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నట్లు హీరో రానా(Daggubati Rana) ట్విట్టర్ వేదికగా మార్చి 12న పేర్కొన్నాడు. దీంతోపాటు ఈ సిరీస్ ను అభిమానించే వారికి సైతం ధన్యవాదాలు తెలిపాడు. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ప్లిక్స్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. మరోవైపు ఇంకొంత మంది ఫ్యాన్స్ మాత్రం ఈ సిరీస్ నిండా బూతులు, అడల్ట్ కంటెంట్ ఉందని కామెంట్లు చేస్త...
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గవ టెస్టు నాలుగో రోజులో ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat kohli) అరుదైన రికార్డును సృష్టించాడు. మూడేళ్ల తర్వాత తన మొదటి టెస్ట్ సెంచరీని విరాట్ సాధించాడు. దీంతో దేశంలో తన 50వ టెస్టు ఆడుతూ గవాస్కర్(Gavaskar) నం.4లో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ సాధించిన ఘనతను కోహ్లీ కూడా సాధించడం విశేషం.
ఇన్ స్టా గ్రాం(Instagram)లో ఓ యువతిని వేధించిన క్రమంలో ఆగ్రహం చెందిన ఆమె ఓ యువకుడిని చెప్పుతో కొట్టింది. ఈ సంఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి(kavali)లో చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వివరాలెంటో ఓసారి చూసేయండి మరి.
బెర్లిన్(berlin)లోని పబ్లిక్ కొలనుల వద్ద ఉన్న ఈతగాళ్లందరూ త్వరలో టాప్లెస్గా ఈత కొట్టడానికి అనుమతించబడతారని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే ఓ మహిళ టాప్లెస్గా స్నానం చేసేందుకు రాగా..అక్కడి నిర్వహకులు ఆమెను అలా చేయోద్దని తిరిగి పంపించారు. దీంతో ఆమె మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని సెనేట్ అంబుడ్స్పర్సన్ కార్యాలయంలో కంప్లైంట్ చేసింది.
54వ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) రైజింగ్ డే వేడుకలు హైదరాబాద్లో(hyderabad) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై పరేడ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన వారిసు చిత్రంలోని రంజితమే పాటకు(ranjithame song) పుదుకోట్టె జిల్లా కలెక్టర్ కవితా రాము(Kavitha Ramu) డ్యాన్స్(dance) చేసి అదరగొట్టారు. తన తోటి మహిళా సిబ్బందితో కలిసి వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా చేసిన ఈ వీడియో(viral video) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రైల్వే జాబ్స్ కుంభకోణం(railway jobs scam) కేసు(case)లో లాలూ ప్రసాద్ కుటుంబంపై (lulu Prasad Yadav's family) జరిపిన దాడుల్లో కోటి రూపాయల లెక్కలో చూపని నగదుతోపాటు రూ.600 కోట్ల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ(ED) తెలిపింది. దీంతోపాటు 24 చోట్ల జరిపిన సోదాల్లో 1900 డాలర్ల విదేశీ కరెన్సీ, 540 గ్రాముల బంగారం, 1.5 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు రికవరీ చేయబడ్డాయని వెల్లడించారు.
ఏపీ(ap)లో మార్చి 16 నుంచి 20 వరకు వర్షాలు కురిసే అవకాశం(rain forecast) ఉందని భారత వాతావరణ శాఖ(IMD) ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా దక్షిణ రాష్ట్రాలపై ప్రభావం పడనుందని తెలిపింది. ఈ క్రమంలో పంట కోత దశలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండి అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా గాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.