ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన సవాల్ విసిరారు. దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలకు రావాలని పిలుపునిచ్చారు. తాము కూడా ముందస్తు ఎన్నికలకు వస్తామని ప్రకటించారు. ఎవరు ఏమిటో ప్రజల వద్ద తేల్చుకుందామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో శనివారం పర్యటించిన కేటీఆర్ ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్రం నుంచి బీజేపీ నాయకులు తెలంగ...
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు ప్రాంతాలు, వివిధ స్మారక నిర్మాణాలు తదితర వాటి పేర్లు మారడం మొదలుపెట్టింది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పట్టణాల పేర్లు మారుస్తున్నారు. ఢిల్లీలోని రాజ్ పథ్ మార్గం పేరును కర్తవ్య పథ్ గా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని మరో ముఖ్యమైన ప్రాంతానికి పేరు మార్చింది. స్వాతంత్ర్యం పూర్తి చేసుకుని 75 ఏళ్లు పూర్తయిన ...
రవాణా సంస్థను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రెండు రోజుల్లో రెండు కీలకమైన కార్యక్రమాలను సజ్జనార్ ప్రారంభించారు. ఏఎమ్ 2 పీఎమ్ అనే సరికొత్త కొరియర్ సేవలను శుక్రవారం ప్రారంభించగా.. శనివారం ఆర్టీసీ బస్సుల్లో రేడియో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇలా రెండు రోజుల్లో రెండు కీలకమైన కార్యక్రమాలు ప్రారంభించి ప్రయాణికులకు ఆర్ట...
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో సొమ్మసిల్లిపడిపోయిన నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉంది. నందమూరి కుటుంబసభ్యులంతా తారకరత్న ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం మెరుగు పడాలని కుటుంబసభ్యులే కాకుండా నందమూరి అభిమానులు కోరుతున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే తన సోదరుడు ఆరోగ్యం బాగా లేక...
హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో రోడ్డు భారీగా కుంగిపోయింది. 10 అడుగుల మేర రోడ్డు కుంగింది. ఒక్కసారిగా రోడ్డు మీద గుంత పడటంతో అటువైపు వెళ్తున్న వాహనదారులు అందులో చిక్కుకున్నారు. రోడ్డు కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. ఆ గుంతలో ఒక ట్రక్కు ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయలయ్యాయి. హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 5 లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. మి...
ప్రపంచంలో పులులు ఎక్కువగా ఆఫ్రికాలో ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి ప్రపంచంలోనే అత్యధిక పులులు ఉండేది భారత్ లోనే. 70 శాతం పెద్ద పులులు ఇండియాలోనే ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర సర్కార్ స్వయంగా సుప్రీం కోర్టుకు వెల్లడించింది. పులుల వేట పట్ల కఠినంగా వ్యవహరించడం వల్ల వారి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో పెద్ద పులుల సంతతి భారత్ లో పెరిగిందని కేంద్రం తెలిపింది. దేశంలో ఏటా 6 శ...
కొంతమంది ఎమ్మెల్సీలు గవర్నర్ తమిళసాయి పట్ల ఉపయోగించిన భాషను చూసి మహిళా లోకం సిగ్గుతో తలదించుకుంటోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఇటీవల టీఆరెఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గవర్నర్ పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలున్నాయి. మహిళ పట్ల.. అది కూడా గవర్నర్ పట్ల ఇలాంటి మాటలు ఏమిటని అన్ని పార్టీలు, నేతలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈటల కూడా ఈ వ...
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. ఏపీపీఎస్సీ తన వెబ్ సైట్ లో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఉంచింది. మెయిన్స్ కు ఎంపికైన 6,456 మంది అభ్యర్దుల జాబితాలను వెబ్ సైట్ లో పొందుపరిచింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను సెలెక్ట్ చేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. 111 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ జనవరి 8న పరీక్ష నిర్వహించింది. ఈ వడపోత పరీక్షకు 87,718 మంది హాజరయ్యారు. మొత్తం 29...
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో పదవి లభించింది. ఆ పదవితో దేశంలోనే అరుదైన గౌరవం పొందారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నేషనల్ గైడ్స్ కమిషనర్ గా కవిత నియామకమయ్యారు. ఈ విషయాన్ని భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ కౌషిక్ ప్రకటించారు. ఏడాది పాటు కవిత ఆ పదవిలో ఉండనున్నారు. ఇన్నాళ్లు రాష్ట్రంలో చేసిన సేవలు ఇకపై దేశవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ...
సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా గణతంత్ర దినోత్సవం నాడు సొంత పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిని చెప్పుతో కొడతానని సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశామని.. ఇప్పుడు తమ కూతురును చదివించుకోలేమని పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ అధికారంలోకి రావడంతో ఎలాంటి ప్రయోజనం లే...
తెలంగాణలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో ఆత్మహత్యలు లేవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, మాజీ ఎంపీ జయరామ్ పంఘి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగా...
IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పూర్తయింది. పరిమిత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 176 పరుగులు చేసి భారత్ కు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో మిచెల్, కాన్వే రాణించారు. మిచెల్ నాట్ అవుట్ గా నిలిచి 30 బంతుల్లో 59 పరుగులు చేశాడు. కాన్వే 35 బంతుల్లో 52 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఫిన్ […]
సికింద్రాబాద్ లోని మారేడుపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మారేడుపల్లిలో ఉన్న శ్రీలా హిల్స్ అనే అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు చుట్టుపక్కన ఉండే ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. వెంటనే రంగంలోకి దిగిన ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా? ప్రమాదం ఎలా జరిగింది.. అనే విషయాలు తెలియాల్సి ఉంది.
యువగళం పేరుతో టీడీపీ యువనేత నారా లోకేశ్ ఈరోజు నుంచి ఏపీలో పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇవాళ ప్రారంభమైన పాదయాత్రలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర ప్రారంభం అయిన తర్వాత లోకేశ్ తో పాటు పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ...
టాక్ షోలలోనే నంబర్ వన్ గా నిలుస్తున్న అన్ స్టాపబుల్-2 షోకు సంబంధించిన మరో ప్రొమో విడుదలైంది. షో హోస్ట్ నందమూరి బాలకృష్ణ తన ప్రశ్నలతో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను ఇరకాటంలోకి నెట్టేశాడు. ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు, సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న సవాళ్లపై బాలయ్య ప్రశ్నలు అడగడంతో పవన్ కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అయినా కూడా పవన్ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. ఈ మధ్యలో రామ్ చరణ్, సాయిధ...