టెన్నిస్ ఆటలో రారాజుగా సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ -2023 టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫైనల్లో ఆదివారం గ్రీకు దిగ్గజం సిట్సిపాస్ తో హోరాహోరీగా తలపడి ఆఖరికి టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. గతేడాది కరోనా వ్యాక్సిన్ కారణంగా తీవ్ర విమర్శల పాలై ఆస్ట్రేలియన్ ఓపెన్ కు దూరమైన జకోవిచ్ ఈసారి కసితో ఆడి టైటిల్ ను ముద్దాడాడు. ఫైనల్ పోరు నువ్వానేనా అన్నట్టు సాగింద...
IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోయే రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందు బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లక్నోలో జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా నుంచి తుది జట్టులో చోటు దక్కించుకున్న వారిలో హార్థిక్ పాండ్యా(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్ మన్ గిల్, రాహుల్ త్రిపాఠీ, సూర్యకుమార్ యాదవ్(వైస్ కెప్టెన్), దీపక్ ...
ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం తప్పింది. ఘాట్ దిగుతున్న సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సు వేగాన్ని నియంత్రించుకోలేకపోవడంతో డ్యామ్ రక్షణ గోడను ఢీకొట్టింది. రక్షణ గోడ కూలిపోగా అక్కడే ఉన్న ఇనుప రాడ్ అడ్డు పడడంతో బస్సు ఆగిపోయింది. లేకుంటే బస్సు నేరుగా శ్రీశైలం డ్యామ్ లోకి పడిపోయి ఉండేది. ఈ ఘటనతో బస్సులోని 30 మంది ప్రయాణికులు భయాందోళన చెందారు. బస్సు ఆగిపోవడంతో దేవుడా అంటూ ఊపిరి పీ...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం పేరిట దంపతులు భారీ మోసం చేశారు. అమాయక ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయల మేర దండుకున్నారు. తమ పిల్లల భవిష్యత్ కోసం కష్టపడి సంపాదించిన సొమ్ము వారికి అప్పగించిన తల్లిదండ్రులు నిలువునా మోసపోయారు. మేనేజ్ మెంట్ కోటాలో ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు ఇప్పిస్తామని చెప్పడంతో ఆ దంపతులకు లక్షలు, వేలల్లో ఇచ్చి నట్టేటా మునిగారు. వారు బిచాణా ఎత్తేయడంతో లబోదిబోమంటూ బాధితులు పోలీస...
నాలుగేళ్ల కిందట వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు పలికిన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ పాలనలో ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పరోక్షంగా విమర్శలు చేశారు. తిరుమలలో అధికారుల తీరుపైన ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రముఖుల సేవలో టీటీడీ తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు...
బెంగళూరు నారాయణ హృదయాల ఆస్పత్రికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో పాటు నారా బ్రాహ్మణి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు. అవసరమైతే విదేశాల నుంచి ప్రత్యేక వైద్యుల్ని పిలిపించాలని కుటుంబీకులు కోరారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని, 48 గంటలు గడిస్తేనే ఏమైనా చెప్పగలమని వైద్య...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. శ్రీనగర్ లాల్ చౌక్ వద్ద ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రేపు శ్రీనగర్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు 21 ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పంపారు. 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను రాహుల్ ప్రారంభించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్...
ఆంధ్ర ప్రదేశ్ లో తాము ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదని మంత్రి అంబటి రాంబాబు శనివారం స్పష్టం చేశారు. ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికల పేరుతో ప్రతిపక్షాలు వారి పార్టీలో సీట్ల కోసం నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగు దేశం, జనసేన పొత్తుపై కూడా అంబటి స్పందించారు. ఎంతమంది కలిసి వచ్చిన 2024 ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు అన్నారు. మళ్లీ జగన్ ముఖ్య...
బెంగళూరు ఆస్పత్రిలో తారకరత్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రి వద్దకు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరే చేరుకుంటున్నారు. శుక్రవారం కుప్పంలో నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించగా ఆ పాదయాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న నారా లోకేష్ తో కలిసి నడుస్తుండగా మొదటి రోజే హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయాడు. దీంతో కా...
దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని నగరం లిమాలో బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 24 మంది దుర్మరణం చెందారు. ‘డెవిల్స్ కర్వ్’గా పిలిచే ప్రమాదకరమైన ప్రదేశంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని, అందులో 24 మంది మరణించారని పెరూ పోలీసులు తెలిపారు....
ఇరాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. భారీ భూకంపానికి ఇరాన్ లోని పలు ప్రాంతాల్లో భవనాలు, ఇండ్లు, పలు ప్రభుత్వ కట్టడాలు నేలమట్టం అయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 440 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైందని అధికారులు వెల్లడించారు. భూకంపం వల్ల ఖోయ్, అజర్ బైజాన్ ప్రావిన్స్ లోని పలు భవనాల...
బీసీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత చంద్రబాబుదైతే, తగ్గించిన ఘనత జగన్ దే అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళంలో భాగంగా రెండరోజు కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించిన జగన్ ను ఇంటికి పంపాల్సిందేనన్నారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే పాత పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 2...
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ యూనిట్ తెలంగాణలోని హనుమకొండలో సక్సెస్ మీట్ ను ఇవాళ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ కు భారీగా మెగా అభిమానులు తరలివచ్చారు. ఈనేపథ్యంలో గేట్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు మెగా అభిమానులకు గాయాలయ్యాయి. ఒక్కసారిగా అభిమానులంతా ముందుకు తోసుక...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు ఐదు గంటల పాటు విచారణ చేశారు. మళ్లీ విచారణకు పిలుస్తామన్నారని.. సీబీఐ విచారణకు సహకరిస్తానని అవినాశ్ తెలిపారు. అధికారులకు ఉన్న అనుమానాలకు సమాధానం ఇచ్చానని.. వీడియో, ఆడియోకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. తదుపరి విచారణ కోసం మళ్లీ పిలిచే అవకాశం ఉందని పేర్కొన్నారు...
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసినప్పుడు కూడా తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గానే ఉందని నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు. అయినా కూడా శాయశక్తులా తారకరత్నను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం గుండె నాళాల్లోకి రక్త ప్రసరణ కావడం లేదని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఆసుపత్రిలో బాలకృష్ణ ఉన్నారు. ఆసుపత్రికి చంద్రబాబు, పురందేశ...