అపర కుబేరుడు.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అతడి కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థ వేడుక రాధికా మర్చంట్ తో గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. భారీ ఖర్చుతో ప్రపంచంలో దొరికే అత్యంత అరుదైన పూలతో సుందరంగా ముంబైలోని అతడి నివాసాన్ని అలంకరించారు. గుజరాతీ సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. ముంబైలోని నివాసంలో సంప్రదాయబద్ధంగా జరిగ...
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి మరో షాక్ తగిలింది. ‘గడపగడపకు’లో ఇప్పటివరకూ అందించిన సహకారం మరువలేనిదని, తమకు ధన్యవాదాలంటూ ఎమ్మెల్యే ఆనంకు జీఎస్డబ్ల్యూఎస్ కమిషనర్ మెసేజ్ పంపారు. గడపగడపకు ఇకపై వెళ్లొద్దంటూ ఇన్డైరెక్ట్గా ఆనంకు సూచించారు. ప్రభుత్వ తీరుపై ప్రశ్నించిన ఆనంకు వైసీపీ వరుస వేధింపులకు దిగుతోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీలో ఆనం సీనియర్ నేత అయినప్పటిక...
హైదరాబాద్ లోని కూకట్పల్లిలో రసాయనాలు లీకయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్రమంగా రసాయనాలు నిల్వ చేస్తుండడంతో అవి లీకై తీవ్ర ఘాటు వాసనలు వెలువడ్డాయి. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. శ్వాస ఆడక అవస్థలు పడ్డారు. ఈ సంఘటన గురువారం ఉదయం 11:30 గంటలకు మొదలై 4 గంటల వరకు కొనసాగింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు చేరుకున్నారు. పోలీసులు, ఫైర్ స్టేషన్ సిబ్బ...
తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ప్రజల కష్టాల్ని తెలుసుకుంటూ వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతూ సీఎం జగన్ అందరి ఆశీర్వాదం పొందుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రోజా సీఎం జగన్ ప్రశంసలు కురిపించారు. వేమన పద్యాల్లాంటి స్వచ్ఛమైన మనసు తమ ముఖ్యమంత్రి జగన్ ది అని పేర్కొన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా కదిర...
బాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రాఖీ సావంత్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. నేడు ఆమెను అంధేరీ కోర్టులు పోలీసులు హాజరుపరచనున్నారు. రాఖీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె ఓ మహిళా మోడల్ ను అవమానపరిచే విధంగా చేసిన వీడియో, ఫోటో కొంత కాలంగా వైరల్ అయ్యిందని రాఖా సావంత్ పై ఆరోపణలు ఉన్నాయి. షెర్లిన్ చోప్రా ఫిర్యాదు మేరకు రాఖీ సావంత్ ను [&h...
కేరళలోని శబరిమలకు ఈసారి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ప్రతి ఏటా అయ్యప్ప భక్తులు మూడు నెలల పాటు స్వామిని దర్శించుకుంటారు. కేవలం మూడు నెలలే అయ్యప్ప స్వాముల సీజన్ అయినా కూడా శబరిమల వార్షిక ఆదాయం మాత్రం కోట్లలో ఉంటుంది. ఈ ఏడాది కూడా శబరిమల ఆలయానికి రూ.330 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు వెల్లడించింది. జనవరి 20వ తేదితో వార్షిక తీర్థయాత్ర ముగియనుండటం వల్ల ట్రావెన్ కోర్ దేవస్వ...
స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. రెండు రోజుల పాటు లాభాలతో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లకు నేడు బ్రేక్ పడినట్లయ్యింది. గురువారం ఉదయం నుంచి నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం వరకూ కూడా అదే హవాను కొనసాగించాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు, నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయింది. టాటా స్టీల్ 0.73%, పవర్ గ్రిడ్ 0.64%, టెక్ మహీంద్రా 0.49%, యాక్సిస్ బ్య...
బాహుబలి తర్వాత ఆ స్థాయి హిట్ పడితే చూడాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాహుబలి టైంలోనే కమిట్ అయ్యాడు కాబట్టి.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పైనే అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ చిత్రాలున్నాయి. వాటిలో బాహుబలి రేంజ్ హిట్ ఇచ్చేది కేవలం ‘సలార్’ మాత్రమేనని గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు. ప్రశాంత్ నీల్ ‘కెజియఫ్ చాప్టర్ 2’...
హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో నేడు న్యూజిలాండ్ తో టీమిండియా వన్డే మ్యాచ్ జరుగుతోంది. తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 రన్స్ చేసి భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ 208 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 145 బంతుల్లోనే గిల్ డబుల్ సెంచరీ చేయడం విశేషం. మొత్తం19 ఫోర్లు, 9 సిక్స్లతో […]
దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్థంతి సభలో మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. చాలామంది ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని నాని మండిపడ్డారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణనీయంగా నిలిచిపోయిన వ్యక్తి. ఆయన పేరు, ఫోటోలతో అనేకమంది నీచ రాజకీయాలు చేస్తున్నా...
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ కు ఈ సీజన్ మొదటి గ్రాండ్ స్లామ్ టోర్నీలో చుక్కెదురైంది. టాప్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన నాదల్ ఆశ్చర్యకరంగా రెండో రౌండ్ లోనే ఇంటి దారి పట్టాడు. బుధవారం పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో నాదల్ వెనుదిరిగాడు. అమెరికాకు చెందిన మెకెంజీ మెక్ డొనాల్డ్ వరుస సెట్లలో నాదల్ ను ఓడించాడు. అయితే మ్యాచ్ ప్రారంభం నుంచే నాదల్ కోర్టులో కాస్త తికమక పడ్డాడు. తుంటి [&hel...
అక్కినేని మూడో తరం హీరో అఖిల్ కటౌట్కి సాలిడ్ మాస్ సినిమా పడితే.. చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు. కానీ వాళ్ల కోరిక మాత్రం తీరడం లేదు. ఫస్ట్ ఫిల్మ్ అఖిల్తో మాస్ ఆడియెన్స్ను మెప్పించలేకపోయాడు అఖిల్. ఆ తర్వాత క్లాస్ సినిమాలకే పరిమితమయ్యాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఏజెంట్ మూవీతో మాసివ్ హిట్ అందుకోవడానికి.. గట్టిగా ట్రై చేస్తున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా ఏ...
నేడు ఉప్పల్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్ శుభ్ మన్ గిల్ సెంచరీ చేశాడు. మ్యాచ్ లో భాగంగా మొదట టాస్ నెగ్గిన టీమిండియా బ్యాటింగ్ చేపట్టింది. అయితే డ్రింక్స్ బ్రేక్ సమయానికి రెండు వికెట్లను కోల్పోయింది. భారత్ బ్యాటర్లు రోహిత్ శర్మ 34, విరాట్ కోహ్లీ 8 పరుగులు చేసి ఔట్ అయ్యారు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత కూడా వరుసగా ఇషాన్ కిషన్ 5, సూర్యకుమార్ యాదవ్ 31 […]
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె కుటుంబంలో విషాదం నెలకొంది. రఘు తండ్రి కుంచె లక్ష్మీనారాయణ రావు (90) మంగళవారం కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడకు చెందిన లక్ష్మీనారాయణరావు హోమియో వైద్యుడు. స్థానిక సాగునీటి సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. లక్ష్మీనారాయణ రావుకు భార్య వరహాలమ్మ, కుమారుడు రఘు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాల మధ్య జరిగిన మరుసటి...
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ…..త్వరలోనే కాంగ్రెస్ లోకి అడుగుపెడతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వరుణ్ గాంధీ… బీజేపీ విధానాలపై విమర్శలు చేస్తూ ఉండటంతో.. ఆయన పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం జరిగింది. కాగా… ప్రస్తుతం జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని ఇదే విషయం ప్రశ్నించగా… ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. వరుణ్ గాంధీ… కాంగ్రెస్ లోకి రారు ...