గణతంత్ర దినోత్సవ కార్యక్రమం కూడా తెలంగాణలో రాజకీయంగా మారింది. గవర్నర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అధికార పక్షంపై తీవ్రంగా స్పందించగా.. గణతంత్ర వేడుకలు రాజ్ భవన్ కే పరిమితం చేయడంపై బీజేపీ, కాంగ్రెస్ లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా ఇదే విషయమై సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. కేసీఆర్ వెంటనే వీఆర్ఎస్ తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని ధ...
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ప్రశాంతంగా సాగుతుండగా తెలంగాణలో మాత్రం వాడీవేడిగా జరిగాయి. మరోసారి రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గణతంత్ర వేడుకలు వివాదానికి కారణమయ్యాయి. రాజ్ భవన్ లో జెండా వందనం అనంతరం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఫామ్ హౌజ్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజ్...
నటసామ్రాట్ గా తెలుగు జాతి అభిమానం పొందిన విలక్షణ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావుపై చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించాడు. ఎవరినీ కించపరిచేలా తాను మాట్లాడలేదని స్పష్టత ఇచ్చాడు. అదంతా ప్రేమ, అభిమానంతో చేసిన వ్యాఖ్యలేనని తెలిపాడు. నాగేశ్వర్ రావు అంటే తనకు ఎంతో అభిమానమని, సొంతపిల్లల మాదిరి చూసుకున్నాడని పేర్కొన్నాడు. పైగా ఏఎన్నార్ తనకు బాబాయ్ లాంటి వ్యక్తి అని, ఆయన నుంచి ఎన్నో నేర...
ట్విట్టర్ యజమాని, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన పేరును మార్చుకుని వార్తల్లో నిలిచారు. ట్విట్టర్ లో తన ప్రొఫైల్ పేరును ఆయన ”మిస్టర్ ట్వీట్”గా మార్చుకున్నారు. ఇకపై ట్వీట్టర్ లో ఆయన్ని అందరూ మిస్టర్ ట్వీట్ అని పిలుస్తారు. సోషల్ మీడియాలో తన పేర్లు మార్చుకోవడం ఎలాన్ మస్క్ కు ఒక అలవాటు. ఇక నుంచి ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికపై ఆ పేరుతోనే కొనసాగనున్నారు. తాను కొత్త పేరు మార్చుకునే అవకాశం ఉండద...
ఈ మధ్యకాలంలో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ప్రముఖ మల్టీనేషనల్ టెక్ కంపెనీలు అయిన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇంకొంత మందిని కూడా సాఫ్ట్ వేర్ కంపెనీలు తొలగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఈ కంపెనీల జాబితాలోకి ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ, ఐటీ దిగ్గజం ఐబీఎం కూడా చేరింది. ఐబీఎం కంపెనీ తన సిబ్బందిలో 3900 మం...
పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ముప్పు కనిపించడం లేదని కేంద్ర జలవనరుల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధ్యయనం పూర్తి అయినట్లు వెల్లడించింది. మరోసారి అధ్యయనం అవసరం లేదని తెలిపింది. పోలవరం ప్రాజెక్టుతో తమ రాష్ట్రాలకు ముప్పు పొంచివుందని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆయా రాష్ట్రాలతో మాట్లాడి అభ్యంతరాలు తెలుసుకొని, అనుమానాలు ని...
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పౌర పురస్కరాలైన పద్మ అవార్డులను బుధవారం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన, అందిస్తున్న ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటిస్తుంది. ఈ సందర్భంగా బుధవారం మొత్తం 106 పద్మ అవార్డులు ప్రకటించింది. ఆరుగురికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ...
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పౌర పురస్కరాలైన పద్మ అవార్డులను బుధవారం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన, అందిస్తున్న ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటిస్తుంది. కళలు, సాహితీ, విద్య, వైద్యం, సామాజిక సేవ, వాణిజ్యం, వ్యాపారం తదితర విభాగాల్లో కేంద్రం అవార్డులు అందిస్తుంది.ఈ ఏడాది కూడా ...
ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 74వ గణతంత్ర దినోత్సవ (Republic Day) శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వంతో కూడిన సమర్ధవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగం గొప్పదనం, ప్రాధాన్యం వివరిస్తూనే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో తెలిపారు. సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లితేన...
తెలంగాణలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఏకంగా 60 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పోలీస్ శాఖను ప్రక్షాళన చేసినట్టు బదిలీలు ఉన్నాయి. ఒకే చోట అత్యధిక కాలం ఉన్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పలు జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు బదిలీ అయిన జాబితాలో ఉన్నారు. ఈ బదిలీల విషయమై రెండు రోజులుగా సీఎం కేసీఆర్ డీజీపీ, ఇతర ఉన్...
సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వందలు, వేల మంది రోజు తిరుగుతుంటారు. ఎవరైనా కథ వినకపోతారా? ఎవరైనా సినిమాల్లోకి తీసుకోకపోతారా? ఎవరైనా అవకాశం ఇవ్వకపోతారా? అంటూ ఫొటోలు, కథలు, రచనలు పట్టుకుని స్టూడియోలు, ప్రొడ్యూసర్, హీరోహీరోయిన్ల కోసం గాలిస్తుంటారు. ఈ సందర్భంగా కొందరి ఇళ్ల వద్ద పడిగాపులు కాస్తుంటారు. అపాయింట్ మెంట్ కోసం కాళ్లరిగేలా తిరుగుతారు. అలాంటి అమాయకులను కొందరు మోసగాళ్లు చాలా సులువుగా మోసం చేసేస్...
జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవీకి బోగ శ్రావణి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇబ్బందికి గురిచేస్తున్నారని తెలిపారు. మీడియా సమావేశంలోనే ఆమె కన్నీరు పెట్టుకున్నారు. బలహీన వర్గానికి చెందిన మహిళను రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘సంజయ్ దొర.. మీకు దండాలు దొర, మీ గడీల సంకెళ్లు తొలగించుకోవడం కోసమే రాజీనామా చేస్తున్నాను. మీ గడీల నుంచి బయటకు వస్తున్నా, ఇదిగో నా రాజీనామా ప...
గణతంత్ర వేడుకలను రాజ్ భవన్ లోనే నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో కాకుండా వేడుకలను రాజ్ భవన్ కే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ స్థానానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించడం లేదని...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి ఆంధ్ర ప్రదేశ్ లో ఘన స్వాగతం లభించింది. జనసేన వీర మహిళలు హారతులు ఇచ్చి, కొబ్బరికాయ కొట్టి ఆహ్వానించారు. జన సైనికులు ఈలలు, కేకలతో పవన్ పైన పూలు జల్లుతూ కేరింతలు కొట్టారు. పవన్ కళ్యాణ్ వారాహి పై నుండి అందరికీ అభివాదం చేశారు. ఈ వాహనం మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకుంటుంది. అంతకుముందు అర్ధరాత్రి ఈ వాహనం ఆంధ్రలోకి ఎంట్రీ ఇచ్చింది. వాహనానికి మూడు కార్లు ఎ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్రెడ్డి (YS Avinash Reddy) సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. అవినాష్రెడ్డికి మూడు రోజుల కిందట మొదటిసారి సీబీఐ నోటీసులు అందజేసింది. మంగళవారం (24వ తేదీ) విచారణకు రావాలని...