KDP: కడప పట్టణంలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. స్వరాజ్ నగర్ వద్ద పల్లెప వెంకటయ్య (27)ను సిమెంటు రాయితో కొట్టి అతి కిరాతకంగా చంపారు. విషయం తెలుసుకున్న రిమ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశామని తెలిపారు.