BHNG: చౌటుప్పల్ మండలం రెడ్డి బావి గ్రామ సమీపంలో అక్రమంగా 9 ఆవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం పశువులను, వాహనాన్ని స్థానిక పోలీసులకు అప్ప చెప్పారు. సూర్యాపేట నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు డ్రైవర్ చెప్పారు. ఈ ఘటనపై వాహనం సీజ్ చేసి డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.