ప్రకాశం: దొనకొండ మండలం మల్లంపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 544పై సోమవారం రాత్రి మాడమంచు ముసలయ్య గొర్రెల మందపైకి గుర్తుతెలియని లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 6 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 3 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. చింతకుంట్ల నుంచి తిరుప్పాయిపాలెం వైపు వెళ్తుండగా కోల్డ్ స్టోరేజ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.