మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జబల్పుర్ జిల్లా సిహోర పట్టణం వద్ద ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఏడుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీ నుంచి ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు హాజరై తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.