TG: HYD కేపీహెచ్బీ కాలనీలో దారుణం జరిగింది. అప్పుల బాధ తాళలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తొలుత భర్త రామకృష్ణ గొంతు కోసి అతడి భార్య చంపేసింది. అనంతరం తానూ గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రమ్యకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.