KDP: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీ సత్యసాయి జిల్లాలో తనకల్లు మండలంలోని కొక్కంటి సమీపంలో మంగళవారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో కడప జిల్లా కొండప్పగారిపల్లి, బురుజుపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యవసాయ కూలీలు మరణించారు. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. అగ్రహారంపల్లిలో టమాటా తోటలో పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.