KKD: రైలు ప్రమాదంలో గుర్తు తెలియని బాలుడు మృతి చెందిని ఘటన బుధవారం తునిలో చోటు చేసుకుంది. తుని రైల్వే గేటు నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు తాండవ రైల్వే బ్రిడ్జి దాటుతుండగా గుర్తు తెలియని బాలుడి(13)ని వైజాగ్ నుంచి వచ్చే రైలు ఢీ కొట్టడంతో బాలుడు మరణించాడు. బాలుడు నలుపు రంగు షర్టు ధరించి ఉన్నాడని తుని జీఆర్పీ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.