• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నాయుడుపేటలో జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

TPT: నాయుడుపేట వైసీపీ కార్యాలయంలో డాక్టర్ బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, జిల్లా నాయకులు మద్దాల సోమశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

April 5, 2026 / 07:21 PM IST

బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

ASR: అడ్డతీగల మండలం కొనలోవ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు ఇళ్లు పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ఆదివారం సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

April 5, 2026 / 07:14 PM IST

‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేయాలి’

AKP: జగ్జీవన్ రామ్ పేరుతో నిర్మించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని సీపీఐ పాయకరావుపేట మండల కార్యదర్శి వి. అర్జున్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక శబరి కాలనీలో జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు భూసేకరణకు రూ.1,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా బడ్జెట్‌లో రూ. 600 కోట్లు కేటాయించారన్నారు.

April 5, 2026 / 07:12 PM IST

హత్య కేసులో నిందితుల అరెస్ట్

CTR: తవణంపల్లి మండలంలో యువకుడి హత్య కేసులో పోలీసులు ప్రధాన నిందితుడు యువరాజ్(18)తో పాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ వివాదం కారణంగా 01-04-2026న కొత్త చెరువు వద్ద లవకుమార్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 03-04-2026న కేసు నమోదు చేసి, 05-04-2026న తెలగుండ్లపల్లి వద్ద నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.

April 5, 2026 / 07:00 PM IST

బాధిత కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం

ప్రకాశం: రాయవరం బస్సు ప్రమాదంలో మరణించిన కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి పంచాయతీ మండాదిరివారిపల్లి గ్రామానికి చెందిన ఉప్పు రమాదేవి కుటుంబాన్ని వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆదివారం పరామర్శించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ప్రకటించిన రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆమె మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

April 5, 2026 / 07:00 PM IST

క్యాన్సర్ బాధితురాలికి ఆర్థిక సహాయం

విశాఖ దక్షిణ నియోజకవర్గం 34వ వార్డు కొబ్బరితోట ప్రాంతానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు చింతల సత్యను మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆదివారం పరామర్శించారు. ఈ మేరకు ఆమె అనారోగ్య పరిస్థితిని తెలుసుకొని, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తన సొంత నిధుల నుంచి రూ.5,000 నగదు, బియ్యం బస్తా అందజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

April 5, 2026 / 07:00 PM IST

ఘనంగా జగ్జవన్ రామ్ జయంతి వేడుకలు

W.G:పెంటపాడు మండలం ఉమామహేశ్వరం, కె. పెంటపాడు, రాచర్ల, ప్రత్తిపాడు, పట్టింపాలెం గ్రామాలలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వల బాబ్జీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారని కొనియాడారు.

April 5, 2026 / 06:41 PM IST

సైక్లింగ్‌లో మౌలాబికి సిల్వర్ పతకం

NDL: అమరావతిలో జరిగిన రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలలో ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని మౌలాబి ప్రతిభ కనబరిచి మూడో స్థానం సాధించింది. ఈ విజయంతో ఆమెకు సిల్వర్ పతకం లభించింది. ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు ఇవాళ అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో పాల్గొని బంగారు పతకం సాధించడం తన లక్ష్యమని మౌలాబి పేర్కొన్నారు.

April 5, 2026 / 06:28 PM IST

పోలీసు చట్టాలపై ప్రజలకు అవగాహన

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో డెంకాడ ఎస్సై ఏ. సన్యాసినాయుడు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పోలీసు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముఖ్య కూడళ్లలో భారీ ఫ్లెక్సీలను ఆదివారం ఏర్పాటు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని వీటి ద్వారా సూచించారు.

April 5, 2026 / 06:23 PM IST

‘ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలి’

AKP: కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంపై ప్రభుత్వం స్పందించాలని సీపీఐ నేతలు వెంకటేశ్వరరావు, వైఎన్ భద్రం డిమాండ్ చేశారు. అనకాపల్లిలో ఆదివారం వారు మాట్లాడుతూ.. సేవలు నిలిచిపోవడంతో పేద రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరణాలు జరిగితే వాటిని ప్రభుత్వ హత్యలుగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు.

April 5, 2026 / 06:22 PM IST

సంస్థాగత ఎన్నికలలో గెలుపు పై ప్రతి ఒక్కరు కృషి చేయాలి

ELR: జిల్లా జనసేన కార్యాలయంలో ఆదివారం జనసేన నాయకులు, వీర మహిళలతో జిల్లా ఇన్‌ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే సంస్థగత ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని వివరించారు. జనసేన పార్టీకి కార్యకర్తలు, వీర మహిళలు బలమని వివరించారు. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు.

April 5, 2026 / 06:21 PM IST

పుట్టపర్తిలో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కలెక్టర్

సత్యసాయి: జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ తెలిపారు. అర్జీదారులు నేరుగా కలెక్టరేట్‌కు రాకుండా ‘మీ కోసం’ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చచి పేర్కొన్నారు.

April 5, 2026 / 06:20 PM IST

‘పిల్లల మొబైల్ వినియోగంపై నిఘా పెట్టాలి’

ASR: సెలవుల్లో ఇంటికి వచ్చే పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని గూడెం కొత్త వీధి ఎస్సై సురేష్ ఆదివారం సూచించారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని హెచ్చరించారు. మొబైల్ ఫోన్ల వినియోగాన్ని గమనించాలని తెలిపారు. పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

April 5, 2026 / 06:18 PM IST

అమరావతికి చట్టబద్ధత రంగోళ్లతో తెలుగు మహిళల మద్దతు

KRNL: రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా ఇవాళ ఎమ్మిగనూరులో తెలుగు మహిళలు ఇళ్ల ముందు రంగోలి ముగ్గులు వేసి తమ మద్దతును తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అమరావతి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రబిందువుగా నిలుస్తుందని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆశయాలకు ప్రతీకగా రూపుదిద్దుకుంటోందన్నారు.

April 5, 2026 / 06:16 PM IST

జిల్లాలో మంత్రి సుడిగాలి పర్యటన

పార్వతీపురం మున్సిపాలిటీ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర, కలెక్టర్ డా. ప్రభాకరరె డ్డితో కలసి ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా తాగునీరు, డ్రైనేజ్ మరియు రహదారుల అభివృద్ధిపై కీలక సమీక్ష నిర్వహించారు.

April 5, 2026 / 06:11 PM IST