• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘చిన్నారులను ప్రభుత్వ బడిలో చేర్పించండి’

SKLM: మందస మండలం పిడి మందసలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈమేరకు తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో లభించే ఉచిత సదుపాయాలు, నాణ్యమైన బోధన గురించి వివరించారు. పిల్లలను ప్రభుత్వ బడికి పంపి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. పాఠశాల సమగ్ర అభివృద్ధికి గ్రామస్థుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు.

April 14, 2026 / 04:15 PM IST

అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు: బుగ్గన

KRNL: చంద్రబాబు ఎప్పుడూ అమరావతి గురించే మాట్లాడుతారు తప్ప, వెనుకబడిన ప్రాంతాల గురించి ఎందుకు ఆలోచించరని ఇవాళ  మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతి ప్రాంతం రాజధానికి అనువైనది కాదని గతంలో శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని పేర్కొన్నారు. ‘MAVIGUN’తో కేవలం రూ.10-20వేల కోట్లతో రాజధాని నిర్మించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.

April 14, 2026 / 04:13 PM IST

ఎలుకల మందు తిని యువతి ఆత్మహత్యాయత్నం

ప్రకాశం: కనిగిరి మండలంలో శంఖవరంకు చెందిన తమ్మిశెట్టి పద్మ మంగళవారం ఎలుకలు మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. కాగా తనకు పిల్లలు లేరని, అనారోగ్య కారణాలు ఉన్నాయని మానసికంగా కుంగిపోయి, మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

April 14, 2026 / 03:58 PM IST

‘దేశ మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్’

W.G: భీమవరం, పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి డీఎస్పీ రఘువీర్ విష్ణు పుష్పమాల వేసి మంగళవారం నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్త, భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, న్యాయవాది, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యాలయంలో డీఎస్పీ కార్యాలయ సిబ్బంది, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

April 14, 2026 / 03:57 PM IST

‘సమానత్వం కోసం అంబేద్కర్ పోరాటం ఆదర్శం’

GNTR: భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గుంటూరు లాడ్జ్ సెంటర్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు.

April 14, 2026 / 03:56 PM IST

‘రేపటి నుంచి బేతంచెర్లలో జనగణన’

NDL: బేతంచెర్ల మండలంలో రేపటి నుంచి 30 వరకు నిర్వహించే జనాభా గణనకు ప్రజలు సహకరించాలని మంగళవారం తహసీల్దార్ నాగమణి కోరారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వివరాలు అందజేయాలని చెప్పుకొచ్చారు. సందేహాల నివారణకు 1885 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ఆమె స్పష్టం చేశారు.

April 14, 2026 / 03:51 PM IST

స్వీయ గణనపై అవగాహన కార్యక్రమాలు

VSP: జనగణన-2027లో భాగంగా స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన అవసరమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే, https://se.census.gov.in⁠ ద్వారా ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. స్వీయ గణనలో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.

April 14, 2026 / 03:48 PM IST

సైకిల్ తొక్కిన మంత్రి సత్యకుమార్

SS: ధర్మవరం నియోజకవర్గంలోని 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ 2000 సైకిళ్లను పంపిణీ చేశారు. విద్యార్థుల చదువుకు రవాణా ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా సైకిల్ తొక్కి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

April 14, 2026 / 03:45 PM IST

అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ

AKP: పాయకరావుపేట గ్రామసభను స్థానిక పంచాయతీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో లవరాజు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే, ఇంటి పన్నులు బకాయిలు లేకుండా చెల్లించాలన్నారు. అలాగే, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను చక్కదిద్దాలని పలువురు నాయకులు విజ్ఞప్తి చేశారు.

April 14, 2026 / 03:44 PM IST

అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి: మంత్రి

NDL: జిల్లాలో అగ్నిప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఇవాళ నుంచి ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాల్లో వారు పాల్గొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని అధికారులను కోరారు.

April 14, 2026 / 03:40 PM IST

ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య: నిమ్మనిపల్లి మండలంలో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఇవాళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

April 14, 2026 / 03:40 PM IST

‘విద్యతోనే అభివృద్ధి సాధ్యం’

E.G: విద్యతోనే అభివృద్ధి జరుగుతుందని దేవరపల్లి సొసైటీ ఛైర్మన్ ఉప్పులూరి నోమేంద్ర రామారావు అన్నారు. దేవరపల్లి స్థానిక దళిత వాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 14, 2026 / 03:35 PM IST

సీఐటీయూ రాష్ట్ర మహాసభలకు పిలుపు

నంద్యాలలో ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగే సీఐటీయూ 17వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి టీ. శివరాం మంగళవారం పిలుపునిచ్చారు. ప్యాపిలిలో కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. మహాసభల్లో కార్మిక సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

April 14, 2026 / 03:35 PM IST

పేదల సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే

TPT: సుళ్లూరుపేట బొగ్గుల కాలనీలో 150 దళిత, గిరిజన కుటుంబాలకు రూ.1.8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 2KW సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు వీటిని పూర్తిగా ఉచితంగా అందని, దీనివల్ల ఒక్కో కుటుంబం ఏడాదికి సుమారు రూ.20 వేల వరకు విద్యుత్ ఖర్చును ఆదా చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. పేదల సంక్షేమమే ధ్యేయమని ఆమె పేర్కొన్నారు.

April 14, 2026 / 03:34 PM IST

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి..!

GNTR: అమరావతిలో నందమూరి బసవతారక రామారావు క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు కానుంది. దీనిని రూ.650 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్నారు. అత్యాధునిక వసతులతో 500 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతుల కోసం సంబంధిత అధికారులకు తాజాగా దరఖాస్తు చేశారు. త్వరలోనే ఈ ఆసుపత్రి పనులు ప్రారంభం కానున్నాయి.

April 14, 2026 / 03:30 PM IST